Shami: వసీమ్ వివరించాడు.. అయినా హసన్ అలా మాట్లాడేందుకు సిగ్గుండాలి: పాక్ మాజీపై షమీ నిప్పులు
వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత విజయాలను తక్కువ చేస్తూ వ్యాఖ్యలు చేసిన పాక్ మాజీ ఆటగాడికి మహమ్మద్ షమీ కౌంటర్ ఇచ్చాడు. అలా మాట్లాడే ముందు ఇతరులు చెప్పింది కూడా వినాలని హితవు పలికాడు.
ఇంటర్నెట్ డెస్క్: వన్డే ప్రపంచకప్లో (ODI World Cup 2023) భారత్ జైత్రయాత్ర అప్రతిహతంగా సాగుతోంది. అయితే, ఈ విజయాలు కొందరు పాక్ మాజీ ఆటగాళ్లకు కంటగింపుగా మారినట్లుంది. టీమ్ఇండియా ఆడే మ్యాచ్ల కోసం విభిన్న బంతులను వాడుతున్నారని పాక్ మాజీ ఆటగాడు హసన్ రజా ఆరోపణలు గుప్పించాడు. అయితే, అతడి వ్యాఖ్యలను ఇప్పటికే మరో పాక్ క్రికెట్ దిగ్గజం వసీమ్ అక్రమ్ కొట్టిపారేశాడు. ఐసీసీ అధికారుల సమక్షంలోనే బంతుల ఎంపిక ఉంటుందని వివరించాడు. అయినా, హసన్ రజా అలాంటివి పట్టించుకోకుండా ఈసారి డీఆర్ఎస్పై నోరుపారేసుకున్నాడు. మోసానికి పాల్పడుతున్నారని వ్యాఖ్యానించాడు. దీంతో అతడి నోటిదురుసుపై భారత సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
‘‘కొంచెమైనా సిగ్గుండాలి. మీ గేమ్ మీద దృష్టిపెట్టాలి. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేయడం కాదు. ఇది ఐసీసీ వరల్డ్ కప్. మీ లోకల్ టోర్నమెంట్ కాదు. మీరు (హసన్ రజా) గతంలో ప్లేయరే కదా. ఇప్పటికే వసీమ్ అక్రమ్ సవివరంగా చెప్పాడు. కానీ, ఇప్పటికీ అదే ధోరణిలో ఉండటం హాస్యాస్పదం. అంటే క్రికెట్ దిగ్గజం, మీ మాజీ ఆటగాడు వసీమ్ అక్రమ్నే మీరు నమ్మడం లేదా? మిమ్మల్ని మీరు ప్రశంసించుకోవడంలో తీరిక లేకుండా ఉన్నారు’’ అని షమీ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ పెట్టాడు. ఇప్పుడదీ వైరల్గా మారింది. పాక్ మాజీకి సరైన సమాధానం ఇచ్చావని షమీని క్రికెట్ అభిమానులు ప్రశంసించారు.
ప్రస్తుతం భారత్ వన్డే ప్రపంచకప్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. వరుసగా 8 విజయాలు సాధించిన టీమ్ఇండియా లీగ్ దశలో చివరి మ్యాచ్ నెదర్లాండ్స్తో నవంబర్ 12న (ఆదివారం) బెంగళూరు వేదికగా తలపడనుంది. అగ్రస్థానంతో లీగ్ దశను ముగించే భారత్ నెదర్లాండ్స్తో మ్యాచ్ను ప్రయోగాలకు వేదికగా మార్చుకొనే అవకాశం ఉంది. భారత రిజర్వు ఆటగాళ్లు ముమ్మర సాధన చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.