ODI World Cup: ప్రపంచకప్నకు టీమ్ ఇండియా ‘పవర్ పేస్’ ప్యాక్!
భారత్ ప్రధాన పేసు గుర్రాలు (Team India Pacers) మాంచి ఊపుమీదున్నాయి. గడిచిన కొన్ని దశాబ్దాల్లో టీమ్ ఇండియాకు ఇంత బలమైన పేస్ దళం లభించలేదంటే అశ్చర్యపోవాల్సిన పనిలేదు. వీరికి ఆల్రౌండర్లు తోడవ్వడంతో భారత బ్యాటింగ్ డెప్త్ కూడా పెరిగిపోయింది.
వన్డే క్రికెట్ ప్రపంచ సంగ్రామం మరికొన్ని గంటల్లో మొదలుకానుంది. సమయం దగ్గరపడే కొద్దీ టీమ్ ఇండియాకు అన్నీ శుభశకునాలే కనిపిస్తున్నాయి. గాయాలబారిన పడిన కీలక ఆటగాళ్లు కోలుకొని మంచి లయను అందుకొన్నారు. గతంలో ఎన్నడూ లేనంత బలమైన పేస్ దళం భారత్ తరఫున సిద్ధమైంది. పిచ్ కండీషన్ను బట్టి ముగ్గురు నుంచి నలుగురు పేసర్లతో భారత్ బరిలోకి దిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బుమ్రా, సిరాజ్, షమీ, పాండ్య, శార్దూల్తో కూడిన ప్రపంచంలోనే ‘ది బెస్ట్’ అని చెప్పదగ్గ సీమ్ దళం బరిలోకి దిగడానికి సిద్ధంగా ఉంది. ఒకప్పుడు ఫాస్ట్ బౌలింగ్ అంటే వెస్టిండీస్ గుర్తుకొచ్చేది. ఆ తర్వాత పాకిస్థాన్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా.. అద్భుతమైన బౌలర్లను తయారు చేసుకొన్నాయి. ఇప్పుడు భారత్ కూడా ఆ స్థాయి బౌలింగ్ను సిద్ధం చేసుకుంది.
ఆసియా పులులతో జాగ్రత్త..!
ముఖ్యంగా పచ్చికతో కళకళలాడే సెనా (SENA) పిచ్లపై సీమర్లు అలవోకగా వికెట్లు సాధిస్తారు. కానీ, బ్యాటింగ్, స్పిన్కు అనుకూలించే ఉపఖండం పిచ్లపై వికెట్లు తీయడం చాలా కష్టం. ఇక్కడ బౌన్స్, సీమ్ రాబట్టడం కత్తిమీద సామే. హేజిల్వుడ్ వంటి నాణ్యమైన ఆసీస్ బౌలర్ ఈ పిచ్లపై 8 మ్యాచ్ల్లో 6 వికెట్లే తీశాడు. టిమ్ సౌథీ కూడా ఆసియాలో 40 మ్యాచ్లు ఆడి కేవలం 58 వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఇలా చెప్పుకొంటూ పోతే చాలా మంది పేసర్లు ఉపఖండం పిచ్లపై చేతులెత్తేశారు. ఇక మన సిరాజ్ వన్డే కెరీర్లో 24 మ్యాచ్ల్లో 43 వికెట్లు తీయగా.. ఉపఖండంపై 17 మ్యాచ్ల్లో 35 వికెట్లను కూల్చి ప్రత్యర్థి శిబిరాల్లో ప్రమాదఘంటికలు మోగిస్తున్నాడు. అతడి ఎకానమీ కేవలం 4.5 కావడం విశేషం. ఇక షమీ కెరీర్లో తీసిన 162 వికెట్లలో 64 (39 మ్యాచ్ల్లో) ఆసియా పిచ్లపై సాధించినవే. బుమ్రా కూడా కేవలం 37 మ్యాచ్ల్లోనే 4.65 ఎకానమీతో 63 వికెట్లను కూల్చాడు. పాక్ బౌలర్లు షహీన్ అఫ్రిదీ, హారిస్ రవూఫ్కు కూడా ఆసియా పిచ్లపై మెరుగైన రికార్డు ఉంది.
పవర్ప్లేలో భయపెడుతున్న సిరాజ్..!
జట్టు భారీ స్కోర్లు చేయాలంటే ఓపెనర్లు అద్భుతమైన ప్రారంభాన్ని ఇవ్వడం ముఖ్యం. కానీ, ఇటీవల కాలంలో ప్రత్యర్థి ఓపెనర్లు కుదురుకోనివ్వకుండా భారత్ చేస్తోందంటే... మన పేసర్ల సత్తా ఏమిటో అర్థమవుతుంది. 2022 నుంచి ఇప్పటివరకు టీమ్ ఇండియా ఆడిన 42 ఇన్నింగ్స్ల్లో మొత్తం 80 వికెట్లను పవర్ ప్లేలోనే కూల్చింది. అంటే ప్రతి మ్యాచ్లో సగటున 1.90 వికెట్లు పడగొట్టింది. భారత్ తర్వాత స్థానాల్లో బంగ్లాదేశ్ (1.80), న్యూజిలాండ్ (1.70), పాకిస్థాన్ (1.70) ఉన్నాయి.
హైదరాబాదీ మియా భాయ్ సిరాజ్ ఇటీవల కాలంలో ప్రత్యర్థి ఓపెనర్లకు పీడకలగా మారాడు. 2022 నుంచి అతడు పవర్ప్లేలో మొత్తం 132 ఓవర్లు వేసి.. 32 వికెట్లు తీశాడు. అంతేకాదు.. పొదుపుగా 4.16 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. 2023లో అయితే 13 ఇన్నింగ్స్ల్లో 16 వికెట్లు తీశాడు. ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక ఇన్నింగ్స్ను పవర్ ప్లేలోనే పేకమేడలా కూల్చేశాడు.
షమీ - బుమ్రా లెక్కే వేరు..
మరో పేసర్ షమీ హ్యాట్రిక్ వరల్డ్కప్నకు సిద్ధమయ్యాడు. ఈ ఏడాది షమీ భీకరమైన ఫామ్లో ఉన్నాడు. మొత్తం 12 ఇన్నింగ్స్లు ఆడి.. 19 వికెట్లను కూల్చాడు. వీటిల్లో తన కెరీర్లోనే అత్యున్నత గణాంకాలైన 5/51ని దేశీయ పిచ్ మీద ఆస్ట్రేలియాపై నమోదు చేశాడు. ముఖ్యంగా షమీ గత ప్రపంచకప్లో భారత్ తరఫున అద్భుత బౌలింగ్ గణాంకాలను నమోదు చేశాడు. 2015, 2019 ప్రపంచకప్ల్లో ఆడి మొత్తం 11 మ్యాచ్ల్లో 31 మంది బ్యాటర్లను పెవిలియన్కు పంపాడు. ప్రపంచకప్ టోర్నీలో అతడి బెస్ట్ 5/69. వాస్తవానికి షమీ బౌలింగ్ యావరేజి 25.50. కానీ, ప్రపంచకప్లో అద్భుతంగా రాణించి కేవలం 15.70 సగటును నమోదు చేశాడంటే అతడి బౌలింగ్ పదును అర్థం చేసుకోవచ్చు.
గాయం కారణంగా ఏడాది పాటు సుదీర్ఘ విశ్రాంతి తీసుకున్న బుమ్రా ఇటీవలే పాకిస్థాన్పై మ్యాచ్లో తిరిగి వన్డేల్లోకి అడుగుపెట్టాడు. తనలో పదును ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకొన్నాడు. ఈ ఏడాది మొత్తం ఐదు మ్యాచ్లు ఆడి.. ఎనిమిది వికెట్లను పడగొట్టాడు. ప్రపంచకప్లో ఈ పేసు గుర్రానికి ఘనమైన రికార్డే ఉంది. 2019 మెగా టోర్నీలో 9 మ్యాచ్లు ఆడి.. 18 వికెట్లను కుప్పకూల్చాడు. అంటే మ్యాచ్కు సగటున రెండు వికెట్లు అన్నమాట. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, వెస్టిండీస్, సౌతాఫ్రికాపై విరుచుకుపడ్డాడు. ఈ టోర్నీలో బుమ్రా కెరీర్ సగటు 20గా ఉంది. అతని మొత్తం కెరీర్ సగటు రేటు 24.31 కావడం గమనార్హం.
రెండు వైపులా పదునున్న కత్తులతో పెరిగిన బ్యాటింగ్ డెప్త్..
మన సీమర్ల గణాంకాలు విశ్లేషకులను పునరాలోచనలో పడేస్తున్నాయి. మూడో స్పెషలిస్టు పేసర్ను కూడా జట్టులో ఉంచాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఇప్పటికే హార్దిక్ రూపంలో మీడియం పేస్ ఆల్రౌండర్ జట్టులో ఉండనే ఉన్నాడు. దీంతో స్పెషలిస్టు సీమర్లలో ఒకరిని బెంచ్కు పరిమితం చేసి మరో స్పెషలిస్టు బ్యాటర్కు అవకాశం కల్పించే వెసులుబాటు రోహిత్కు లభిస్తుంది.
ప్రపంచ కప్లో మాహీ... ఎందుకంత స్పెషల్ అంటే!
ఒక వేళ పిచ్ స్వింగ్కు అనుకూలిస్తుంది అనుకుంటే.. ముగ్గురు స్పెషలిస్టు సీమర్లను బరిలోకి దించినా.. ఐదుగురు స్పెషలిస్టు బ్యాటర్లు ఉంటారు. ఇక మిడిల్, లోయర్ ఆర్డర్ను బలోపేతం చేయడానికి ఆల్ రౌండర్స్ ఉంటారు. పేసర్లు కూడా చివర్లో తనదైన శైలిలో హార్డ్ హిట్టింగ్ చేస్తే.. ఆఖరి బ్యాటర్ వరకు పరుగులు సాధించే అవకాశం ఉంది.
-ఇంటర్నెట్డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
తాజా వార్తలు (Latest News)
-
ఫ్రెండ్తో వివాహం.. కీర్తి సురేశ్ ఏమన్నారంటే..?
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్