telangana panchayat elections 2025: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల (telangana panchayat elections 2025) నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించబోతున్నట్లు చెప్పారు. డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో (telangana panchayat elections date) పోలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల నియమావళి మంగళవారం నుంచే అమల్లోకి వచ్చిందని రాణి కుముదిని స్పష్టం చేశారు.
‘‘సెప్టెంబర్ 29న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాం. కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 9న షెడ్యూల్పై స్టే విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ ఓటర్లు 1.66 కోట్ల మంది ఉన్నారు. 4,236 సర్పంచ్ స్థానాలకు, 37,440 వార్డులకు తొలి దశలో ఎన్నికలు నిర్వహిస్తాం’’ అని ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని తెలిపారు. గురువారం (నవంబర్ 27) నుంచి తొలి విడత పోలింగ్కు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడత ఎన్నికలకు ఈ నెల 30 నుంచి, మూడో విడత ఎన్నికలకు డిసెంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. రెండో విడతలో 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డులకు పోలింగ్ జరగనుండగా.. మూడో విడతలో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డులకు పోలింగ్ నిర్వహించనున్నారు.



Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-

తాగునీటితో కారు క్లీనింగ్.. హైదరాబాద్లో వ్యక్తికి జరిమానా
జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు వినియోగించిన ఓ వ్యక్తికి అధికారులు జరిమానా విధించారు. -

రహస్య స్నేహితుడు... అంత హితుడేం కాదు!
అమెరికాలో స్టెయిన్ ఎరిక్ సోల్బర్గ్(56) అనే వ్యక్తి చాట్జీపీటీని విశ్వసించి, అదే వాస్తవమనే స్థితికి చేరారు. అది చెప్పిందని కన్నతల్లినే మట్టుబెట్టాడు. -

కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’: కేటీఆర్
కాంగ్రెస్ అరాచకాలపై ‘విద్యార్థి రణభేరి’ మోగించాలని మాజీ మంత్రి, భారత రాష్ట్రసమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పిలుపునిచ్చారు. -

ఈ ప్రభుత్వం 20పైసలు ఇస్తూ 80 పైసలకు ఎగనామం పెడుతోంది: హరీశ్రావు
కేసీఆర్ ప్రతి బతుకమ్మ పండగకి 18 ఏళ్లు నిండిన 1.30కోట్ల మంది మహిళలకు చీరలు అందిస్తే.. రేవంత్రెడ్డి ప్రభుత్వం ఎస్హెచ్జీ గ్రూప్లో ఉన్న 46లక్షల మందికే చీరలు ఇస్తున్నారని మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి నేత హరీశ్రావు విమర్శించారు. -

ఐ-బొమ్మ రవి ఓవర్కాన్ఫిడెన్స్తో ఉన్నాడు: సైబర్ క్రైమ్ అడిషనల్ సీపీ
తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైన ఐ- బొమ్మ కేసుకు సంబంధించి నిందితుడు ఇమంది రవి నుంచి కీలక వివరాలు రాబట్టినట్లు సైబర్క్రైమ్ అడిషనల్ సీపీ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. -

జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ సమావేశం ముగిసింది. -

చెక్ డ్యామ్లపై విజిలెన్స్ విచారణ ఏమైంది?: సీఎం రేవంత్రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ
తెలంగాణలో చెక్ డ్యామ్లు కూలిపోవడంపై అనుమానాలున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. -

సీపీఎం ఆందోళన.. ఖమ్మం కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత
సీపీఎం సీనియర్ నేత సామినేని రామారావు హత్యకు నిరసనగా ఆ పార్టీ నేతలు జిల్లా కలెక్టరేట్ ముట్టడికి యత్నించారు. -

తెలంగాణలో నేడు గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల (Gram Panchayat elections) నిర్వహణకు షెడ్యూలు, నోటిఫికేషన్ ఇవాళ సాయంత్రం విడదుల కానుంది. -

గురు తేజ్ బహదూర్ బలిదానాన్ని దేశమంతా గుర్తించాలి: రామచందర్రావు
మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ సింగ్ ఆధ్వర్యంలో భాజపా రాష్ట్ర కార్యాలయంలో గురు తేజ్ బహదూర్ 350వ వర్థంతి సందర్భంగా బలిదాన్ దివాస్ కార్యక్రమం జరిగింది. -

ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు తప్పిన ప్రమాదం
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్(Aadi Srinivas)కు త్రుటిలో ప్రమాదం తప్పింది. -

యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై ఏఆర్ కానిస్టేబుల్ అసభ్యకరంగా ప్రవర్తించాడు. -

జూబ్లీహిల్స్లో దోపిడీకి యత్నం.. తాళ్లతో కట్టేసి డ్రైవర్పై కత్తులతో దాడి
జూబ్లీహిల్స్లో అర్ధరాత్రి ఓ ఇంట్లోకి చొరబడిన దుండగులు కత్తులతో దాడి చేసి.. దోపిడీకి యత్నించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన సమాచారంతో జూబ్లీహిల్స్ పోలీసులు సకాలంలో చేరుకోవడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. -

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం.. భాజపా కార్పొరేటర్ల వినూత్న నిరసన
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(GHMC) కౌన్సిల్ సమావేశం ప్రారంభానికి ముందే రభస మొదలైంది. -

హబ్సిగూడలో భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య
హబ్సిగూడలో విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలిక (14) ఈరోజు తెల్లవారు జామున ఐదంతస్తుల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. -

సచిన్కు ఎదురైన యువరాజ్
మాజీ స్టార్ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ 2 రోజుల తాడోబా పర్యటన సోమవారంతో ముగిసింది. మిత్రులతో కలిసి సచిన్ దంపతులు తాడోబా కోర్జోన్లో పర్యటించారు. -

హాయ్ జియా... నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా?
‘‘హాయ్ జియా... ఎయిర్పోర్టుకు దగ్గర్లో ఉన్నా.. ముంబయికి వెళ్తున్నా.. నా ఫ్లైట్ సరైన సమయానికే వస్తోందా... చెకిన్లో మార్పులున్నాయా..?’’ -

తెలంగాణ ప్రాజెక్టులకు త్వరగా అనుమతులివ్వండి: పొన్నం
గౌరవెల్లి సహా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ సాగునీటి ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు త్వరగా మంజూరు చేయాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కార్యదర్శి తన్మయ్కుమార్ను కోరారు. -

హిల్ట్ పాలసీ పెద్ద కుంభకోణం
ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హెచ్ఐఎల్టీ) పాలసీ పెద్ద కుంభకోణమని భాజపా శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. -

ప్రభుత్వం జీవో వెనక్కి తీసుకోకుంటే రేపటి నుంచి నిరవధిక నిరాహారదీక్షలు: ఆర్.కృష్ణయ్య
‘కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల రాజకీయ అవకాశాలు దెబ్బతీసేందుకు కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. హైకోర్టులో వాదనలు కొనసాగుతున్న తరుణంలోనే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జీవో 46 విడుదల చేయడమే దీనికి నిదర్శనం’ అని బీసీ ఐకాస ఛైర్మన్, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య మండిపడ్డారు.
- జిల్లా వార్తలు
- ఆంధ్రప్రదేశ్
- తెలంగాణ
తాజా వార్తలు (Latest News)
-

టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?
-

ఛత్తీస్గఢ్లో 28 మంది మావోయిస్టుల లొంగుబాటు
-

పాక్-బంగ్లా చెట్టాపట్టాల్.. లక్ష టన్నుల బియ్యం ఎగుమతి
-

ఐ బొమ్మ రవి.. మరోసారి కస్టడీకి!
-

తాగునీటితో కారు క్లీనింగ్.. హైదరాబాద్లో వ్యక్తికి రూ.10వేలు జరిమానా
-

అప్పుడు చేదు అనుభవం.. అందుకే ఇప్పుడు ఒప్పందం: ప్రశాంత్ వర్మ


