హాకీస్టిక్తో నీ మాయాజాలం మరువలేనిది: మోదీ
హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ 155వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ..
ధ్యాన్చంద్కు నివాళి అర్పించిన ప్రధాని
దిల్లీ: హాకీ లెజెండ్ మేజర్ ధ్యాన్చంద్ 155వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు ఘన నివాళి అర్పించారు. హాకీలో ఆయన చేరుకున్న శిఖరాలను ఈ సందర్భంగా కొనియాడారు. ‘జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని దిగ్గజం ధ్యాన్చంద్కు నివాళి అర్పిస్తున్నా. హాకీ స్టిక్తో ఆయన చేసిన మాయాజాలం చిరస్మరణీయం. దేశ క్రీడాకారుల విజయానికి దోహద పడిన వారి కుటుంబాలకు, కోచ్లకు, సహాయక సిబ్బందికి కూడా ధన్యవాదాలు తెలియజేయాల్సిన రోజు’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు. ‘దేశం గర్వించేలా అనేక పతకాలు సాధించిన మన క్రీడాకారులకు ఈ రోజు అంకితం’ అని అన్నారు. దేశంలో క్రీడాభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలు, వ్యాయామాన్ని వారి జీవితంలో భాగం చేసుకోవాల్సిందిగా దేశ ప్రజలను మోదీ ఈ సందర్భంగా కోరారు.
ధ్యాన్చంద్ 1905లో జన్మించారు. భారత హాకీ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ ఎన్నో ఘనతలు సాధించారు. ఆయన జట్టు సభ్యుడిగా ఉన్న 1928, 1932, 1936 ఒలింపిక్స్లో భారత్ వరుస స్వర్ణాలను గెలుచుకుంది. ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవాన్ని జరుపుకొంటాం. ఈసందర్భంగానే భారత ప్రభుత్వం ప్రతి ఏడాది జాతీయ క్రీడా పురస్కారాలు అందిస్తోంది. క్రీడా అత్యున్నత పురస్కారం రాజీవ్గాంధీ ఖేల్రత్నతోపాటు అర్జున, ద్రోణాచార్య, ధ్యాన్చంద్ పురస్కారాలు ఈ జాబితాలో ఉన్నాయి.
మరోవైపు పలువురు టీమ్ఇండియా క్రికెటర్లు కూడా క్రీడా దినోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో స్పందించారు. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్, మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, రోహిత్శర్మ, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్ ట్వీట్లు చేసి ఆటపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
ఎవరేమన్నారు..
* ఆటలాడటం అంటే కేవలం ఎంటర్టెయిన్మెంట్ మాత్రమే కాదు, అవి మనల్ని శారీరకంగా, మానసికంగా దృఢంగా చేస్తాయి. మనతో పాటు పక్కనున్న వారిని కూడా రోజూ ఎంతో కొంత సమయం ఆడేందుకు ప్రోత్సహించాలి. దాంతో ఈ భారత దేశం మరింత ఆరోగ్యంగా, శక్తిమంతంగా మారుతుంది. -సచిన్ తెందూల్కర్
* భారత రత్న మేజర్ ధ్యాన్చంద్ జయంతి సందర్భంగా నివాళులు. భారత రత్న అయిన ఒక దిగ్గజం మరో భారత రత్న పురస్కారాన్ని అందుకోవడం ప్రత్యేకమైన సందర్భం. -వీరేంద్ర సెహ్వాగ్
* నేనెక్కడికి వెళ్లినా నాకిష్టమైన ఆట ఆడేందుకు సిద్ధంగా ఉంటా. ఈ జాతీయ క్రీడా దినోత్సవం మనం మరిన్ని క్రీడలు ఆడేలా ప్రోత్సహించాలి. అది మనకు ఆనందాన్ని మిగల్చాలి. -రోహిత్శర్మ
* క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేజర్ ధ్యాన్చంద్ సేవల్ని గుర్తు చేసుకుంటున్నా. అలాగే ఈ ఆట నాకు మిగిల్చిన అనుభూతులను కూడా. ఈ దేశానికి ఎప్పటికీ రుణపడి ఉంటా. -శిఖర్ధావన్
* నేనెంతో ఇష్టపడే దేశం తరఫున అంతే ఇష్టపడే క్రికెట్ ఆడటం.. గొప్ప అవకాశంగా భావిస్తున్నా. అందుకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడినే. -శ్రేయస్ అయ్యర్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి చెక్
చెన్నై సూపర్ కింగ్స్కు ఎదురు దెబ్బ! ప్లేఆఫ్స్ లక్ష్యంగా సాగుతున్న ఈ డిఫెండింగ్ ఛాంపియన్కి.. ఈ సీజన్లో పెద్దగా రాణించలేకపోతున్న గుజరాత్ టైటాన్స్ కీలక సమయంలో షాక్ ఇచ్చింది. -
అది అగార్కర్ నిర్ణయమే
సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్లను తప్పించాలనేది పూర్తిగా సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్ నిర్ణయమని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. -
నీరజ్.. 2 సెం.మీ తేడాతో
పారిస్ ఒలింపిక్స్లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగబోతున్న భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఆ మెగా ఈవెంట్ ముంగిట గొప్ప ప్రదర్శన చేశాడు. డైమండ్ లీగ్లో అతను స్వర్ణం కోసం గట్టిగా పోరాడాడు. -
ఇదేం పద్ధతి?
టీమ్ఇండియా సీనియర్ పేసర్ మహమ్మద్ షమికి కోపమొచ్చింది. సన్రైజర్స్ చేతిలో ఓటమి తర్వాత లఖ్నవూ సారథి కేఎల్ రాహుల్తో ఆ ఫ్రాంఛైజీ యజమాని సంజీవ్ గోయెంకా వ్యవహరించిన తీరుపై షమి మండిపడ్డాడు. -
బ్రిజ్భూషణ్కు షాక్
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ శరణ్సింగ్పై లైంగిక వేధింపులు, ఇతర అభియోగాలు నమోదు చేయాలని దిల్లీ కోర్టు శుక్రవారం ఆదేశించింది. -
హార్దిక్ ధైర్యాన్ని నటిస్తున్నాడు
ముంబయి ఇండియన్స్ సారథి హార్దిక్ పాండ్య కెప్టెన్సీ శైలిని దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్ తప్పుబట్టాడు. కెప్టెన్గా అతడి వ్యవహార శైలి సహజంగా అనిపించడం లేదన్నాడు. -
మన్రో వీడ్కోలు
టీ20 ప్రపంచకప్లో ఆడే న్యూజిలాండ్ జట్టులో చోటు దక్కకపోవడంతో ఆ జట్టు బ్యాటర్ కొలిన్ మన్రో అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికాడు. -
కప్పులో కోహ్లి ఓపెనింగ్ చేయాలి: గంగూలీ
టీ20 ప్రపంచకప్లో భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని ఓపెనర్గా ఆడించాలని మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ఐపీఎల్లో విరాట్ ఫామ్ను జట్టు మేనేజ్మెంట్ పొట్టి కప్పులో ఉపయోగించుకోవాలని సూచించాడు. -
మూడో స్థానంలో ప్రజ్ఞానంద
సూపర్బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ చెస్ టోర్నీ ర్యాపిడ్ విభాగంలో ప్రజ్ఞానంద శుక్రవారం మూడో స్థానంలో నిలిచాడు. అతను మొత్తం 9 రౌండ్ల నుంచి 10 పాయింట్లు సాధించాడు. -
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
దిల్లీ తరఫున అత్యుత్తమ ప్రదర్శన చేస్తూ ఇటీవల టీ20 ప్రపంచ కప్ కోసం ప్రకటించిన జట్టులో చోటు దక్కింది. అయితే, ట్రావెల్ రిజర్వ్ అయినప్పటికీ.. ఇదొక ముందడుగుగా భావిస్తున్నాడు ఆ క్రికెటర్.
తాజా వార్తలు (Latest News)
-
రూ.10 లక్షలిస్తే నేనే రాసిపెడతా.. ‘నీట్’లో ఓ టీచర్ నిర్వాకం
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!