Ishan-Suryakumar: ‘ఇషాన్ 2 ఇన్ 1 ప్లేయర్.. ఆ ఓవర్లలో ఎలా ఆడాలో సూర్యకుమార్కు తెలీదు’
త్వరలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ కోసం ఇషాన్ కిషన్ (Ishan Kishan)ను బ్యాకప్ వికెట్కీపర్గా తీసుకోవడంపై సెలక్షన్ కమిటీకి భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashiwn) మద్దతుగా నిలిచాడు.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో భారత్ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్ (World Cup 2023) కోసం ఇటీవల టీమ్ఇండియా (Team India) జట్టును ప్రకటించారు. రోహిత్ శర్మ కెప్టెన్గా 15 మంది ఆటగాళ్లను ఎంపిక చేయగా.. కేఎల్ రాహుల్కు బ్యాకప్ వికెట్కీపర్గా ఇషాన్ కిషన్(Ishan Kishan)ను తీసుకున్నారు. సంజు శాంసన్కు అవకాశం దక్కుతుందని భావించినా సెలక్టర్లు అతడి వైపు మొగ్గు చూపలేదు. ఇషాన్ను బ్యాకప్ వికెట్ కీపర్గా తీసుకోవడంపై సెలక్షన్ కమిటీకి భారత సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మద్దతుగా నిలిచాడు. ఇషాన్ కిషన్పై అశ్విన్ ప్రశంసలు కురిపించాడు. అతడిని ‘టూ ఇన్ వన్’ ప్లేయర్గా అభివర్ణించాడు. ఇషాన్ కిషన్, సంజు శాంసన్ మధ్య పోటీ లేదని పేర్కొన్నాడు.
‘‘ఇషాన్ కిషన్, సంజు శాంసన్ మధ్య పోటీ లేదు. ఇషాన్ చాలా పాత్రలను పోషిస్తాడు. 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంచుకున్నప్పుడు బ్యాకప్ వికెట్ కీపర్ అవసరం. ఇషాన్ టూ ఇన్ వన్ ప్లేయర్. బ్యాకప్ ఓపెనర్ కూడా. అంతేకాదు బ్యాటింగ్ ఆర్డర్లో ఐదో స్థానానికి బ్యాకప్గా ఉన్నాడు. ఆ స్థానంలో బరిలోకి దిగి మంచి స్కోర్లు సాధించాడు. అతడు నిస్వార్థ ఆటగాడు. డ్రెస్సింగ్ రూమ్లో పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తాడు’’ అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు.
సూర్యకుమార్కు ఆ విషయం తెలీదు: సంజయ్ బంగర్
టీమ్ఇండియా బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav)కు 25 నుంచి 40 ఓవర్ల మధ్య పరుగులు రాబట్టలేక ఇబ్బందిపడుతున్నాడని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పేర్కొన్నాడు. వన్డే ఫార్మాట్లో ఎలా ఆడాలనే విషయాలపై అతడు దృష్టి సారించాలన్నాడు. వన్డేల్లో తానింకా మెరుగుపడాల్సిన అవసరముందని ఇటీవల సూర్యకుమారే స్వయంగా అంగీకరించాడు.
‘‘ప్రతి బ్యాటర్ పరుగులు ఎలా రాబట్టాలో తెలుసుకోవాలి. సూర్యకుమార్ అద్భుతమైన ఆటగాడు. బౌండరీలే లక్ష్యంగా ఆడతాడు. ఏ గ్యాప్లో ఏ షాట్ కొడితే సిక్స్, ఫోర్ వెళ్తుందనే విషయంలో అతడికి మంచి అవగాహన ఉంది. కానీ, సూర్యకుమార్ నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. 25 నుంచి 40 ఓవర్ల మధ్య ఎలా బ్యాటింగ్ చేయాలో అతడు తెలుసుకోవాలి. ఈ ఓవర్లలో ఎలా పరుగులు రాబట్టాలనే విషయం అతడికి తెలీదు. ఈ బలహీనతపై అతడు దృష్టిపెట్టాలి’’ అని సంజయ్ సూచించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
చెన్నైకి పంజాబ్ పంచ్
పంజాబ్ కింగ్స్ అదుర్స్. వరుసగా నాలుగు ఓటముల అనంతరం కళ్లు చెదిరే బ్యాటింగ్తో గత మ్యాచ్లో కోల్కతాపై సంచలన విజయం సాధించిన ఆ జట్టు.. మరోసారి మెరిసింది. ఆల్రౌండ్ ఆధిపత్యంతో చెన్నై సూపర్కింగ్స్కు షాకిచ్చింది. -
రస్మలై, బిర్యానీ మానేసి.. 16కిలోలు తగ్గి..
రిషబ్ పంత్.. పునరాగమన హీరో. ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఇక మామూలుగా నడవడమే కష్టమనుకున్న దశ నుంచి, కెరీరే లేదనుకున్న స్థితి నుంచి కోలుకుని.. తిరిగి భారత జట్టులో చోటు సంపాదించడం ఎంతో స్ఫూర్తిదాయకం. -
రాజస్థాన్ను అడ్డుకునేనా?
వరుసగా నాలుగు విజయాలు.. రికార్డు స్కోర్లతో ఐపీఎల్లో జోష్ తీసుకొచ్చిన సన్రైజర్స్ హైదరాబాద్ ఒక్కసారిగా ఢీలాపడింది. వరుసగా రెండు పరాజయాలతో ప్రత్యర్థి జట్లకు కనీస పోటీ ఇవ్వలేని పరిస్థితికి చేరుకుంది. -
రింకు నిరాశ
మంచి ఫినిషర్గా పేరు తెచ్చుకున్న రింకు సింగ్ను టీ20 ప్రపంచకప్కు ఎంపిక చేయకపోవడం అభిమానులు, క్రికెట్ నిపుణులను షాక్కు గురి చేసింది. -
పోరాడి ఓడిన భారత్
థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీ చివరి లీగ్ పోరులో భారత జట్టుకు చుక్కెదురైంది. ఇప్పటికే క్వార్టర్ఫైనల్లో అడుగుపెట్టిన భారత్.. గ్రూపు-సి ఆఖరి పోరులో 1-4తో ఇండోనేసియా చేతిలో ఓడింది. -
న్యూయార్క్కు పిచ్ల తరలింపు
టీ20 ప్రపంచకప్ ఆతిథ్యం కోసం అమెరికా ముస్తాబవుతోంది. న్యూయార్క్లో జరిగే మ్యాచ్ల కోసం డ్రాప్ ఇన్ పిచ్లను సిద్ధం చేస్తున్నారు. -
ఆసీస్ జట్టులో స్మిత్కు దక్కని చోటు
టీ20 ప్రపంచకప్లో పోటీపడే ఆస్ట్రేలియా జట్టును బుధవారం ప్రకటించారు. మిచెల్ మార్ష్ నేతృత్వంలోని 15 మంది సభ్యుల జట్టులో వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్కు స్థానం దక్కలేదు. -
భారత జట్టుకు పారిస్ బెర్తే లక్ష్యం
పారిస్ ఒలింపిక్స్లో భారత రికర్వ్ జట్టు అర్హత సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్ అన్నాడు. వ్యక్తిగత విభాగంలో ధీరజ్ ఒక్కడికే పారిస్ బెర్తు దక్కింది. -
మిగతా ఐపీఎల్కు మయాంక్ అనుమానం
ప్లేఆఫ్స్ గడువు సమీపిస్తున్న సమయంలో లఖ్నవూ సూపర్ జెయింట్స్కు పెద్ద ఎదురుదెబ్బ. యువ పేస్ సంచలనం మయాంక్ యాదవ్ మిగతా ఐపీఎల్కు అందుబాటులో ఉండటం అనుమానంగా కనిపిస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?