Kapil: టీమ్ఇండియా మేనేజ్మెంట్ ప్రణాళిక ఏంటో అర్థం కావడం లేదు: కపిల్ దేవ్
వన్డే ప్రపంచకప్ నేపథ్యంలో (ODI World Cup 2023) టీమ్ఇండియా (Team India) సన్నద్ధతను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలో సీనియర్లతోపాటు యువకులకు అవకాశాలు కల్పిస్తోంది. అయితే టీ20ల్లో దూకుడుగా ఆడే సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav)కు మాత్రం తక్కువగా అవకాశాలు వస్తున్నాయి. ఈ క్రమంలో కపిల్ దేవ్ తన అభిప్రాయాలను తెలిపాడు.
ఇంటర్నెట్ డెస్క్: సూర్యకుమార్ యాదవ్.. టీ20ల్లో భారీ ఇన్నింగ్స్లను ఆడటంలో దిట్ట. దాదాపు ఒకే ఏడాదిలో మూడు సెంచరీలు బాది సంచలనం సృష్టించాడు. పొట్టి ఫార్మాట్లో నంబర్వన్ ర్యాంకర్. అలాంటి సూర్యకుమార్కు వన్డేల్లో మాత్రం పెద్దగా అవకాశాలు రావడం లేదు. కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్.. ఇలా ఎవరైనా గాయపడితేనే జట్టులోకి తీసుకోవడం జరుగుతోంది. అలాగే ఐదారు స్థానాల్లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. ఈ క్రమంలో సూర్యకుమార్కు రెగ్యులర్గా జట్టులో స్థానం కల్పించకపోవడంపై టీమ్ఇండియా క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. టీ20ల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్లుగా ఎంపికైన ఆటగాడికి వన్డేల్లో స్థానం లేకపోవడం విచిత్రంగా ఉందన్నాడు.
‘‘ కొంతకాలమైన ఒకే జట్టును ఎంపిక చేసి మ్యాచ్లను ఆడించాలి. అందులో ఎవరైనా సరిగా ఆడకపోతే అప్పుడు మార్పు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా ఎంపికైన ఆటగాడిని తదుపరి మ్యాచ్కు పక్కన పెట్టడం.. జట్టులోకి వేరొకరు రావడం ఏంటో క్రికెటర్లుగా మాకు అర్థం కావడం లేదు. సూర్యకుమార్ పొట్టి ఫార్మాట్లో అదరగొట్టేశాడు. అయినా సరే అతడికి వన్డేల్లో చోటు కష్టంగా మారడం చూస్తున్నాం’’
‘‘అందుకే ఇలాంటి సమస్యకు పరిష్కారంగా మూడు ఫార్మాట్లకు వేర్వేరు జట్లను తయారు చేసుకొంటే బాగుంటుంది. ఇదంతా క్రికెట్ బోర్డు చూసుకొంటుంది. సెలెక్టర్లు తమ ప్రణాళికపై స్పష్టంగా ఉండాలి. అయితే ఇలా చేయడం వల్ల చాలా మంది క్రికెటర్లకు అవకాశాలు ఇచ్చినట్లు అవుతుంది. బయట నుంచి చూసే నాకు కూడా మనకు మూడు జట్లు ఉన్నాయి అనిపిస్తుంది. దాంతో మరింతమంది నాణ్యమైన ఆటగాళ్లను సిద్ధం చేసుకొనేందుకు అవకాశం ఉంటుంది’’ అని కపిల్ దేవ్ వెల్లడించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?