Ambati Rayudu: సీఎస్కే ఎంతో స్పెషల్.. ధోనీ తర్వాత అతడే కెప్టెన్: అంబటి రాయుడు
తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు (Ambati Rayudu) భారత జట్టులో కంటే ఐపీఎల్లోనే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గత ఐపీఎల్ (IPL) ముగిసిన తర్వాత టీమ్ఇండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) ఆ టోర్నీకి వీడ్కోలు పలికేశాడు. ఐపీఎల్లో ముంబయి ఇండియన్స్ తరఫున ఎనిమిదేళ్లు (2010-2017), చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు (2018-2023) ఆరేళ్లు ప్రాతినిధ్యం వహించాడు. ఇరు జట్ల తరఫున ఐదు టైటిళ్లు సాధించిన స్క్వాడ్లో సభ్యుడు కావడం విశేషం. ముంబయి తరఫున 2015 ఫైనల్లో అంబటి రాయుడు ఆడిన ఇన్నింగ్సే ఆ జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించింది. ఆదివారం నాటితో ఐపీఎల్ 2024 ఎడిషన్కు సంబంధించిన ఆటగాళ్ల రిటెన్షన్ ప్రక్రియ ముగియనుంది. ఇప్పటికే అంబటి రిటైర్మెంట్ ప్రకటించడంతో సీఎస్కే అతడిని వదిలేయనుంది. ఈ క్రమంలో అంబటి రాయుడు తన ఐపీఎల్ ప్రయాణం గురించి ప్రత్యేకంగా మాట్లాడాడు.
‘‘నా ఐపీఎల్ కెరీర్ను ముంబయితో ప్రారంభించా. దాదాపు ఎనిమిదేళ్లు ఆడా. అదొక అద్భుత ప్రయాణం. నేను ఉన్నప్పుడు మేం మూడుసార్లు విజేతగా నిలిచాం. రెండు సార్లు ఛాంపియన్ లీగ్ను దక్కించుకున్నాం. అయితే ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్కు మారిపోయా. నా జీవితంలో ఆ జట్టు తరఫున ఆడటం ఎంతో ప్రత్యేకమైంది. అప్పటి వరకు ఒక డ్రెస్సింగ్ రూమ్ను పంచుకున్న నాకు సీఎస్కేతో అనుభవం కొత్తగా అనిపించింది. బ్లూ ప్యాడ్ల బదులు యెల్లోవి ధరించా. ముంబయి జట్టుతోనే తలపడ్డా. నా వికెట్ను తీసిన వారితోనే ప్రాక్టీస్ చేశా. ఒక్కోసారి ఇదంతా నా మైండ్లోకి వస్తే వింతైన అనుభవం కలిగేది. ప్రతి రోజూ దానిని గుర్తు చేసుకునేవాడిని. సీఎస్కేతో ఆడిన సమయం నాకెప్పటికీ స్పెషలే’’ అని అంబటి రాయుడు తెలిపాడు.
అతడికే అవకాశాలు ఎక్కువ..
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోనీ నాయకత్వంలోనే సీఎస్కే ఆడుతోంది. వచ్చే సీజన్లో ధోనీ సారథ్యంపై ఇప్పటివరకైతే ఎలాంటి అనుమానాలు లేవు. కానీ, ఆ తర్వాతి సీజన్లో మాత్రం సీఎస్కేకు కొత్త కెప్టెన్ నియామకం జరగడం తథ్యమనే వార్తలు వస్తున్నాయి. దీంతో ధోనీ స్థానంలో సీఎస్కే సారథిగా ఎవరు ఉంటారనేది ఆసక్తికరంగా మారింది. దానికి అంబటి రాయుడు తన విశ్లేషణ వెల్లడించాడు. ‘‘ఎంఎస్ ధోనీ తర్వాత సీఎస్కే కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. అయితే, మేనేజ్మెంట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే. జడేజాకు మరోసారి అవకాశం ఇవ్వడం కష్టమే’’ అని అంబటి వివరించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?