IND vs SA: అతడి వికెట్ల దాహం తీరదు: కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ అద్భుతమైన శతకం.. భారత సూపర్ బౌలింగ్ దెబ్బకు దక్షిణాఫ్రికా మూడో టీ20 మ్యాచ్లో 100 పరుగులు కూడా దాటకుండానే కుదేలైంది.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్ను భారత్ (IND vs SA) సమం చేసింది. రెండో టీ20లో ఓటమికి మూడో మ్యాచ్లో విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, దక్షిణాఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ మాట్లాడారు. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ సూర్యకుమార్కు (Surya Kumar Yadav) దక్కాయి. ఈ సిరీస్లో తొలి టీ20 వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే.
నేను బాగానే ఉన్నా: సూర్య
‘‘ఫీల్డింగ్ చేస్తున్న క్రమంలో కాలు జారడంతో కొంత ఇబ్బంది పడ్డా. అయితే, ఇప్పుడు బాగానే నడుస్తున్నా. కీలక సమయంలో విజయం సాధిస్తే ఆ ఆనందమే వేరు. ఎప్పటిలానే నిర్భయంగా క్రికెట్ ఆడాలనే ప్రణాళికతో బరిలోకి దిగాం. తొలుత బ్యాటింగ్ చేస్తే స్కోరు బోర్డుపై భారీగా పరుగులు ఉంచాలి. దాని వల్ల బౌలర్లు స్వేచ్ఛగా బంతులను సంధించేందుకు అవకాశం లభిస్తుంది. మా ఆటగాళ్లు అన్ని విభాగాల్లోనూ అదరగొట్టేశారు. దూకుడుగా ఆడారు. కుల్దీప్ యాదవ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడు అల్పసంతోషి కాదు.. వికెట్ల కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాడు. అదే అతడి ప్రత్యేకత. బర్త్డే సందర్భంగా అద్భుతమైన గిఫ్ట్ను అందుకున్నాడు. ఈ మ్యాచ్ మాకు ఎంతో కీలకమని తెలుసు. జట్టులో సమతూకం చాలా అవసరం. ప్రతి క్షణం నేను ఆస్వాదించా’’ అని సూర్య వ్యాఖ్యానించాడు.
టార్గెట్ను ఛేదించగలమని భావించాం: మార్క్రమ్ (Markram)
‘‘బ్యాటింగ్కు దిగినప్పుడు భారత్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్య ఛేదన సాధ్యమేనని భావించాం. మేం ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో టీమ్ఇండియా బ్యాటర్లు మైదానం నలువైపులా షాట్లు కొట్టగలిగారు. మేం కూడా అలానే ఆడొచ్చని అనుకున్నాం. కానీ, పిచ్ ఒక్కసారిగా మారిపోయింది’’ అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఐదెన్ మార్క్రమ్ తెలిపాడు.
కుల్దీప్ బర్త్డే స్పెషల్..
టీ20ల్లో భారత్ తరఫున ఐదు అంతకంటే ఎక్కువ వికెట్ల ప్రదర్శన చేసిన బౌలర్ల జాబితాలో కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) నాలుగో బౌలర్. దీపక్ చాహర్ (6/7), చాహల్ (6/25), భువనేశ్వర్ కుమార్ (5/4) తర్వాత కుల్దీప్ (5/17) ఉన్నాడు. టీ20ల్లో కుల్దీప్ రెండోసారి ఐదు వికెట్లు తీశాడు. అలాగే బర్త్డే రోజున అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు నమోదు చేసిన తొలి బౌలర్ కుల్దీప్ కావడం విశేషం. భారత్ నుంచి తమ పుట్టిన రోజునాడు బౌలింగ్ చేసిన ముగ్గురు బౌలర్లూ డిసెంబర్లోనే జన్మించడం గమనార్హం. కుల్దీప్ (డిసెంబర్ 14) కాకుండా యువరాజ్ సింగ్ (డిసెంబర్ 12) శ్రీలంకపై 2009లో 3/23, రవీంద్ర జడేజా (డిసెంబర్ 6) విండీస్పై 2020లో 1/30 బౌలింగ్ చేశారు. వీరు ముగ్గురూ ఎడమచేతివాటం స్పిన్నర్లే కావడం మరో విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హైబ్రిడ్ పిచ్ల మీద ఐపీఎల్ మ్యాచ్లు... సరికొత్త ప్రయోగం ఫలిస్తుందా?
SisGrass Hybrid Pitch: ధర్మశాల వేదికగా జరగబోయే ఐపీఎల్ మ్యాచుల్లో హైబ్రిడ్ పిచ్లను వాడనున్నారు. ఏంటా పిచ్లు, ఎందుకు వాడుతున్నారు? -
అమెరికా జట్టులో మనోళ్లదే జోరు
టీ20 ప్రపంచకప్ కోసం శుక్రవారం ప్రకటించిన అమెరికా జట్టులో భారత సంతతి ఆటగాళ్లే ఎక్కువగా ఉన్నారు. 15 మంది ఆటగాళ్ల జాబితాలో ఏడుగురికి భారత మూలాలుండటం విశేషం. -
ముంబయి కథ ముగిసె!
ఐపీఎల్-17లో ఇక ముంబయి ఇండియన్స్ అభిమానులకు ఫలితాల గురించి బెంగ లేదు! ప్లేఆఫ్స్ సమీకరణాల గురించి వాళ్లు బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు! ఈ సీజన్లో ముంబయి కథ ముగిసినట్లే. -
వన్డేలు, టీ20ల్లో భారత్ నం.1
ఐసీసీ ర్యాంకింగ్స్లో భారత జట్టు వన్డేలు, టీ20ల్లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. కానీ టెస్టుల్లో మాత్రం నంబర్వన్ ర్యాంకు టీమ్ఇండియా చేజారింది. ఆస్ట్రేలియా తిరిగి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. -
రెండో టైటిల్ ఎవరికో?
గతేడాది సెప్టెంబర్లో ఆరంభం.. ఆరు నెలలకు పైగా ఫుట్బాల్ వినోదం.. 12 జట్లు.. అలరించిన 138 మ్యాచ్లు. ఇంత సుదీర్ఘంగా సాగిన ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్ఎల్) పదో సీజన్లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. -
విదేశాల్లో పోటీలకు జ్యోతి
పారిస్ ఒలింపిక్స్కు అర్హత సాధించే దిశగా విదేశాల్లో పోటీల్లో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ సంచలన స్ప్రింటర్ జ్యోతి యర్రాజికి అనుమతి లభించింది. జ్యోతితో పాటు లాంగ్జంప్ అథ్లెట్ శైలి సింగ్ ప్రతిపాదనలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. -
ఐపీఎల్లో అదే నా పాత్ర
ఆరంభంలో వికెట్లు కోల్పోయిన జట్టు ఇన్నింగ్స్ను నిర్మించడమే తన పాత్ర కర్తవ్యమని సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చెప్పాడు. రాజస్థాన్ రాయల్స్తో మ్యాచ్లో 35/2తో కష్టాల్లో పడ్డ జట్టును 76 పరుగుల అజేయ ఇన్నింగ్స్తో నితీశ్ ఆదుకున్న సంగతి తెలిసిందే. -
ఇష్టమైన ఆటగాడిగా నితీశ్
తనకు ఇష్టమైన క్రికెటర్లలో ఒకడిగా సన్రైజర్స్ హైదరాబాద్ యువ ఆటగాడు నితీశ్ రెడ్డి మారుతున్నాడని ఆస్ట్రేలియా దిగ్గజ ఆల్రౌండర్ షేన్ వాట్సన్ పేర్కొన్నాడు. ‘‘కచ్చితంగా చూడగలిగే నాకిష్టమైన ఆటగాళ్లలో ఒకడిగా నితీశ్ మారుతున్నాడు. -
ప్రపంచ రిలే బరిలో ‘లక్ష్య’ జ్యోతిక
ప్రపంచ అథ్లెటిక్స్ రిలే టోర్నీలో భారత జట్టు తన అదృష్టం పరీక్షించుకోనుంది. శనివారం ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పారిస్ ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా భారత బృందం బరిలో దిగుతుంది. -
రింకుకు ఇది ఆరంభమే: గంగూలీ
టీ20 ప్రపంచకప్కు ఎంపిక కానంత మాత్రాన బాధపడక్కర్లేదని రింకు సింగ్కు ఇది ఆరంభం మాత్రమేనని భారత క్రికెట్ మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు. ‘‘టీ20 ప్రపంచకప్లో ఎక్కువ మ్యాచ్లు జరిగేది వెస్టిండీస్లో. -
బంగ్లాదే తొలి టీ20
తంజిద్ హసన్ (67 నాటౌట్; 47 బంతుల్లో 8×4, 2×6) సత్తా చాటడంతో జింబాబ్వేతో టీ20 సిరీస్లో బంగ్లాదేశ్ బోణీ కొట్టింది. శుక్రవారం తొలి టీ20లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.