AUS vs IND: రాణించిన వాషింగ్టన్ సుందర్.. టీమ్ఇండియా ఘన విజయం

ఇంటర్నెట్ డెస్క్: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమ్ఇండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (49*; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్లు) ధనాధన్ ఇన్నింగ్స్తో అలరించాడు. తిలక్ వర్మ (29; 26 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (25; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్లు), సూర్యకుమార్ యాదవ్ (24; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్లు) చెప్పుకోదగ్గ పరుగులు చేశారు. ఈ విజయంతో అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ను భారత్ 1-1తో సమం చేసింది.
టీమ్ ఇండియా తన బ్యాటింగ్ను దూకుడుగా ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ మొదటి రెండు ఓవర్లలో రెండు సిక్స్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు అభిషేక్.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో (3.3) వికెట్ కీపర్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్మన్ గిల్ (15) ఎల్లిస్ బౌలింగ్లోనే (5.3) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్లో విఫలమైన గిల్.. మూడో మ్యాచ్లోనూ పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. మంచి టచ్లో కనిపించిన సూర్యకుమార్ యాదవ్ స్టాయినిస్ బౌలింగ్లో (7.3) నాథన్ ఎల్లిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తనకు లభించిన ఆరంభాన్ని తిలక్ వర్మ పెద్ద స్కోర్గా మలచలేకపోయాడు. జేవియర్ బార్ట్లెట్ బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అక్షర్ పటేల్ (17) సైతం తక్కువ స్కోర్కే వెనుదిరిగాడు. త్రుటిలో హాఫ్సెంచరీని మిస్చేసుకున్న వాషింగ్టన్ సుందర్ చివరి వరకు క్రీజులో పాతుకుపోయి, టీమ్ఇండియాకు విజయాన్ని అందించాడు. జితేశ్ శర్మ (22*) టీమ్ఇండియా విజయంలో తన వంతు పాత్రపోషించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, జేవియర్ బార్ట్లెట్, మార్కస్ స్టాయినిస్ తలో వికెట్ తీసుకున్నారు.
ఆసీస్ బ్యాటింగ్ విషయానికొస్తే.. టాప్-3 బ్యాటర్లు ట్రావిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (11), జోష్ ఇంగ్లిస్ (1) త్వరగా పెవిలియన్ చేరగా.. టిమ్ డేవిడ్ (74; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్లు), మార్కస్ స్టాయినిస్ (64; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్లు) కీలక ఇన్నింగ్స్లు ఆడారు. మాథ్యూ షార్ట్ (26*) పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో అర్ష్దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబె ఒక వికెట్ తీశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
మహిళల ప్రపంచకప్లో టీమ్ఇండియా (Team India) విజేతగా నిలవడంలో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కీలకపాత్ర పోషించింది. - 
                                    
                                        

గాలి వాటం కాదు.. డబ్ల్యూపీఎల్ వేసిన పీఠం ఇది!
నవీముంబయి స్టేడియంలో వెలుగులు విరజిమ్మే దీపకాంతుల మధ్య.. భారత మహిళల జట్టు (Team India) కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో ఆఖరు క్యాచ్ అందుకుంది. దీంతో టీమ్ఇండియా చరిత్రలో తొలిసారిగా విశ్వవిజేతగా అవతరించింది. - 
                                    
                                        

‘క్యాప్’ పెట్టుకోకుండానే కప్ కొట్టాడు..
చాలామంది ఎంత కష్టపడ్డా కాలం కలిసి రాకో.. పరిస్థితుల ప్రభావం వల్లో జీవితంలో అనుకున్నది సాధించరు. కానీ, కొంతమంది అంతటితో కుంగిపోరు. - 
                                    
                                        

కప్పు గెలిచిన అమ్మాయిలకు డైమండ్ నెక్లెస్లు.. వ్యాపారి గిఫ్ట్
Women's World Cup: ప్రపంచకప్ నెగ్గిన భారత మహిళా క్రికెటర్లకు వజ్రాల ఆభరణాలు, సోలార్ ప్యానెళ్లను గిఫ్ట్గా ఇవ్వనున్నట్లు సూరత్ వ్యాపారి ప్రకటించారు. - 
                                    
                                        

కప్పు గెలిచినా.. మిమ్మల్ని ఎప్పటికీ మరవం..
2025 మహిళల వన్డే ప్రపంచ కప్లో హర్మన్ప్రీత్ సేన ఛాంపియన్గా నిలిచి భారత మహిళల క్రికెట్లో కొత్త చరిత్ర సృష్టించింది. - 
                                    
                                        

‘మా కూతురు.. అబ్బాయిలతో క్రికెట్ ఆడేది’
మహిళల వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించిన భారత జట్టులో సిమ్లాకు చెందిన రేణుక సింగ్ ఠాకూర్ కీలక బౌలర్. ఆమెకు చిన్నప్పటి నుంచీ క్రికెట్ అంటే ప్రాణమని ఆమె తల్లి సునీత వివరించారు. తన భర్తకు కూడా రేణుకను క్రికెటర్గా చూడాలని ఆశగా ఉండేదని ఆమె తెలిపారు. - 
                                    
                                        

కెప్టెన్ హర్మన్.. విమర్శలను అధిగమించి.. జగజ్జేతగా నిలిపి!
హర్మన్ ప్రీత్ కౌర్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. కానీ, వన్డే ప్రపంచ కప్ టోర్నీకి కొన్ని రోజుల ముందు ఆసీస్తో స్వదేశంలో వన్డే సిరీస్ను భారత్ కోల్పోయింది. అప్పుడు ఆమెపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఒకదశలో హర్మన్ను సారథ్యం నుంచి తప్పించాలనే డిమాండ్లూ వచ్చాయి. వాటన్నింటికీ సమాధానం ఈ వరల్డ్ కప్. - 
                                    
                                        

అవమానాలు దాటి.. కూతుర్ని పంపి: నాన్న దిద్దిన ‘దీప్తి’..!
Deepti Sharma: దీప్తిశర్మ తన ఆల్రౌండ్ ప్రదర్శనతో టీమ్ ఇండియాకు విజయం కట్టబెట్టింది. ఆమె క్రికెట్ ఆడటం మొదలు పెట్టినప్పుడు ఆమె కుటుంబం ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. - 
                                    
                                        

ఆమె బౌలింగే మాకు సర్ప్రైజ్.. మేం సిద్ధం కాలేకపోయాం : దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా
భారత జట్టు ప్రయోగించిన ఓ అస్త్రం తమ విజయాన్ని అడ్డుకుందని దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ తెలిపింది. - 
                                    
                                        
ఫైనల్కు ముందు సచిన్తో చాట్.. అంతా మార్చేసింది: షెఫాలి వర్మ
Shafali Verma: మ్యాచ్కు ముందు సచిన్తో మాట్లాడటం తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని షెఫాలి వెల్లడించింది. - 
                                    
                                        

అమ్మాయిల పట్టు.. బంతి చేయి దాటితే ఒట్టు..!
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. ఈ మూడింట్లో ఏది విఫలమైనా ఛాంపియన్గా నిలవడం కష్టం. కానీ, భారత మహిళా జట్టు మాత్రం మూడింట్లోనూ సత్తా చాటింది. - 
                                    
                                        

మ్యాచ్ బాల్ వేళ.. 1983లో గావస్కర్.. నేడు హర్మన్ప్రీత్
తొలిసారి ప్రపంచకప్ నెగ్గిన అనంతరం హర్మన్ప్రీత్ బంతిని పాకెట్లో భద్రంగా దాచిపెట్టుకొన్న తీరు క్రికెట్ అభిమానులకు క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ను గుర్తు చేసింది. - 
                                    
                                        

వైరల్ పిక్.. గురుభక్తి చాటుకున్న హర్మన్ప్రీత్
మైదానంలో హర్మన్ప్రీత్ తన గురువు కాళ్లకు నమస్కరించడం అందరి దృష్టిని ఆకర్షించింది. - 
                                    
                                        

‘మీరు భావితరాల ఆడ పిల్లలకు ఘన వారసత్వాన్ని ఇచ్చారు’
భారత మహిళా జట్టు వన్డే ప్రపంచ కప్ను నెగ్గడంపై మాజీ క్రికెటర్లు, ప్రస్తుత ఆటగాళ్లు తమ స్పందనను తెలియజేశారు. - 
                                    
                                        

ఇంకా కలలోనే ఉన్నామా: జెమీమా-మంధాన కప్ ఫొటోలు వైరల్
Womens World Cup: వరల్డ్ కప్ సాధించిన అమ్మాయిల జట్టు ఆనందంలో మునిగితేలుతోంది. - 
                                    
                                        

వన్డే ప్రపంచ కప్ విజేతకు బీసీసీఐ రూ.51 కోట్ల నజరానా
తొలిసారి ప్రపంచ కప్ను నెగ్గిన భారత మహిళా జట్టుపై బీసీసీఐ కాసుల వర్షం కురిపించింది. హర్మన్ సేనకు భారీ నజరానా ఇస్తున్నట్లు ప్రకటించింది. - 
                                    
                                        

మా అమ్మాయిలు విజయానికి అర్హులు: అమోల్ మజుందార్
భారత మహిళా జట్టు అద్భుతం చేసిందని ప్రధాన కోచ్ అమోల్ మజుందార్ కొనియాడాడు. ఓటముల నుంచి పాఠాలు నేర్చుకొని విజేతగా నిలవడం గొప్ప విషయమని ప్రశంసించాడు. - 
                                    
                                        

ఆ మ్యాచ్ ఓటమి.. జట్టును మరింత ఏకం చేసింది: హర్మన్ ప్రీత్ కౌర్
ఒక్క ఓటమితో జట్టంతా డీలా పడటం సహజం. కానీ, దాన్నుంచి బయటకొచ్చి విజేతగా నిలవడం మాత్రం అద్భుతం. అలాంటి దానిని భారత మహిళా జట్టు చేసి చూపించింది. - 
                                    
                                        

సచిన్ చేతుల మీదుగా..
మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా దిగ్గజ ఆటగాడు సచిన్ తెందుల్కర్ మైదానంలోకి వచ్చాడు. వెలుగు జిలుగుల మధ్య అతడు ప్రపంచకప్ ట్రోఫీతో ప్రవేశించగానే అభిమానుల అరుపులతో డీవై పాటిల్ స్టేడియం దద్దరిల్లింది. - 
                                    
                                        

వాళ్ల వెనుక అతడు
భారత మహిళల క్రికెట్ జట్టులో రెండేళ్ల కిందటి వరకు స్థిరత్వం లేదు. కొన్ని మ్యాచ్లు గెలవడం.. తర్వాత గెలిచే మ్యాచ్లు ఓడిపోవడం.. ఇలా సాగేది ప్రయాణం. కానీ ఇప్పుడు భారత్ మారింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఆదిలాబాద్ ఎయిర్పోర్టు భూసేకరణకు ప్రభుత్వం అనుమతి
 - 
                        
                            

జోగి రమేశ్ను కస్టడీకి కోరుతూ ఎక్సైజ్శాఖ పిటిషన్
 - 
                        
                            

ఎస్వీయూలో విద్యార్థినులపై ప్రొఫెసర్ వేధింపులు.. విద్యార్థి సంఘాల ఆందోళన
 - 
                        
                            

క్రికెట్ అందరి గేమ్: హర్మన్ ప్రీత్ కౌర్
 - 
                        
                            

వారసత్వ రాజకీయాలతో ప్రజాస్వామ్యానికి తీవ్ర ముప్పు: శశిథరూర్
 - 
                        
                            

చేవెళ్ల బస్సు దుర్ఘటనకు అదీ ఒక కారణమే: మంత్రి పొన్నం
 


