Rishabh Pant: పంత్‌ వస్తున్నాడు..!

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన రిషబ్‌ పంత్‌  2024 ఐపీఎల్‌తో పునరాగమనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Updated : 12 Dec 2023 08:25 IST

దిల్లీ: ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, దాదాపు ఏడాది పాటు ఆటకు దూరమైన రిషబ్‌ పంత్‌ (Rishabh Pant) 2024 ఐపీఎల్‌తో పునరాగమనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ వచ్చే ఏడాది ఐపీఎల్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు నాయకత్వం వహిస్తాడని ఆ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్‌ ధ్రువీకరించింది. ప్రస్తుతం ఎన్‌సీఏలో పునరావాసంలో ఉన్న పంత్‌.. ఫిబ్రవరి చివరికి పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తాడని భావిస్తున్నట్లు ఓ దిల్లీ అధికారి చెప్పాడు. ప్రమాదం కారణంగా పంత్‌ గత ఐపీఎల్‌లో ఆడలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని