IND vs ENG: ఇంగ్లాండ్ బ్యాటర్లు అలా చేస్తే నాకే లాభం: జస్ప్రీత్ బుమ్రా
ఇంగ్లాండ్ ‘బజ్బాల్’ వ్యూహం గురించి భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) మాట్లాడాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడితే తనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నాడు.
ఇంటర్నెట్ డెస్క్: పునరాగమనం తర్వాత టీమ్ఇండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) అదరగొడుతున్నాడు. వన్డే ప్రపంచకప్లో సత్తా చాటిన అతడు.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్లోనూ రాణించాడు. ఇప్పుడు ఇంగ్లాండ్తో జరిగే ఐదు టెస్టుల సిరీస్లో ఉత్తమ ప్రదర్శన చేయాలనే సంకల్పంతో ఉన్నాడు. జనవరి 25 నుంచి హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో భారత్, ఇంగ్లాండ్ (IND vs ENG 2024)ల మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది. బజ్బాల్ ఆటతో టీమ్ఇండియా (Team India)ను ఇరుకున పెట్టాలని ఇంగ్లాండ్ ప్రణాళికలు రచిస్తోంది. ప్రత్యర్థి జట్టు బజ్బాల్ వ్యూహం గురించి బుమ్రా మాట్లాడాడు. ఇంగ్లాండ్ బ్యాటర్లు దూకుడుగా ఆడితే తనకే ఎక్కువ ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నాడు.
‘‘ఇంగ్లాండ్ బజ్బాల్ను నేను పరిగణనలోకి తీసుకోవడం లేదు. కానీ, ఇటీవల కాలంలో ఆ టీమ్ దూకుడుగా ఆడుతోంది. టెస్టు క్రికెట్ను ఇలా కూడా ఆడొచ్చని ఇంగ్లాండ్ ప్రపంచానికి చూపించింది. ఒక బౌలర్గా ఆ జట్టుపై పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తానని అనుకుంటున్నాను. ఒకవేళ వాళ్లు దూకుడుగా ఆడితే నన్ను అలసటకు గురిచేయలేరు. అందువల్ల నాకు ఎక్కువ వికెట్లు పడగొట్టే అవకాశం దొరుకుతుంది. మైదానంలోకి అడుగుపెట్టిన ప్రతిసారీ పరిస్థితులను నాకు అనుకూలంగా ఎలా మలుచుకోవాలనే దాని గురించే ఎక్కువగా ఆలోచిస్తాను’’ అని బుమ్రా వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.