Asia Cup 2023: టీమ్ఇండియా అలా చేస్తోంది.. మీరు ఇంకా పాతకాలంలోనే ఉండిపోతే ఎలా?: షాహిద్ అఫ్రిది
ఆసియా కప్ 2023 (Asia Cup 2023) సూపర్ -4 దశలోనే పాకిస్థాన్ ఇంటిముఖం పట్టిన సంగతి తెలిసిందే. అయితే, మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయాలే దీనికి కారణమని మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఆసియా కప్ను (Asia Cup 2023) గెలిచి ప్రపంచ కప్ ముందు ఆత్మవిశ్వాసం పెంచుకోవాలని భావించిన పాకిస్థాన్ (Pak) ఆశలకు శ్రీలంక బ్రేక్ వేసింది. సూపర్ -4లో కీలకమైన పోరులో పాక్ను ఓడించి శ్రీలంక ఫైనల్కు (IND vs SL Final) చేరిన సంగతి తెలిసిందే. పాక్ ఓడిపోవడంపై ఆ జట్టు మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది మేనేజ్మెంట్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. పాతకాలంనాటి ఆలోచనాధోరణితో వ్యవహరిస్తుండటంపై విమర్శలు గుప్పించాడు. శ్రీలంకతో మ్యాచ్కు తుది జట్టు ఎంపిక నాసిరకంగా ఉందని వ్యాఖ్యానించాడు. రిజర్వ్ బెంచ్పై ఉన్న ఉత్తమ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వకుండా.. విఫలమైన వారితోనే ఆడించాలని విమర్శించాడు.
‘‘ పాకిస్థాన్ టీమ్ మేనేజ్మెంట్ ఇంకా పాతకాలం నాటి ఆలోచనా ధోరణితో కొట్టుమిట్టాడుతోంది. ఈ ఆసియా కప్లో టీమ్ఇండియా నిర్ణయాలను ఓసారి పరిశీలిస్తే వారేం చేస్తున్నారో అర్థమవుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇచ్చింది. తమ రిజర్వ్బెంచ్ను పరీక్షించుకుంది. సీనియర్లకు విశ్రాంతి ఇచ్చి.. జూనియర్లతో ఆడించింది. ఇదంతా ప్రపంచకప్ సన్నద్ధతను దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు సిద్ధమైంది. ఇలాంటి నిర్ణయాలు చాలా కీలకం. మీరు టోర్నీకి 15 మందితో కూడిన స్క్వాడ్ను ఎంపిక చేశారు. తుది జట్టులో ఉన్న వారితోపాటు మిగతా వారూ నాణ్యమైన ఆటగాళ్లే. వారితో మీకెలాంటి సమస్య లేదు కదా..
షాదాబ్ ఖాన్కు విశ్రాంతి ఇవ్వాలనుకుంటే అతడికి ప్రత్యామ్నాయంగా ఒసామా మిర్ ఉన్నాడు. పాకిస్థాన్ తరఫున ఉత్తమ ప్రదర్శన చేశాడు. వరుసగా మ్యాచుల్లో విఫలమైన వారికి విశ్రాంతి ఇచ్చి కొత్తవారితో ఆడించాలి. విఫలమైన వారిని స్క్వాడ్లో నుంచి తప్పించమని చెప్పను. వారికి రెస్ట్ ఇవ్వాలి. ప్రధాన కోచ్, బౌలింగ్ లేదా బ్యాటింగ్ కోచ్తో మాట్లాడించాలి. అయితే, పాక్ మేనేజ్మెంట్ ప్రణాళికలు ఏంటో నాకైతే అర్థం కావడం లేదు’’ అని షాహిద్ అఫ్రిది తెలిపాడు. పాకిస్థాన్ ఆసియా కప్ సూపర్ -4ను బంగ్లాదేశ్పై ఘన విజయంతోనే ప్రారంభించింది. అయితే, భారత్, శ్రీలంక చేతిలో ఓటమిపాలై నిష్ర్రమించింది. నసీమ్ షా, హారిస్ రవూఫ్ లేకపోవడం ఆ జట్టు అవకాశాలను దెబ్బతీసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.