England - T20 World Cup : ప్రపంచకప్ను ఇంగ్లాండ్ ఎలా మొదలు పెట్టింది.. ఎలా ముగించింది?
టీ20 ప్రపంచకప్ 2022ని ఇంగ్లాండ్ (England won t20 worldcup 2022) గెలిచిన నేపథ్యంలో 20 రోజులు వెనక్కి వెళ్లి ఇంగ్లాండ్ ప్రయాణం ఎలా మొదలైందో తెలుసుకుందాం.
టీ20 ప్రపంచకప్ 2022 విజేతగా ఇంగ్లాండ్ (England) నిలిచింది. అయితే వారికి ఈ విజయం అంత ఈజీగా రాలేదు. చిన్న జట్టు మీద ఓటమితో షాక్ తిన్న ఆ జట్టు.. వర్షం కారణంగా ఒత్తిడిలో పడింది. అయితే బలంగా పుంజుకుని జగజ్జేత అయ్యింది. ఈ నేపథ్యంలో ఓ 20 రోజులు వెనక్కి వెళ్లి ఇంగ్లాండ్ ప్రయాణం ఎలా మొదలైంది, ఇప్పుడు విశ్వవిజేతగా ఎలా నిలిచిందో ఓసారి చూద్దాం.
♦ 113 పరుగుల టార్గెట్.. ప్రత్యర్థి క్రికెట్లో పసి కూన.. అయినా విజయం అంత ఈజీగా రాలేదు. 19వ ఓవర్ వరకు పోరాడాల్సి వచ్చింది. దీని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంగ్లాండ్ ఈ టోర్నీని ఎలా మొదలుపెట్టిందో. అక్టోబరు 22న అఫ్గానిస్థాన్తో జరిగిన తొలి మ్యాచ్ను ఇంగ్లాండ్ ఐదు వికెట్ల తేడాతో గెలుపొందినా.. జట్టు స్థాయికి తగ్గ విజయం కాదది. టాప్ ఆర్డర్ విఫలమైన వేళ లివింగ్స్టన్ (29) నిలబడటంతో ఆ విజయం దక్కింది. శామ్ కరన్ (5/10) అదిరిపోయే బౌలింగ్ ప్రదర్శన లేకుంటే ఆ మ్యాచ్ ఇంగ్లాండ్ చేయి జారేదే.
మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
♦ అఫ్గానిస్థాన్తో తొలి మ్యాచ్ను కష్టంగా గెలిచిన ఇంగ్లాండ్కు రెండో మ్యాచ్లో వరుణుడు షాక్ ఇచ్చాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 157 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ బ్యాటింగ్ సమయంలో వరుణుడు అడ్డుగా వచ్చాడు. ఇక మ్యాచ్ నిర్వహణ అసాధ్యమని తేలడంతో డక్వర్త్ లూయిస్ లెక్కలు చూశారు. ఆ లెక్కల్లో బట్లర్ సేన ఐదు పరుగులు వెనుకబడి ఉంది. ఇంకేముంది ఐర్లాండ్ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోయింది. మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
♦ అనూహ్యంగా రెండో మ్యాచ్లో ఓటమిపాలైన ఇంగ్లాండ్కు ఆ తర్వాతి మ్యాచ్లో వరుణుడు మరోసారి షాక్ ఇచ్చాడు. అయితే ఈసారి బంతి కూడా పడకుండా.. మ్యాచ్ ఆగిపోవడంతో ఆస్ట్రేలియాతో మ్యాచ్ పాయింట్లను పంచుకోవాల్సి వచ్చింది. దీంతో సెమీ ఫైనల్కి చేరాలంటే తర్వాతి మ్యాచ్లు అన్నీ గెలవాల్సి వచ్చింది. అదే సమయంలో రన్రేట్ మీద కూడా దృష్టి పెట్టాల్సి వచ్చింది. మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
♦ న్యూజిలాండ్ మ్యాచ్లో మొత్తం ఇంగ్లాండ్ జట్టు తిరిగి ఊపు మీదకు వచ్చిందని చెప్పొచ్చు. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్కు ఓపెనర్లు బట్లర్ (73), హేల్స్ (52) అదిరిపోయే ఓపెనింగ్ ఇచ్చారు. దీంతో 179 పరుగులు చేశారు. తిరిగి సమాధానంగా న్యూజిలాండ్ 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్లు, లోయర్ మిడిలార్డర్ వైఫల్యంతో ఆ మ్యాచ్ కివీస్ చేయి జారింది. విలియమ్సన్, ఫిలిప్స్ కష్టాన్ని ఇంగ్లాండ్ బౌలర్లు వృథా చేశారు. మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
♦ కివీస్ మీద విజయం తర్వాత ఇక ఇంగ్లాండ్కు ఎదురు లేదు.. ఇక దూసుకుపోవడమే అనుకునేసరికి శ్రీలంక చిన్నపాటి షాక్ ఇచ్చింది. 142 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ను ఆఖరి ఓవర్ నాలుగో బంతి వరకు తీసుకొచ్చారు లంక బౌలర్లు. బట్లర్ (28), హేల్స్ (47), స్టోక్స్ (42*) అదరగొట్టినా.. మిడిలార్డర్ చేతులెత్తేసింది. అయితే స్టోక్స్ ఒత్తిడిని తట్టుకుని జట్టును గెలిపించాడు. అదే సమయంలో అఫ్గానిస్థాన్పై ఆస్ట్రేలియా (7 పాయింట్లు) అతి కష్టం మీద గెలవడంతో రన్రేట్లో వెనుకబడింది. దీంతో సెమీస్ బెర్త్ ఇంగ్లాండ్ (7 పాయింట్లు) కి దక్కింది. మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
♦ శ్రీలంక మీద కష్టంగా గెలిచామనే కసితో ఆడారో ఏమో.. సెమీ ఫైనల్లో భారత్ మీద ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రతాపం చూపించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ అతి కష్టం మీద 168/6 చేస్తే.. ఇంగ్లాండ్ బ్యాటర్లు హేల్స్ (86*), బట్లర్ (80*) ఎంచక్కా ఆడుతూ పాడుతూ కొట్టేశారు. భారత బౌలర్ల భారీ వైఫల్యంతో ఇంగ్లాండ్ ఫైనల్కి చేరింది. వికెట్ నష్టపోకుండా 170 పరుగులు చేసి ఇంగ్లాండ్ ఫైనల్ అర్హత సాధించింది. మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
♦ సెమీస్లో న్యూజిలాండ్ మీద భారీ విజయంతో ఫైనల్కి వచ్చిన పాక్ను ఇంగ్లాండ్ బలంగా ఢీకొట్టింది. తొలుత బౌలింగ్లో అదరగొట్టి పాక్ను 137 పరుగులకు కట్టడి చేసింది. ఇక బ్యాటింగ్లో కీలక సమయంలో వికెట్లు పడినా, పరుగుల రాక ఆగినా.. బెన్ స్టోక్స్ (52*) ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని జట్టుకు ప్రపంచకప్ అందించాడు. అతనికి బట్లర్, బ్రూక్, మొయిన్ అలీ సాయమందించారు. ఒకానొక దశలో పాక్ గెలుస్తుందనిపించినా.. బట్లర్ ఆ ఆశను వరుస బౌండరీలతో చిదిమేశాడు. మ్యాచ్ పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి
అలా కష్టంగా ఈ ఏడాది ప్రపంచకప్ ప్రయాణం మొదలుపెట్టిన ఇంగ్లాండ్.. ఇప్పుడు విశ్వవిజేతగా నిలిచింది. చిన్న జట్టు మీద దక్షిణాఫ్రికా ఓటమితో అనూహ్యంగా సెమీస్కి చేరి, ఆ తర్వాత ఫైనల్కి చేరిన పాకిస్థాన్ రన్నరప్గా నిలిచింది.
- ఇంటర్నెట్ డెస్క్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
Paris Olympics 2024: ఒలింపిక్స్ వేడుకలు ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన పొరపాటుపై నిర్వాహకులు క్షమాపణలు కోరారు. -
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
టెస్టుల్లో సచిన్ తెందూల్కర్ అత్యధిక పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బ్యాటర్ జో రూట్ (Joe Root) బ్రేక్ చేసే అవకాశముందని భారత మాజీ వికెట్కీపర్ దినేశ్ కార్తిక్ (Dinesh Karthik) అభిప్రాయపడ్డాడు. -
పారిస్ ఒలింపిక్స్.. ఎయిర్ పిస్టల్లోనూ మనకు నిరాశే..!
Paris Olympics 2024: 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ క్వాలిఫికేషన్ పురుషుల విభాగంలో షూటర్లు సరబ్జోత్ సింగ్, అర్జున్ చీమా నిరాశపర్చారు. -
తూటా గురితప్పింది.. మిక్స్డ్ డబుల్స్లో నిరాశపర్చిన షూటర్లు
Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజు భారత షూటర్లు నిరాశపర్చారు. మిక్స్డ్ డబుల్స్లో ఫైనల్కు చేరుకోలేకపోయారు. -
ఇప్పుడు చేసేద్దాం.. గంభీర్ పశ్చాత్తాప వ్యాఖ్యలపై సూర్య కామెంట్
Gautam Gambhir-Suryakumar Yadav: సూర్య విషయంలో విచారం వ్యక్తం చేస్తూ గతంలో గంభీర్ చేసిన వ్యాఖ్యలపై టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ తాజాగా స్పందించాడు. -
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
Dravid-Gambhir: టీమ్ఇండియా కొత్త హెడ్ కోచ్ గంభీర్కు మాజీ కోచ్ ద్రవిడ్ ప్రత్యేక సందేశం పంపాడు. ఈ వీడియోను బీసీసీఐ పంచుకుంది. -
పారిస్ ఒలింపిక్స్లో హిందీకి అరుదైన గౌరవం
పారిస్ వేదికగా జరిగిన ఒలింపిక్స్ ప్రారంభ వేడుకల్లో హిందీకి అరుదైన గౌరవం దక్కింది. -
అల పారిస్ పురములో
ఓ వైపు ఒలింపిక్ జ్యోతితో వ్యక్తి ప్రయాణం.. మరోవైపు వర్చువల్ సాంకేతిక మాయాజాలంతో ఫ్రాన్స్, పారిస్ చరిత్ర, సంస్కృతి, ఘన వారసత్వాన్ని చాటేలా ప్రదర్శన.. -
తూటా.. మొదలెట్టేనా వేట
వేడుకలు ముగిశాయి. ఇక పతక వేటకు సిద్ధమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. పారిస్ ఒలింపిక్స్లో తొలి రోజే భారత పతక మోతకు శ్రీకారం చుట్టి.. -
కొత్త కొత్తగా..
భారత క్రికెట్ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలు కాబోతోంది. కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ శిక్షణలో, కొత్త కెప్టెన్ సూర్యకుమార్ సారథ్యంలో టీ20 జట్టు తొలి సిరీస్ ఆడబోతోంది. -
బంగ్లా చిత్తు.. ఫైనల్లో భారత్
మహిళల ఆసియా కప్లో భారత్ అదరగొట్టింది. గ్రూపు దశలో అజేయంగా నిలిచిన భారత్.. సెమీఫైనల్లో బంగ్లాదేశ్ను చిత్తుచేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ‘ -
అలలొస్తేనే ఆట
పారిస్ క్రీడల ద్వారా ఒలింపిక్స్లో అరంగేట్రం చేస్తోంది సర్ఫింగ్ ఆట. ఈ క్రీడల్లో పోటీపడుతున్న అథ్లెట్లందరికంటే సర్ఫింగ్ బరిలో ఉన్న క్రీడాకారులకు చిత్రమైన పరిస్థితులు ఎదురవుతాయి. -
రగ్బీ స్టేడియంలో స్విమ్మింగ్పూల్!
స్విమ్మింగ్ పోటీలను ఎంత మంది తిలకిస్తారు? సాధారణంగా వందల్లోనే ఆ సంఖ్య ఉంటుంది. అలాంటిది వేలల్లో చూసే అవకాశం ఉంటే! ఆశ్చర్యమే..! -
కొత్త హెడ్కోచ్గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?
పంజాబ్ కింగ్స్ కొత్త కోచ్ వేటలో పడింది. ఆర్సీబీ మాజీ బ్యాటర్ను నియమించుకోనున్నట్లు సమాచారం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
స్టంట్ చేస్తూ, కాలుచేయి పోగొట్టుకున్న యువకుడు: రైల్వే పోస్టు వైరల్
-
మరో రికార్డును సొంతం చేసుకున్న విశాఖ ఉక్కు .. కార్మికుల హర్షాతిరేకాలు
-
‘తప్పు జరిగింది.. క్షమించండి’: పారిస్ ఒలింపిక్స్ నిర్వాహకులు
-
టెస్టుల్లో సచిన్ రికార్డును జో రూట్ బ్రేక్ చేస్తాడా? దినేశ్ కార్తిక్ ఏమన్నాడంటే?
-
ఫైల్స్ దహనం కేసు.. పోలీసుల అదుపులోకి ఎంపీ మిథున్రెడ్డి ప్రధాన అనుచరుడు
-
కేంద్ర బడ్జెట్లో ఏపీకి రూ.50,474 కోట్లు: కేంద్ర మంత్రి మురుగన్