IND vs ENG: బుమ్రా అసాధారణ బౌలర్.. అండర్సన్ అప్పటివరకూ కొనసాగాలి: మైకెల్ క్లార్క్
భారత్లో మ్యాచ్లు అంటే స్పిన్నర్ల హవా ఉంటుందని అంతా భావిస్తారు. లైన్ అండ్ లెంగ్త్తో పాటు విభిన్నంగా బంతులను సంధిస్తే వికెట్లను తీయొచ్చని టీమ్ఇండియా పేసర్ బుమ్రా నిరూపించాడు.
ఇంటర్నెట్ డెస్క్: రివర్స్ స్వింగ్, ఇన్-అవుట్ స్వింగ్తో ఇంగ్లాండ్ బ్యాటర్లను తొలి రెండు టెస్టుల్లో భారత పేసర్ జస్ప్రీత్ బుమ్రా(Jasprit Bumrah) బెంబేలెత్తించాడు. రెండో మ్యాచ్లో మొత్తం 9 వికెట్లు తీసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. తొలి టెస్టులో బరిలోకి దిగని ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) రెండో మ్యాచ్లో ఆడాడు. ఐదు వికెట్లతో మంచి ప్రదర్శనే చేశాడు. ఈక్రమంలో వారిద్దరి ఆటతీరుపైనా ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకెల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘‘రెండో టెస్టులో భారత్, ఇంగ్లాండ్ ప్రధాన పేసర్లు అదరగొట్టారు. బ్యాటింగ్ పిచ్పై పేసర్లకు పెద్దగా సహకారం లభించని పరిస్థితుల్లోనూ 14 వికెట్లు పడగొట్టడం అద్భుతం. ముఖ్యంగా బుమ్రా గురించి ప్రత్యేకంగా చెప్పడానికి మాటలు కూడా రావడం లేదు. అతడొక అసాధారణ బౌలర్. కేవలం ఫాస్ట్ బౌలింగ్లోనే తన నైపుణ్యం కనిపించడం కాకుండా.. బంతిని స్వింగ్ చేయడంలో దిట్ట. స్పిన్ పిచ్పైనా రివర్స్స్వింగ్ రాబట్టి వికెట్లు తీశాడు’’ అని క్లార్ చెప్పాడు.
41 ఏళ్ల వయసులో..
‘‘ఫాస్ట్ బౌలర్లలో ఒక వయసు వచ్చాక పేస్ తగ్గుతుంది. అలాగే బౌలింగ్ వేసే సామర్థ్యం కూడా కుంటుపడుతుంది. కానీ, 41 ఏళ్ల అండర్సన్ మాత్రం ఇప్పటికీ ఉత్సాహంగా బంతులను సంధించడం అభినందనీయం. రెండో టెస్టులో దాదాపు 35 ఓవర్లు బౌలింగ్ వేశాడు. అతడి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశాడు. చాలాసార్లు గాయాలబారిన పడ్డాడు. ఇప్పటికీ అండర్సన్ బౌలింగ్ దూకుడు ఏమాత్రం తగ్గలేదు. అందుకే, అతడు ఎంతకాలం ఆడాలని భావిస్తాడో అప్పటివరకూ కొనసాగాలి. ఇంగ్లాండ్ తరఫున చాలా రికార్డులు నెలకొల్పాడు. బెన్ స్టోక్స్, బ్రెండన్ మెక్కల్లమ్ కూడా సీనియర్ బౌలర్కు స్వేచ్ఛ ఇవ్వాలి. రెండో టెస్టులో అతడి బౌలింగ్ను చూసిన తర్వాత మరికొంతకాలం ఆడగలడనే నమ్మకం కలుగుతోంది’’ అని మైకెల్ క్లార్క్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.