Team India: పాక్ను ఒత్తిడికి గురిచేసి.. ఉచ్చులోకి లాగిందిలా..!
ఈ ప్రపంచకప్లోనే (ODI World Cup 2023) భారత్ వద్ద అత్యంత ప్రమాదకరమైన బౌలింగ్ దళం ఉందని పాక్తో జరిగిన మ్యాచ్లో తెలిసిపోయింది. ఈ మ్యాచ్లో రోహిత్ పాక్ను ఒత్తిడికి గురి చేసి కుప్పకూల్చడానికి ఓ పదునైన వ్యూహాన్ని అమలు చేశాడు. ఆ దెబ్బకు పాక్ బ్యాటింగ్ ఆర్డర్ కుదేలైంది.
ఇంటర్నెట్డెస్క్: ఓ వ్యూహం.. ఓ ఎదురు దాడి.. ఓ మైండ్గేమ్.. ముందు చూపు.. ఎక్కడా ప్రయత్నాలను వదలని పట్టుదల.. అన్నింటికీ మించి సమష్టి కృషి..!.. టీమ్ ఇండియా (Team India) ప్రత్యర్థులను వీటితోనే ఇప్పుడు భయపెడుతోంది. తాజాగా పాక్ (pakistan) మ్యాచ్లో ఈ విషయం స్పష్టంగా కనిపించింది. ఛాంపియన్లా ఏ విభాగంలోనూ పాక్(pakistan)కు అవకాశం ఇవ్వలేదు. ఇక మన బౌలర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే..
మ్యాచ్ ముందు నుంచే మైండ్గేమ్..
పాక్(pakistan)తో మ్యాచ్లో టాస్ నుంచే రోహిత్ (rohit sharma) ఆత్మవిశ్వాసంతో వ్యవహరిస్తూ.. ప్రత్యర్థిలో సందేహాలు రేకెత్తించాడు. బ్యాటింగ్కు అనుకూలంగా ఉన్న పిచ్పై టాస్ గెలిచినా.. బౌలింగ్ను ఎంచుకొన్నాడు. ఒకవేళ కొండంత లక్ష్యం ఎదురుగా పెట్టినా.. తమ బ్యాటింగ్ లైనప్ దానిని పిండిచేస్తుందనే సందేశం పాక్కు పంపాడు. అంతేకాదు.. తమ బౌలర్లు పాక్ను తక్కువకే కట్టడి చేస్తారన్న విశ్వాసం కనబర్చాడు. ఇన్నింగ్స్ మొదలై పాక్ బ్యాటర్లు రెండు ఓవర్ల పాటు సిరాజ్పై ఎదురు దాడి చేసినా.. పవర్ ప్లేలో అతడి రికార్డును దృష్టిలోపెట్టుకొని అతడితోనే బౌలింగ్ను కొనసాగించాడు. హైదరబాదీ మియా భాయ్ కూడా కెప్టెన్ నమ్మకాన్ని వమ్ముచేయకుండా షఫీక్ రూపంలో తొలి వికెట్ను అందించాడు.
అటు కాకపోతే.. ఇటు నుంచి నరుక్కొచ్చి..
వైట్ బాల్ క్రికెట్లో ప్రత్యర్థి రన్రేట్ను కట్టడి చేయడం చాలా ముఖ్యం. వికెట్లు లభించడమనేది బోనస్ లాంటిది. భారత్ దీనిని బాగా వంటపట్టించుకుంది. ఓపెనర్ ఇమామ్ వికెట్ను కోల్పోయిన తర్వాత పాక్ బ్యాటింగ్ మూలస్తంభాలైన బాబర్-రిజ్వాన్లు ఇన్నింగ్స్ను నిర్మించే పనిలో పడ్డారు. రిజ్వాన్ ఈ టోర్నిలో సూపర్ఫామ్లో ఉన్నాడు. దీంతో రోహిత్ తెలివిగా బౌలింగ్ వనరులు వినియోగించాడు. పాండ్యా, జడేజా, కుల్దీప్లను మార్చిమార్చి బౌలింగ్ చేయించాడు. ఫలితంగా పవర్ ప్లే తర్వాత పాక్ జట్టు ఒక ఓవర్లో పది పరుగులు రాబట్టిన సందర్భాలు కేవలం మూడే ఉన్నాయి. ఇక 20వ ఓవర్ వచ్చేసరికి పాక్ బ్యాటర్లపై ఒత్తిడి పెరిగి రన్రేట్ పడిపోయింది. 20-42వ ఓవర్ మధ్యలో కేవలం 8 సార్లు మాత్రమే ఓవరకు ఐదు అంత కంటే ఎక్కువ పరుగులు చేశారు. ముఖ్యంగా జడేజా, కుల్దీప్ వేసిన 23-28 ఓవర్ల మధ్య స్పెల్లో పాక్ ఏ ఓవర్లోనూ 5 పరుగులు చేయలేదు. ఈ క్రమంలో తొలి స్పెల్లో ధారాళంగా పరుగులిచ్చిన సిరాజ్ మళ్లీ బౌలింగ్కు రావడంతో.. పరుగులు రాక ఒత్తిడిలో ఉన్న పాక్ బ్యాటర్లు అతడిపై ఎదురు దాడికి యత్నించారు. ఈ క్రమంలో బాబర్ వికెట్ను తీసి మరోసారి భారత్కు బ్రేక్త్రూ ఇచ్చాడు సిరాజ్. అంతే.. వికెట్ల కోసం ఎనిమిది ఓవర్లు వేచి ఉన్న కుల్దీప్ తన ఎనిమిదో ఓవర్లో సౌద్, రిజ్వాన్ వికెట్లు పడగొట్టాడు. అక్కడి నుంచి పాక్ బ్యాటింగ్ లైనప్ పేకమేడలా కూలిపోయింది. వికెట్లు లభించకపోతే.. పరుగులు కట్టడి చేస్తే ఫలితం లభిస్తుందనే ప్రాథమిక సూత్రాన్ని భారత్ అద్భుతంగా అమలు చేసింది. ఈ ప్రపంచకప్లో అత్యంత పొదుపరి టాప్-5 బౌలర్లలో నలుగురు భారతీయులే ఉన్నారు. ఈ జాబితాలో అశ్విన్ (3.40) బుమ్రా(3.44), జడేజా (3.73), కుల్దీప్ (3.90) ఉన్నారు. వీరిలో అశ్విన్ ఈ మ్యాచ్ ఆడలేదు. టోర్నీలో ఇప్పటి వరకు అత్యధిక డాట్బాల్స్ వేసింది బుమ్రా (115)నే. ఇక జడేజా (95) నాలుగో స్థానంలో ఉన్నాడు. ఈ జోడీ మూడు మ్యాచ్ల్లో 13 వికెట్లు పడగొట్టింది.
కుల్దీప్ బౌలింగ్లో చేసుకొన్న చిన్న మార్పులు అతడిని ప్రమాదకరంగా మర్చేశాయి. 2017తో పోలిస్తే.. ప్రస్తుతం అతడు బంతిని తక్కువగా టర్న్, బౌన్స్ చేస్తున్నాడు. అదే సమయంలో స్టంప్స్ను గురిపెడుతున్నాడు. ఈ క్రమంలో చిన్న చిన్న ట్రిక్స్తో వికెట్లను సాధిస్తున్నాడు. ఈ ఇన్నింగ్స్లో బాబర్-రిజ్వాన్ జోడీ అతడిని ఎదుర్కోవడానికి అవస్థలు పడింది. ఆ ఒత్తిడే.. వారు వికెట్లు సమర్పించుకొనేలా చేసింది.
పాక్ను కాదు.. టోర్నీని దృష్టిలోపెట్టుకొని బ్యాటింగ్..
50 ఓవర్లకు 192 అనేది చాలా చిన్న లక్ష్యం.. కానీ, అక్కడున్నది పాక్ సీమర్లు. షహీన్, హారిస్లతో కూడిన అత్యంత ప్రమాదకరమైన పేస్ దళం. కానీ, తొలి బంతి నుంచే పాక్ బౌలర్లపై రోహిత్ ఎదురుదాడి మొదలుపెట్టాడు. ముఖ్యంగా షహీన్, హారిస్లను లక్ష్యాంగా చేసుకున్నాడు. ఇందుకు ఓ కారణం ఉంది. ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్లు మెరుగైన రన్రేట్తో ఉన్నాయి. ఏదైనా జరిగి పాయింట్లు సమమైతే.. నెట్ రన్రేట్ కీలకమవుతుంది. ఈ అంశాన్ని కూడా కెప్టెన్ హిట్మ్యాన్ మనసులో పెట్టుకొన్నాడు. గిల్, కోహ్లీ వికెట్లు పడినా సరే.. ఎక్కడా పరుగుల వేగానికి బ్రేకులు వేయలేదు. నెదర్లాండ్స్ మ్యాచ్లో కూడ రోహిత్ ఇదే శైలిలో ఆడాడు. ప్రపంచకప్లో ప్రతి మ్యాచ్నూ భారత్ సీరియస్గా తీసుకుంటోదనడానికి ఇదే ఉదాహరణ.
ఇక భారత్ మిడిలార్డర్ కూడా ఇప్పటి వరకు టోర్నీలో తొలి మ్యాచ్ నుంచి అత్యంత బాధ్యతా యుతంగా ఆడుతూ వస్తోంది. ఆసీస్తో జరిగిన మ్యాచ్లో.. జట్టును గట్టెక్కించింది. తాజాగా గిల్, విరాట్ వంటి టాప్ ఆర్డర్ ఆటగాళ్లు వేగంగా ఆడే క్రమంలో ఔటైనా.. అయ్యర్, రాహుల్ ఎటువంటి లోపాలకు చోటివ్వకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు. ఛేజింగ్ చేయడం సహజంగానే బ్యాటర్లపై తెలియని ఒత్తిడిని పెంచుతుంది.. కానీ, ఈ టోర్నీలో ఆసీస్, పాక్ వంటి బలమైన జట్లను ఛేజింగ్లోనే ఓడించడం టీమ్ ఇండియా ఆత్మవిశ్వాసాన్ని తెలియజేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఛేజింగ్కి వస్తే... హైదరా‘బాధ’ తప్పదా?
హైదరాబాద్లో తొమ్మిది మ్యాచుల్లో ఐదు విజయాలు, నాలుగు ఓటములతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ప్రత్యర్థులు 200+ స్కోరు లక్ష్యాన్ని నిర్దేశిస్తే మాత్రం తేలిపోవడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. -
భారీ స్కోర్లు.. వరుస రికార్డులు.. మజా మాత్రం లేదు!
ఐపీఎల్ (IPL) వస్తోంది అంటే టన్నులకు టన్నులు మజా వస్తుంది అని క్రికెట్ ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి అలా లేదు. సమస్య ఏంటా? అని చూస్తే కొన్ని పాయింట్లు కనిపిస్తున్నాయి. -
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
ఐపీఎల్లో రిషభ్ పంత్ ప్రత్యేక ఆకర్షణగా మారాడు. దూకుడైన ఆటతీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. -
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
భాగ్యనగర వాసులకు మళ్లీ ఐపీఎల్ సందడి వచ్చేసింది. గురువారం బెంగళూరుతో హైదరాబాద్ (Hyderabad Vs Bengaluru) తలపడనుంది. -
చెపాక్లో చూసుకుందాం.. లఖ్నవూపై చెన్నై ప్రతీకారం తీరేనా?
మళ్లీ మ్యాచ్ చెపాక్కు వచ్చేసింది. లఖ్నవూతో తలపడేందుకు చెన్నై సిద్ధమవుతోంది. ఇరు జట్ల మధ్య జరిగిన గత మ్యాచ్లో కేఎల్ రాహుల్ నాయకత్వంలోని లఖ్నవూ విజయం సాధించింది. -
వరుస ఓటములతో డీలా.. బెంగళూరుకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలు ఉన్నాయా..?
ఈ సీజన్లో బెంగళూరు పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరుస్తోంది. ఆడిన ఎనిమిదింట్లో ఏడు ఓడి.. ప్లేఆఫ్స్ అవకాశాలకు దాదాపు దూరమైంది . -
200+ స్కోరు... చాలడం లేదు బాసూ!
ఐపీఎల్ 17వ సీజన్లో మ్యాచ్లు చివరి బంతి వరకూ రసవత్తరంగా సాగుతున్నాయి. భారీ స్కోరు చేసినా గెలుస్తామనే నమ్మకం చివరి వరకూ జట్లకు రావడం లేదు. -
సగం IPL పూర్తి.. బాదుడు నుంచి ఫ్లైయింగ్ కిస్ వరకు... ఆసక్తికర విశేషాలివే!
సుదీర్ఘమైన ఐపీఎల్ టోర్నీలో సగం మ్యాచ్లు ముగిశాయి. అనూహ్యంగా కొన్ని జట్లు చెలరేగగా.. మరికొన్ని డీలా పడిపోయి పాయింట్ల పట్టికలో అడుగుకు చేరాయి. -
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!
ధనాధన్ షాట్లతో ముంబయి మీద విరుచుకుపడి ఓటమి భయం చూపించిన అశుతోష్ శర్మ గురించి ఆసక్తికర విషయాలు... -
వీరుడొచ్చాడు.. సన్రైజర్స్కు దొరికిన మరో వార్నర్
సన్రైజర్స్ హైదరాబాద్ అంటే ఒకప్పుడు డేవిడ్ వార్నర్ (David Warner) మెరుపులే గుర్తుకొచ్చేవి. వార్నర్ వెళ్లిపోయిన తర్వాత ఆ లోటు కనిపించింది. ఓపెనింగ్లో ఓ ఖాళీ. రెండు సీజన్ల పాటు ఆ వెలితి అలాగే ఉంది. కానీ ఇప్పుడొక వీరుడొచ్చాడు. అతనే.. ట్రావిస్ హెడ్ (Travis Head). -
పరుగులివ్వడు.. వికెట్లు వదలడు... బెంబేలెత్తిస్తున్న బుమ్రా
ఐపీఎల్లో అదరగొడుతున్న బౌలర్ల జాబితా రాస్తే తొలి స్థానంలో కనిపించే పేరు జస్ప్రీత్ బుమ్రా. అతని బౌలింగ్లో ఆడటానికి బ్యాటర్లు బాగా ఇబ్బందిపడుతున్నారు. -
వీళ్లు ఆడితే మామూలుగా ఉండదు!
ఐపీఎల్.. ఈ టోర్నీ పేరు చెప్పగానే వెస్టిండీస్ ఆటగాళ్లే గుర్తొస్తారు. గత 16 ఏళ్లుగా కరీబియన్ ఆటగాళ్ల విన్యాసాలే అభిమానుల మనసుల్లో మెదులుతాయి. ఎందుకంటే తమ ఆటతోనే కాదు తమ హవభావాలతో మైదానంలో, మైదానం బయట ఈ విండీస్ వీరుల సందడి అంతాఇంతా కాదు. -
‘ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్’.. సత్తా చాటేందుకు విదేశీ సంచలనాల తహతహ
ఐపీఎల్లో తమ సత్తా నిరూపించుకోవడానికి ఆటగాళ్లు ఎదురు చూస్తుంటారు. ఫామ్ను అందుకోవడంతోపాటు ఫ్రాంచైజీ దృష్టిలో పడాలనేది కొందరి ఆశ. -
నితీశ్ రెడ్డి.. భారత్ క్రికెట్కు మరో పేస్ ఆల్రౌండర్ లభించినట్లేనా?
హైదరాబాద్ తరఫున మరో ఆణిముత్యం వంటి ఆటగాడు వెలుగులోకి వచ్చాడు. అదీనూ తెలుగు కుర్రాడు కావడం ఇక్కడ విశేషం. జట్టును గెలిపించే ప్రదర్శన చేయడం అభిమానులను ఆకట్టుకుంది. -
ఫామ్తో తంటాలా.. ఆర్సీబీ ఉందిగా!
ఈ ఐపీఎల్ సీజన్లో బెంగళూరుపై ఫామ్లో లేని ఆటగాళ్లు కూడా చెలరేగుతున్నారు. అంతేకాదు వారే మ్యాచ్ విన్నర్లుగా అవతరిస్తున్నారు. -
అప్పుడు వేస్ట్.. ఇప్పుడు బెస్ట్... ‘విఫల’ ముద్ర తొలగించుకున్న బ్యాటర్లు
ఐపీఎల్లో ఇప్పటివరకు సరిగ్గా ఆడని కొంతమంది ప్లేయర్లు ఈ సీజన్ ఐపీఎల్లో అదరగొట్టేస్తున్నారు. వాళ్లెవరు, వాళ్ల సంగతేంటో చూద్దాం! -
యశ్ ఠాకూర్.. ధోనీలా మారదామని వచ్చి.. పేసర్గా అదరగొట్టి!
లఖ్నవూ పేస్ బౌలర్లు పెను సంచలనంగా మారారు. ఇదివరకు మయాంక్ యాదవ్ తన ఫాస్ట్తో బెంబేలెత్తించగా.. తాజాగా యశ్ ఠాకూర్ అదరగొట్టాడు. -
వద్దనుకున్నవాడే వరమయ్యాడు.. ఎవరీ శశాంక్ సింగ్..?
తన అద్భుత బ్యాటింగ్తో గుజరాత్పై పంజాబ్కు విజయం అందించిన శశాంక్ సింగ్పై ఇప్పుడు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓరి‘నరైనో’.. బ్యాటుతో రెచ్చిపోతున్న విండీస్ స్పిన్నర్
ప్రత్యర్థి సొంత మైదానాల్లో దూకుడుగా ఆడుతూ పరుగులు రాబట్టడం అతడి ప్రత్యేకత. గత సీజన్లో పెద్దగా ప్రభావం చూపని ఈ కోల్కతా ఆటగాడు మళ్లీ బ్యాట్తో అదరగొట్టేస్తున్నాడు. -
వింటేజ్ ధోనీ... కీపింగ్ మెరుపులు ఓవైపు... భారీ సిక్సర్లు మరోవైపు!
తొలి రెండు మ్యాచుల్లో బ్యాటింగ్కి రాని ధోనీ... మూడో మ్యాచులో బరిలోకి దిగి భారీ సిక్సర్లు బాదాడు. దీంతో ఇప్పుడు అంతా అతని మేనియానే కనిపిస్తోంది. -
పంత్.. ఇదే కావాలయ్యా...రిషబ్ ఇక రెచ్చిపో!
రిషభ్ పంత్ జట్టులో ఉంటే అదో ధైర్యం. మనది కాదనుకున్న మ్యాచ్ను అమాంతం మనవైపు తిప్పేస్తుంటాడు. యాక్సిడెంట్ తర్వాత రీఎంట్రీలో చెన్నై మీద అదరగొట్టాడు.
తాజా వార్తలు (Latest News)
-
కెన్యాలో డ్యామ్ కూలి 40 మంది మృతి
-
ఈ క్రెడిట్ కార్డులతో బిల్లులు చెల్లిస్తున్నారా? మే 1 నుంచి అదనపు ఛార్జీ..!
-
వచ్చే వేలంలో అశ్విన్ అన్సోల్డ్.. వరల్డ్ కప్ జట్టులోనూ కష్టమే: సెహ్వాగ్
-
సీఏ పరీక్షల తేదీ మార్చాలని ‘పిల్’.. తోసిపుచ్చిన సుప్రీం కోర్టు
-
లండన్లోనూ డబ్బావాలా ఎఫెక్ట్: ఆనంద్ మహీంద్రా
-
జీవితంపై విరక్తి.. ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్య