IND w Vs AUS w: భారత్ - ఆస్ట్రేలియా సెమీస్.. వాతావరణం ఎలా ఉందంటే?

Eenadu icon
By Sports News Team Updated : 30 Oct 2025 10:38 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
2 min read

ఇంటర్నెట్ డెస్క్‌: నవీ ముంబయిలోని డీవై పాటిల్‌ మైదానం వేదికగా మహిళల వన్డే ప్రపంచ కప్‌ (ODI World Cup 2025) రెండో సెమీస్‌ జరగనుంది. ఆస్ట్రేలియాతో టీమ్‌ఇండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే, ఇవాళ వర్షం కారణంగా ఆట సాధ్యం కాకపోయినా.. ఎలాగూ రిజర్వ్‌ డే ఉంది. శుక్రవారం అయినా మ్యాచ్‌ నిర్వహించేందుకు ఆస్కారముంది. కానీ, అప్పుడు కూడా ఆట ఆడేందుకు వీలు కాకపోతే పాయింట్ల ఆధారంగా ఆస్ట్రేలియా (IND vs AUS) ఫైనల్‌కు చేరుతుంది. అంటే, ఇవాళలైనా, రేపైనా సరే మ్యాచ్‌ జరిగి టీమ్‌ఇండియా (Team India) గెలిస్తేనే టైటిల్‌ పోరుకు అర్హత సాధిస్తుంది. ఈ క్రమంలో వాతావరణం ఎలా ఉందో ఓ లుక్కేద్దాం.

  • మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. అంటే 2.30 గంటలకు టాస్‌ వేస్తారు.
  • ప్రస్తుతం అక్కడి వాతావరణం సాధారణంగానే ఉంది. అయినా ఎక్కువగా మబ్బులతో కూడి ఉంటుంది. 
  • మ్యాచ్‌ ప్రారంభ సమయానికి కూడా మబ్బులు ఉన్నా .. వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగానే ఉన్నట్లు ఆక్యూవెదర్ రిపోర్ట్ చెబుతోంది.
  • అడపాదడపా చినుకులు పడినా.. మ్యాచ్‌ను ఆపే స్థాయిలో మాత్రం వర్షం ఉండకపోవచ్చు. ఇవాళ మొత్తం ఇలాంటి పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
  • ఇవాళ్టితో పోలిస్తే రేపే నవీ ముంబయిలో భారీ వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. వీలైనంతగా ఇవాళే మ్యాచ్‌ జరిగి భారత్ మ్యాచ్‌ గెలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మ్యాచ్‌ను ఎలా చూడొచ్చంటే..

ఇప్పటికే దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేరుకుంది. తొలి సెమీస్‌లో ఇంగ్లాండ్‌ను ఆ జట్టు చిత్తు చేసింది. ఇప్పుడు రెండో సెమీస్‌లో విజేతగా నిలిచే టీమ్‌తో దక్షిణాఫ్రికా టైటిల్‌ కోసం తలపడనుంది. రెండో సెమీస్‌ భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌ను హాట్‌ స్టార్ ఓటీటీలోనూ, స్టార్‌ స్పోర్ట్స్‌ ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించొచ్చు. లీగ్‌ స్టేజ్‌లో ఆసీస్‌ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది.

Tags :
Published : 30 Oct 2025 10:32 IST

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు