IND vs NZ: మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక రెస్టారంట్కు వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్
కివీస్పై తొలి టీ20 మ్యాచ్లో (IND vs NZ) భారత్ (Team India) ఓటమిపాలైంది. ఛేదనలో టాప్ ఆర్డర్ విఫలం కావడంపై విమర్శలు రేగాయి. వెంటనే టాప్ ఆర్డర్ను మార్చాలనే వ్యాఖ్యలు వచ్చాయి. దీనిపై వాషింగ్టన్ సుందర్ (Washington Sundar) సరైన సమాధానం ఇచ్చాడు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూజిలాండ్తో తొలి టీ20 మ్యాచ్లో భారత్ ఓడిపోయిన విషయం తెలిసిందే. మూడు టీ20ల సిరీస్లో కివీస్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అటు బౌలింగ్లో, ఇటు బ్యాటింగ్లోనూ వాషింగ్టన్ సుందర్ రాణించినా విజయం మాత్రం టీమ్ఇండియా దరిచేరలేదు. అర్ధశతకం సాధించిన వాషింగ్టన్ సుందర్ (50) బౌలింగ్లోనూ కీలకమైన రెండు వికెట్లు తీశాడు. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. ఇదొక మ్యాచ్గానే పరిగణిస్తానని, ఓటమి నుంచి త్వరగా పాఠాలను నేర్చుకొంటామని చెప్పాడు.
‘‘కెప్టెన్ హార్దిక్ చెప్పినట్లుగా రాంచీ పిచ్ మమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. బంతి మరీ ఎక్కువగా తిరిగేసింది. అయితే మేం ఆ సమస్యను త్వరగానే పరిష్కరించుకొంటాం. ఇదొక మ్యాచ్ మాత్రమే. లక్ష్య ఛేదనలో మంచి ప్రారంభం లభించి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేది. ఇలాంటి పిచ్పై ఆడటం అంత సులువేం కాదు. స్పిన్నర్లు ఎక్కువగా వికెట్లు తీశారు. ఐపీఎల్లోనూ, టీమ్ఇండియాతో ఆడినప్పుడు ఇలాంటి పిచ్ మీద మన ఆటగాళ్లు చాలాసార్లు ఆడారు’’ అని తెలిపాడు.
అయితే వాషింగ్టన్ సుందర్ చెప్పిన సమాధానంపై జర్నలిస్ట్లు ప్రశ్నలు సంధించారు. ఈ సందర్భంగా ‘‘టాప్ ఆర్డర్’ను మార్చాల్సిన అవసరం ఉందని ఓ పాత్రికేయుడు ప్రస్తావించగా.. వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా బదులిచ్చాడు. ‘‘నిజంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉందంటారా..? ఒక రోజు మీకిష్టమైన బిర్యానీ ఓ రెస్టారంట్లో దొరకలేదనుకోండి.. అప్పటి నుంచి అక్కడకు మీరు వెళ్లకుండా ఉంటారా..? ఇప్పుడు మీరు అంటున్న ఆటగాళ్లు భారీగా పరుగులు చేసినవారే. ఏదో ఒక రోజు ఇలా జరిగింది. న్యూజిలాండ్ కూడా ఇలానే రాయ్పుర్లో 108 పరుగులకే కుప్పకూలింది. దీంతో వారి టాప్ఆర్డర్ను మార్చాలని కాదు. ఆటలో ఎప్పుడు ఏదైనా సాధ్యమే. ఓర్పుగా ఉండాల్సి ఉంటుంది. గేమ్లో ఒక జట్టే విజయం సాధిస్తుంది. 22 మంది ఆటగాళ్లూ ఒకేలా ప్రదర్శన ఇవ్వలేరు. ఇక అర్ష్దీప్ కూడా త్వరలోనే గాడిలో పడతాడు. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అలాగే గతేడాదిలో భారత్ తరఫున వికెట్లు తీశాడు. మాలిక్ వంటి బౌలర్లు అరుదుగా ఉంటారు. నిలకడగా 150 కి.మీ వేగంతో బంతిని సంధించడమంటే ఆషామాషీ కాదు’’ అని వాషింగ్టన్ సుందర్ తెలిపాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.