Team India: పాక్ను ఒత్తిడికి గురిచేసి.. ఉచ్చులోకి లాగిందిలా..!
ఈ ప్రపంచకప్లోనే (ODI World Cup 2023) భారత్ వద్ద అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ దళం ఉందని పాక్తో జరిగిన మ్యాచ్లో తెలిసిపోయింది. ఈ మ్యాచ్లో రోహిత్ పాక్ను ఒత్తిడికి గురి చేసి కుప్పకూల్చడానికి ఓ పదునైన వ్యూహాన్ని అమలు చేశాడు. ఆ దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది.
ఇంటర్నెట్డెస్క్: ఓ వ్యూహం.. ఓ ఎదురు దాడి.. ఓ మైండ్గేమ్.. ముందు చూపు.. ఎక్కడా ప్రయత్నాలను వదలని పట్టుదల.. అన్నింటికీ మించి సమష్టి కృషి..!.. టీమ్ ఇండియా (Team India) ప్రత్యర్థులను వీటితోనే ఇప్పుడు భయపెడుతోంది. తాజాగా పాక్ (pakistan) మ్యాచ్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఛాంపియన్లా ఏ విభాగంలోనూ పాక్(pakistan)కు అవకాశం ఇవ్వలేదు. ఇక మన బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే..
మ్యాచ్ ముందు నుంచే మైండ్గేమ్..
పాక్(pakistan)తో మ్యాచ్లో టాస్ నుంచే రోహిత్ (rohit sharma) ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ.. ప్రత్యర్థిలో సందేహాలు రేకెత్తించాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై టాస్ గెలిచినా.. బౌలింగ్ను ఎంచుకొన్నాడు. ఒకవేళ కొండంత లక్ష్యం ఎదురుగా పెట్టినా.. తమ బ్యాటింగ్ లైనప్ దానిని పిండిచేస్తుందనే సందేశం పాక్కు పంపాడు. అంతేకాదు.. తమ బౌలర్లు పాక్ను తక్కువకే కట్టడి చేస్తారన్న విశ్వాసం కనబర్చాడు. ఇన్నింగ్స్ మొదలై పాక్ బ్యాటర్లు రెండు ఓవర్ల పాటు సిరాజ్పై ఎదురు దాడి చేసినా.. పవర్ ప్లేలో అతడి రికార్డును దృష్టిలోపెట్టుకొని అతడితోనే బౌలింగ్ను కొనసాగించాడు. హైదరబాదీ మియా భాయ్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా షఫీక్ రూపంలో తొలి వికెట్ను అందించాడు.
అటు కాకపోతే.. ఇటు నుంచి నరుక్కొచ్చి..
వైట్ బాల్ క్రికెట్లో ప్రత్యర్థి రన్రేట్ను కట్టడి చేయడం చాలా ముఖ్యం. వికెట్లు లభించడమనేది బోనస్ లాంటిది. భారత్ దీనిని బాగా వంటపట్టించుకుంది. ఓపెనర్ ఇమామ్ వికెట్ను కోల్పోయిన తర్వాత పాక్ బ్యాటింగ్ మూలస్తంభాలైన బాబర్-రిజ్వాన్లు ఇన్నింగ్స్ను నిర్మించే పనిలో పడ్డారు. రిజ్వాన్ ఈ టోర్నిలో సూపర్ఫామ్లో ఉన్నాడు. దీంతో రోహిత్ తెలివిగా బౌలింగ్ వనరులు వినియోగించాడు. పాండ్యా, జడేజా, కుల్దీప్లను మార్చిమార్చి బౌలింగ్ చేయించాడు. ఫలితంగా పవర్ ప్లే తర్వాత పాక్ జట్టు ఒక ఓవర్లో పది పరుగులు రాబట్టిన సందర్భాలు కేవలం మూడే ఉన్నాయి. ఇక 20వ ఓవర్ వచ్చేసరికి పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి రన్రేట్ పడిపోయింది. 20-42వ ఓవర్ మధ్యలో కేవలం 8 సార్లు మాత్రమే ఓవరకు ఐదు అంత కంటే ఎక్కువ పరుగులు చేశారు. ముఖ్యంగా జడేజా, కుల్దీప్ వేసిన 23-28 ఓవర్ల మధ్య స్పెల్లో పాక్ ఏ ఓవర్లోనూ 5 పరుగులు చేయలేదు. ఈ క్రమంలో తొలి స్పెల్లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్ మళ్లీ బౌలింగ్కు రావడంతో.. పరుగులు రాక ఒత్తిడిలో ఉన్న పాక్ బ్యాటర్లు అతడిపై ఎదురు దాడికి యత్నించారు. ఈ క్రమంలో బాబర్ వికెట్ను తీసి మరోసారి భారత్కు బ్రేక్త్రూ ఇచ్చాడు సిరాజ్. అంతే.. వికెట్ల కోసం ఎనిమిది ఓవర్లు వేచి ఉన్న కుల్దీప్ తన ఎనిమిదో ఓవర్లో సౌద్, రిజ్వాన్ వికెట్లు పడగొట్టాడు. అక్కడి నుంచి పాక్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. వికెట్లు లభించకపోతే.. పరుగులు కట్టడి చేస్తే ఫలితం లభిస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని భారత్ అద్భుతంగా అమలు చేసింది. ఈ ప్రపంచకప్లో అత్యంత పొదుపరి టాప్-5 బౌలర్లలో నలుగురు భారతీయులే ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ (3.40) బుమ్రా(3.44), జడేజా (3.73), కుల్దీప్ (3.90) ఉన్నారు. వీరిలో అశ్విన్ ఈ మ్యాచ్ ఆడలేదు. టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక డాట్బాల్స్ వేసింది బుమ్రా (115)నే. ఇక జడేజా (95) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జోడీ మూడు మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టింది.
కుల్దీప్ బౌలింగ్లో చేసుకొన్న చిన్న మార్పులు అతడిని ప్రమాదకరంగా మర్చేశాయి. 2017తో పోలిస్తే.. ప్రస్తుతం అతడు బంతిని తక్కువగా టర్న్, బౌన్స్ చేస్తున్నాడు. అదే సమయంలో స్టంప్స్ను గురిపెడుతున్నాడు. ఈ క్రమంలో చిన్న చిన్న ట్రిక్స్తో వికెట్లను సాధిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్లో బాబర్-రిజ్వాన్ జోడీ అతడిని ఎదుర్కోవడానికి అవస్థలు పడింది. ఆ ఒత్తిడే.. వారు వికెట్లు సమర్పించుకొనేలా చేసింది.
పాక్ను కాదు.. టోర్నీని దృష్టిలోపెట్టుకొని బ్యాటింగ్..
50 ఓవర్లకు 192 అనేది చాలా చిన్న లక్ష్యం.. కానీ, అక్కడున్నది పాక్ సీమర్లు. షహీన్, హారిస్లతో కూడిన అత్యంత ప్రమాదకరమైన పేస్ దళం. కానీ, తొలి బంతి నుంచే పాక్ బౌలర్లపై రోహిత్ ఎదురుదాడి మొదలుపెట్టాడు. ముఖ్యంగా షహీన్, హారిస్లను లక్ష్యాంగా చేసుకున్నాడు. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లు మెరుగైన రన్రేట్తో ఉన్నాయి. ఏదైనా జరిగి పాయింట్లు సమమైతే.. నెట్ రన్రేట్ కీలకమవుతుంది. ఈ అంశాన్ని కూడా కెప్టెన్ హిట్మ్యాన్ మనసులో పెట్టుకొన్నాడు. గిల్, కోహ్లీ వికెట్లు పడినా సరే.. ఎక్కడా పరుగుల వేగానికి బ్రేకులు వేయలేదు. నెదర్లాండ్స్ మ్యాచ్లో కూడ రోహిత్ ఇదే శైలిలో ఆడాడు. ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్నూ భారత్ సీరియస్గా తీసుకుంటోదనడానికి ఇదే ఉదాహరణ.
ఇక భారత్ మిడిలార్డర్ కూడా ఇప్పటి వరకు టోర్నీలో తొలి మ్యాచ్ నుంచి అత్యంత బాధ్యతా యుతంగా ఆడుతూ వస్తోంది. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో.. జట్టును గట్టెక్కించింది. తాజాగా గిల్, విరాట్ వంటి టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో ఔటైనా.. అయ్యర్, రాహుల్ ఎటువంటి లోపాలకు చోటివ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. ఛేజింగ్ చేయడం సహజంగానే బ్యాటర్లపై తెలియని ఒత్తిడిని పెంచుతుంది.. కానీ, ఈ టోర్నీలో ఆసీస్, పాక్ వంటి బలమైన జట్లను ఛేజింగ్లోనే ఓడించడం టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పారిస్ ఒలింపిక్స్లో భారత్ ఈవెంట్లు.. పూర్తి షెడ్యూల్ ఇదే
ప్రపంచంలో అతిపెద్ద క్రీడా ఈవెంట్ ఆరంభానికి మరికొన్ని గంటల సమయమే ఉంది. రేపటి నుంచే ఒలింపిక్స్ పోటీలు ప్రారంభం కానున్నాయి. -
పది వచ్చే అవకాశం ఉందా! భారీ అంచనాలతో పారిస్లోకి అడుగుపెట్టిన భారత సేన
ఒలింపిక్స్ అనగానే అభిమానుల్లో ఎన్నో ఆశలు! భారత్ అదరగొడుతుందనే అంచనాలు! 100 మంది వెళ్తున్నారు 10 పతకాలైనా రావా అనే ఆలోచనలు! కానీ వాస్తవానికి పరిస్థితి వేరే ఉంటుంది. -
ఒలింపిక్స్ మస్కట్ ఫ్రీజ్ ముచ్చట తెలుసా..?
పారిస్ ఒలింపిక్స్కు మస్కట్ ఏమిటో తెలుసా.. ఓ టోపీ బొమ్మ. పెద్ద కళ్లతో ఆకర్షణీయంగా ఉన్న ఈ టోపీతో ఫ్రాన్స్ చరిత్రకు విడదీయలేని సంబంధం ఉంది. -
పారిస్ ఒలింపిక్స్.. ఆఖరి మజిలీలో ఆశ తీర్చుకుంటారా!
సీనియర్ అథ్లెట్లుగా పారిస్ ఒలింపిక్స్లోకి అడుగుపెట్టిన ముగ్గురు.. తొలి పతకం నెగ్గేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఎన్నో ఏళ్ల ఎదురుచూపులకు ఫుల్స్టాప్ పెట్టేయాలని చూస్తున్నారు. -
చేయి చేయి కలిపి పారిస్కు రక్షణ కవచం: 40 దేశాల నుంచి భద్రతా సిబ్బంది
పారిస్ ఒలింపిక్స్కు భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి. దాదాపు 40 దేశాలకు చెందిన భద్రతా బృందాలు భాగం కావడం విశేషం. -
పారిస్ ఒలింపిక్స్లో ఆడేందుకు వేలు తొలగించుకొని..ఆసీస్ ఆటగాడి త్యాగం
పారిస్ ఒలింపిక్స్ ఆడేందుకు ఆటంకంగా మారుతుందని భావించి తన చేతి వేలును ఒక ఆటగాడు తొలగించుకొన్నాడు. -
పారిస్ ఒలింపిక్స్ ఆశలను ఆ నది ముంచేస్తోందా..?
ఒలింపిక్స్తో తమ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయని ఆశించిన ఫ్రాన్స్కు.. ఇప్పుడు అది బెడిసికొట్టేలా ఉంది. స్విమ్మింగ్కు సంబంధించిన కొన్ని ఈవెంట్ల కారణంగా దేశం పరువు పోయే పరిస్థితి నెలకొంది. -
రికార్డు సెంచరీ చేసినా నో ప్లేస్.. టీమ్ఇండియా ఎంపికలో ఇవి గమనించారా?
సీనియర్లలో బుమ్రా, రవీంద్ర జడేజా విశ్రాంతి తీసుకుంటున్నారు. యువ క్రికెటర్లకు ప్రాతినిధ్యం ఇస్తూనే నాయకత్వ బాధ్యతల్లోకి కొత్తనీరు ఎక్కించాడు కోచ్ గంభీర్. -
టీమ్ఇండియా కొత్త కోచ్గా గంభీర్ ఏం చేస్తాడో!
భారత నూతన కోచ్గా గంభీర్ పేరును బీసీసీఐ ప్రకటించింది. దీంతో అతడు ఎలా రాణిస్తాడనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మెంటార్గా ఐపీఎల్లో అనుభవం ఉన్న సంగతి తెలిసిందే. -
ఆ ఒక్కటి తక్కువైంది.. ద్రవిడ్ మాటను నెరవేర్చాలి!
ప్రపంచ క్రికెట్లో భారత్ దూకుడు కొనసాగుతోంది. రెండేసిసార్లు వన్డే, టీ20 ప్రపంచ కప్లను నెగ్గింది. అయితే, ఒక్క కప్ మాత్రం అందడం లేదు. ఇప్పటికే రెండుసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదు. -
జింబాబ్వేకు యువ భారత్.. ఈ కుర్రాళ్లపై ఓ లుక్కేద్దాం!
జింబాబ్వే పర్యటనకు టీమ్ఇండియా వెళ్లింది. కుర్రాళ్లతో కూడిన జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. శుభ్మన్ గిల్ ఈ జట్టుకు నాయకత్వం వహిస్తాడు. -
ఛాంపియన్లు వస్తున్నారు
13 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఐసీసీ ట్రోఫీ సాధించిన టీమ్ఇండియాకు గురువారం స్వదేశంలో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. -
జింబాబ్వే పర్యటనకు భారత్.. గత హీరోలు ఎవరంటే?
జింబాబ్వేతో టీ20 సిరీస్ అయినా సరే తేలిగ్గా తీసుకోకూడదు. ఆ జట్టు కూడా పెద్ద టీమ్లకు షాక్ ఇచ్చిన దాఖలాలున్నాయి. భారత్ కూడా రెండు మ్యాచుల్లో ఓడిన చరిత్ర ఉంది. -
రోహిత్- కోహ్లీ లేని లోటును భర్తీ చేసేదెవరు?
పొట్టి వరల్డ్ కప్ ఫైనల్లో భారత్ విజయం సాధించిన అనంతరం రోహిత్, కోహ్లీ టీ20లకు గుడ్ బై చెప్పేశారు. మరి ఈ ద్వయం లేని లోటును ఏ ఆటగాళ్లు భర్తీ చేస్తారనే దానిపై చర్చ మొదలైంది. -
రోహిత్ తర్వాత ఎవరు..?
టీమ్ ఇండియాలో కెప్టెన్ స్థానం ఖాళీ అయింది. రోహిత్ స్థాయి నాయకత్వాన్ని భవిష్యత్తులో జట్టుకు అందించేవారి కోసం బీసీసీఐ అతి త్వరలోనే వేట మొదలు పెట్టవచ్చు. ఈ రేసులో కొందరు ఆటగాళ్లు ముందున్నారు. -
పొట్టి కప్పు విజేతగా భారత్.. వీళ్లనూ మరిచిపోవద్దు!
పెద్దగా అంచనాలు లేకుండా.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుని సత్తా చాటితే వారిని అభిమానులకు గుర్తుండి పోతారు. భారత్ ఛాంపియన్గా నిలవడంలో వీరూ కీలక పాత్ర పోషించారు. -
బుమ్రా యాక్షన్ స్పెషల్.. అందుకే కదిలించరు..!
టీమ్ ఇండియాలో జెస్సీ చాలా స్పెషల్. జట్టు కష్టాల్లో ఉందంటే నేనున్నానంటూ ముందుకొస్తాడు. తన మాయాజాలంతో ప్రత్యర్థి బ్యాటింగ్ లైనప్ను కకావికలం చేస్తాడు. అతడి బౌలింగ్ యాక్షన్ వెనుక ఆసక్తికరమైన అంశాలు మీకోసం.. -
సలామ్....శర్మా జీ! హిట్ మ్యాన్.. నీ ముద్ర చెరిగిపోనిది!
టీ20ల నుంచి రిటైర్ అయిన సందర్భంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ప్రతిభ, రికార్డుల గురించి ఆసక్తికర కథనం... -
పైసా వసూల్.. మ్యాచ్ ప్రతి దశలో నరాలు తెగే ఉత్కంఠ..!
టీ20 ప్రపంచకప్ ఫైనల్స్లో ఓ హైవోల్టేజీ మ్యాచ్ ఆవిష్కృతమైంది. బ్యాటింగ్.. బౌలింగ్లో భారత్ పని అయిపోయిందనుకొన్న ప్రతిసారి నేలను తాకిన బంతిలా ఎగసిపడింది. ఓటమి కోరల్లో చిక్కుకొన్న మ్యాచ్ను దేశం కోసం గెలిచి చూపింది. -
‘మాటలు పడి’లేచిన కెరటం... పాండ్య
ఓడిపోయినప్పుడు మనది కాని రోజు ఇది అనుకోవాలి. గేలి చేస్తున్నప్పుడు గెలిచి చూపించాలి అనుకోవాలి. మనదైన రోజున మనమేంటో ఆడి చూపించాలి. టీ20 ప్రపంచకప్లో హార్దిక్ పాండ్య చేసింది ఇదే. ‘మాటలు పడి’లేచిన కెరటం పాండ్య గురించి ఓ సారి చూద్దాం. -
మైదానంలో మాస్టర్మైండ్.. రోహిత్ స్టైల్ కెప్టెన్సీ ఇదీ
ప్రెస్మీట్లలో సరదాగా కనిపించే రోహిత్.. మైదానంలో ఉండే హిట్మ్యాన్ వేర్వేరు. గ్రౌండ్లోకి అడుగుపెట్టాక అతడి మెదడు పాదరసం కంటే వేగంగా పనిచేస్తుంది. ప్రత్యర్థులను వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసి జట్టుకు విజయాన్ని అందిస్తాడు. ఇదీ హిట్మ్యాన్ శైలి కెప్టెన్సీ..!
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
గోదావరి వరద బాధితుల్ని ఆదుకుంటాం: అసెంబ్లీలో చంద్రబాబు ప్రకటన
-
భారీ లాభాల్లో సూచీలు.. మదుపర్ల సంపద ₹7 లక్షల కోట్లు జంప్
-
‘ఎమర్జెన్సీ’ దారుణాలు.. ‘షా కమిషన్’ నివేదికపై రాజ్యసభ ఛైర్మన్ కీలక సూచన
-
జూమ్ కాల్లో 1.64 లక్షల మంది.. ₹16 కోట్ల విరాళాలు : కమలా హారిస్ సరికొత్త రికార్డ్
-
రామ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓటీటీ డీల్.. భారీ ధరకు ‘డబుల్ ఇస్మార్ట్’ రైట్స్
-
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు.. చిక్కుకుపోయిన 50 మంది యాత్రికులు