Jemimah Rodrigues: ఈ టోర్నీ మొత్తంలో ఏడవని రోజు లేదు.. మ్యాచ్ అనంతరం కన్నీళ్లు పెట్టుకున్న జెమీమా

ఇంటర్నెట్ డెస్క్: మహిళల ప్రపంచకప్లో జైత్రయాత్ర సాగించిన ఆస్ట్రేలియాను సెమీస్లో భారత జట్టు కంగుతినిపించింది. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంకో 9 బంతులుండగానే హర్మన్ప్రీత్ సేన ఛేదించింది. సొంతగడ్డపై అద్భుత ఇన్నింగ్స్తో జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) సంచలనం సృష్టించింది. అజేయ శతకంతో (127: 134 బంతుల్లో 14 ఫోర్లు) మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది. అసాధారణ లక్ష్యం ముందున్నా క్రీజులో బెరుకులేకుండా పాతుకపోయింది. హర్మన్ ప్రీత్ (89: 88 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్స్లు)తో కలిసి మూడో వికెట్కు 167 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జెమీమా.. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్ల సహకారంతో భారత్ను విజయతీరాలవైపు నడిపించింది.
మ్యాచ్ అనంతరం తీవ్ర భావోద్వేగానికి గురైన రోడ్రిగ్స్ కన్నీళ్లు పెట్టుకుంది. ‘‘దేవుడి దయ లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదు. ఆ దేవుడికి ధన్యవాదాలు. అమ్మ, నాన్న, కోచ్, నా ఆత్మీయులు నన్ను ఎంతో నమ్మారు. గత నెల చాలా కష్టంగా గడిచింది. కానీ, ఇప్పుడిది కలలా ఉంది. నమ్మలేకపోతున్నా. మూడో స్థానంలో బ్యాటింగ్కు వస్తానని ముందు నాకు తెలియదు. కేవలం ఐదు నిమిషాల ముందే చెప్పారు. నా కోసం పెద్ద ఇన్నింగ్స్ ఆడాలని అనుకోలేదు. ఇటీవల కీలక మ్యాచ్ల్లో టీమ్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఇండియాను గెలిపించి ఫైనల్కు తీసుకెళ్లాలనుకున్నా. అర్ధశతకం, శతకం గురించి ఆలోచించలేదు. కానీ కచ్చితంగా పెద్దస్కోర్ చేసి భారత్ను గెలిపించాలనుకున్నా.
మంచి ఫామ్లో ఉన్నప్పటికీ గత ప్రపంచకప్లో నాకు చోటు దక్కలేదు. కొన్ని విషయాలు మన పరిధిలో లేకుండానే వెంటవెంటనే జరుగుతుంటాయి. ఈ క్షణం కోసమే అలా జరిగి ఉంటుందనుకుంటా. ఈ టోర్నీలో నేను ఏడవని రోజు లేదు. మానసికంగా సరిగ్గా లేను. తీవ్రమైన ఆందోళనతో ఉన్నా. నేను మంచి ప్రదర్శన చేయాలని నాలోనే నేను అనుకునేదాన్ని. జట్టు కోసం నిలబడాలనుకున్నాను. అయితే మిగిలినదంతా దేవుడే చూసుకున్నాడు. బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఎంతో ఒత్తిడి ఉన్నా.. చాలా ప్రశాంతంగా దాన్ని అధిగమించాలనుకున్నాను. భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలవడం పట్ల సంతోషాన్ని ఆపుకోలేకపోయాను. హర్మన్ప్రీత్తో మంచి భాగస్వామ్యం నెలకొల్పాలని భావించాను. మ్యాచ్ ముగుస్తున్నకొద్దీ నేను మరింత దూకుడుగా ఆడాలనుకున్నాను కానీ ఆడలేకపోయాను. బంతి బంతికి దీప్తి నన్ను ఎంతో ప్రోత్సహించింది. జట్టు సభ్యులు అండగా ఉన్నారు. భారత్ గెలవడం పట్ల నేను క్రెడిట్ను తీసుకోవాలనుకోవడం లేదు. మ్యాచ్ను నేను ఒక్కదాన్నే గెలిపించలేదు. మైదానంలో అభిమానుల ప్రోత్సాహం నన్ను ఎంతో ఉత్సాహపరిచింది’’ అని జెమీమా అంది.
ఈ ప్రపంచకప్లో తొలి నాలుగు మ్యాచ్ల్లో రెండుసార్లు డకౌట్ అయిన జెమీమా.. మరో రెండు మ్యాచుల్లో చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. దీంతో ఇంగ్లాండ్తో జరిగిన ఐదో వన్డేలో జట్టు కూర్పులో భాగంగా ఏకంగా ఆమెను పక్కకు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే న్యూజిలాండ్తో జరిగిన కీలక పోరులో మళ్లీ జట్టులోకి వచ్చిన రోడ్రిగ్స్ 55 బంతుల్లో 76 పరుగులతో నాటౌట్గా నిలిచింది. ఇక సెమీస్లో భారీ శతకంతో తన సత్తా ఏమిటో మరోసారి చాటిచెప్పింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అప్పుడు ఒక్క మ్యాచ్ ఆడితే రూ.1,000 ఇచ్చారు: మిథాలి రాజ్
భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. - 
                                    
                                        

కలలు కనడం ఎప్పుడూ ఆపొద్దు: హర్మన్ ప్రీత్ కౌర్
టీమ్ఇండియా (Team India) మహిళల వన్డే వరల్డ్ కప్ను సొంతం చేసుకుని దశాబ్దాల నాటి కలను సాకారం చేసుకుంది. ఈ విజయంలో భారత జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది. - 
                                    
                                        

అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ..జట్టులో ద్రవిడ్ కుమారుడు
టీమ్ఇండియా (Team India) క్రికెట్ లెజెండ్ రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) కుమారుడు అన్వయ్ ద్రవిడ్ అండర్ 19 వన్డే ఛాలెంజర్ ట్రోఫీ (U19 One-Day Challenger Trophy) స్వ్కాడ్లో స్థానం సంపాదించుకున్నాడు. - 
                                    
                                        

హర్మన్ ప్రీత్.. అమన్జ్యోత్కు పీసీఏ ఎంత రివార్డ్ ప్రకటించిందంటే..!
టీమ్ఇండియా (Team India) మహిళల వన్డే ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన తమ రాష్ట్ర క్రికెటర్లైన హర్మన్ ప్రీత్ కౌర్, అమన్జ్యోత్ కౌర్కు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ (PCA) రూ.11 లక్షల రివార్డ్ను ప్రకటించింది. - 
                                    
                                        

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్.. భారత్ ఏ స్క్వాడ్ ప్రకటన.. చోటు దక్కించుకున్న వైభవ్ సూర్యవంశీ
ఖతార్ వేదికగా నవంబర్ 14 నుంచి ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ (Asia Cup Rising Stars) 2025 ప్రారంభం కానుంది. - 
                                    
                                        

వన్డే వరల్డ్ కప్ విజయం.. అమాంతం పెరిగిన భారత క్రికెటర్ల బ్రాండ్ వాల్యూ!
కొన్ని దశాబ్దాల నిరీక్షణకు తెర దించుతూ భారత మహిళల జట్టు (Team India) వన్డే వరల్డ్ కప్ను కైవసం చేసుకుంది. - 
                                    
                                        

భారత మహిళల జట్టు విజయోత్సవ ర్యాలీ ఎప్పుడంటే..: బీసీసీఐ
మహిళల వన్డే వరల్డ్ కప్ను తొలిసారిగా భారత జట్టు (Team India) కైవసం చేసుకుంది. ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి విశ్వవిజేతగా నిలిచింది. అయితే టీమ్ఇండియా విజయోత్సవ ర్యాలీ ఇప్పుడే జరిగే అవకాశాలు కనిపించడం లేదు. - 
                                    
                                        

భారత పురుషుల జట్టు చేయని దాన్ని మహిళల జట్టు చేసి చూపింది: రవిచంద్రన్ అశ్విన్
మహిళల వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై టీమ్ఇండియా (Team India) 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో భారతజట్టు విశ్వవిజేతగా నిలిచింది. - 
                                    
                                        

కథానాయకి
మేటి క్రికెటర్లందరూ గొప్ప కెప్టెన్లు అవుతారనే గ్యారెంటీ లేదు. అందుకు చరిత్రలో ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. కానీ కొందరిని చూస్తే సహజ నాయకుల్లా కనిపిస్తారు. - 
                                    
                                        

కసి రేగెను.. కథ మారెను
నెల కిందట మహిళల వన్డే ప్రపంచకప్ ఆరంభమవుతున్నపుడు.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా లాంటి మేటి జట్లను వెనక్కి నెట్టి భారత మహిళల జట్టు విజేతగా నిలవగలదని అనుకున్నామా? - 
                                    
                                        

అంబరాన్ని అంటిన సంబరాలు
దక్షిణాఫ్రికాపై అద్భుత విజయంతో వన్డే ప్రపంచకప్ అందుకున్న భారత్.. ఆదివారం రాత్రంతా సంబరాలు చేసుకుంది. ‘‘మువ్వన్నెల జెండా.. ఉవ్వెత్తున ఎగిరింది. - 
                                    
                                        

కోట్ల రూపాయలు.. వజ్రాల హారాలు
చరిత్రాత్మక వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత మహిళల జట్టుపై నజరానాల వర్షం కురుస్తోంది. హర్మన్ప్రీత్ బృందానికి బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని ప్రకటించింది. - 
                                    
                                        

ఈ 7 గంటలు మీవే కావాలి..
చక్దే ఇండియా సినిమా గుర్తుందా? భారత మహిళల హాకీ జట్టు కోచ్ కబీర్ఖాన్ (షారుక్ ఖాన్) ఫైనల్కు ముందు తన ప్లేయర్లలో ఎలాగైనా గెలవాలన్న కాంక్షను రగిలిస్తాడు. - 
                                    
                                        

పాపం.. ప్రతీక
ప్రతీక రావల్ ఈ ప్రపంచకప్లో భారత్ తరఫున రెండో అత్యధిక స్కోరర్. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. - 
                                    
                                        

సంక్షిప్త వార్తలు(5)
భారత స్టార్ దివ్య దేశ్ముఖ్.. చెస్ ప్రపంచకప్లో ఓడిపోయింది. ఈ మహిళల ప్రపంచకప్ విజేత.. తొలి రౌండ్లో 0-2తో అర్డిటిస్ (గ్రీస్) చేతిలో పరాజయం చవిచూసింది. - 
                                    
                                        

అప్పట్లో.. నేల మీదే నిద్ర.. పప్పన్నమే పరమాన్నం!
ప్రపంచ మహిళల వన్డే వరల్డ్ కప్ను టీమ్ఇండియా (Team India) కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో భారత్లో మహిళల క్రికెట్ ప్రస్థానంపై చర్చ నడుస్తోంది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

నన్ను ఇబ్బంది పెట్టకండి: బండ్ల గణేశ్ పోస్టు
 - 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 


