పసిపిల్లలు చనిపోతున్నారు.. మౌనమెందుకు?: ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణపై ఇర్ఫాన్ పఠాన్
Israel Hamas Conflict: హమాస్ను మట్టుపెట్టే లక్ష్యంతో గాజా నగరంపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇది పౌరుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఈ మానవ సంక్షోభంపై భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హమాస్(Israel Hamas) మధ్య జరుగుతోన్న భీకర ఘర్షణతో గాజా ప్రాంతంలోని అమాయక ప్రజల జీవితం ఛిద్రమవుతోంది. చిన్నారులతో సహా వేలల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ దాడుల వల్ల పౌరులు మృతి చెందడాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా భారత మాజీ ఆల్రౌండర్ ఇర్ఫాన్ పఠాన్(Irfan Pathan) తన అభిప్రాయం వ్యక్తం చేశారు. (Israel Hamas Conflict)
‘ప్రతిరోజూ గాజాలో పదేళ్లలోపు ఎందరో అమాయకపు చిన్నారులు అసువులు బాస్తున్నారు. ఈ సమయంలో ప్రపంచం మౌనం వహిస్తోంది. ఒక క్రీడాకారుడిగా నేను నా గళాన్ని మాత్రం వినిపించగలను. స్పృహ మరిచి చేస్తోన్న ఈ హత్యలను ఆపేందుకు ప్రపంచ నేతలంతా ఏకం కావడానికి ఇదే సరైన సమయం’ అని ఇర్ఫాన్ సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ఐరాస(UN)ను ట్యాగ్ చేశారు. ఇదివరకు భారత టెన్నిస్ దిగ్గజం సానియ మీర్జా కూడా గాజాలోని మరణాలపై ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయంగా మీ అభిప్రాయం ఏదైనా సరే.. గాజాలో నీరు, కరెంటు, ఆహారం అందక అల్లాడిపోతోన్న ప్రజల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని అభ్యర్థించారు.
గాజా గగనతలంలో అమెరికా డ్రోన్లు.. బందీల కోసం గాలింపు
ఇదిలా ఉంటే.. వైమానిక దాడులతో విరుచుకుపడుతోన్న ఇజ్రాయెల్ ప్రస్తుతం భూతల దాడుల తీవ్రతను కూడా పెంచింది. ఇజ్రాయెల్-హమాస్ ఘర్షణతో గాజాలో ఇప్పటివరకు 9వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించారు. వారిలో 3,600 మంది చిన్నారులున్నారు. 30వేల మందికిపైగా గాయపడ్డారని హమాస్ తెలిపింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ కోసం తమ ప్రయత్నాలను అమెరికా, అరబ్ దేశాలు ముమ్మరం చేశాయి. మానవతా సాయానికి వీలుగా కాల్పులకు కాస్త విరామం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు బైడెన్(Biden) ఇరు వర్గాలకు విజ్ఞప్తి చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో పల్లాలే ఎక్కువ
జీవితంలో ఎత్తుల కంటే పల్లాలే ఎక్కువ చూశానని టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. -
చెన్నై, బెంగళూరు మధ్యలో వరుణ్!
ఐపీఎల్-17 ప్లేఆఫ్స్ రేసులో కీలకంగా మారిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ సజావుగా సాగడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
ప్లేఆఫ్స్పై సన్రైజర్స్ గురి
బాదుడు మంత్రంతో.. దూకుడు ఆయుధంతో ఐపీఎల్-17వ సీజన్లో అసామాన్య ప్రదర్శనతో దూసుకెళ్తున్న సన్రైజర్స్ హైదరాబాద్ కీలక పోరుకు సిద్ధమైంది. -
రాజస్థాన్ మళ్లీ..
ప్చ్.. రాజస్థాన్! ప్లేఆఫ్స్లో స్థానం ఖరారైనా.. కీలక సమరాలకు ముందు పేలవ ఫామ్ ఆ జట్టును కలవరపెడుతోంది. -
నీరజ్దే పసిడి
మూడేళ్లలో తొలిసారి స్వదేశంలో పోటీపడ్డ భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా స్వర్ణంతో మెరిశాడు. -
భారత్ను పాక్ ఓడించడం కష్టమే
టీ20 ప్రపంచకప్లో భారత్ను పాకిస్థాన్ ఓడించడం కష్టమేనని ఆ జట్టు మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ అభిప్రాయపడ్డాడు. -
సాత్విక్ ద్వయం శుభారంభం
థాయ్లాండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్- చిరాగ్ జోడీ శుభారంభం చేసింది. -
‘లక్ష్య’ నందినికి స్వర్ణం
ఫెడరేషన్ కప్ జాతీయ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో ‘ఈనాడు’ సీఎస్ఆర్ కార్యక్రమం ‘లక్ష్య’ అథ్లెట్ అగసర నందిని సత్తాచాటింది. -
లామిచానె జైలుశిక్ష రద్దు
నేపాల్ స్టార్ క్రికెటర్ సందీప్ లామిచానెకు భారీ ఊరట. -
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్.. సీఎస్కే స్పందనిదే
టీమ్ఇండియా కొత్త కోచ్ రేసులో స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరు వినిపించడంపై సీఎస్కే జట్టు స్పందించింది.
తాజా వార్తలు (Latest News)
-
గాయంతోనే కేన్స్కు ఐశ్వర్యరాయ్.. వీడియో వైరల్
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు