ప్రాథమిక దశలోనే వ్యాధుల కట్టడికి చర్యలు
గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ముదిరాక ప్రజలు ఆసుపత్రికి వస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక దశలోనే వ్యాధుల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు
ఆసుపత్రి త్రీడీ నమూనాను పరిశీలిస్తున్న తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, జన మంగళం ట్రస్టు
ప్రతినిధి డా.సీబీ సత్పతి, డీఆర్డీవో ఛైర్మన్ సతీష్రెడ్డి, మంత్రి హరీశ్రావు తదితరులు
సోమాజిగూడ, న్యూస్టుడే: గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి ముదిరాక ప్రజలు ఆసుపత్రికి వస్తున్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రాథమిక దశలోనే వ్యాధుల కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. రాష్ట్రంలో నాలుగు వేల పల్లె దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని ఆయన చెప్పారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపూర్లో జన మంగళం ట్రస్టు ఏర్పాటు చేస్తున్న 250 పడకల ఆసుపత్రి నమూనాను హైదరాబాద్లోని ఓ హోటల్లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో తితిదే ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, డీఆర్డీవో ఛైర్మన్ సతీష్రెడ్డి, సినీ నటుడు మోహన్బాబుతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ‘‘గతంలో లేనివిధంగా 30-40 ఏళ్ల వయసులోనే రక్తపోటు, మధుమేహం స్థాయి పెరుగుతోంది. ఇలాంటి వాటిని ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు పల్లె దవాఖానాలు అందుబాటులోకి తెస్తున్నాం. ప్రతి 2-3 గ్రామాలకు ఒక వైద్యుడిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’’ అని వివరించారు. వై.వి.సుబ్బారెడ్డి, సతీష్రెడ్డి, సినీ నటుడు మోహన్బాబు మాట్లాడారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నవీన్రావు, మెదక్ ఎంపీ ప్రభాకర్రెడ్డి, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ట్రస్టు ప్రతినిధి డా.సీబీ సత్పతి, వరప్రసాద్రెడ్డి(శాంతా బయోటెక్) తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నాలుగో రోజూ 46 డిగ్రీలపైనే..
రాష్ట్రంలో వరుసగా నాలుగో రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. శుక్రవారం 10 జిల్లాల్లోని 20 మండలాల్లో 46.3 నుంచి 46.7 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యాయి. -
రిజిస్ట్రార్ కోర్టు ముందు లిస్ట్ కావాల్సిన కేసు ఇక్కడికెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణలో విచారణ జరుగుతున్న ఓటుకు నోటు కేసును మధ్యప్రదేశ్ హైకోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ భారాస నేత, మాజీ మంత్రి జగదీశ్రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై విచారణను జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ సతీష్చంద్ర శర్మ, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం జులైకి వాయిదా వేసింది. -
ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నిక రద్దు
భారాస ఎమ్మెల్సీ దండే విఠల్ ఎన్నికను రద్దు చేస్తూ శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆయన ఎన్నికైనట్లు 2021 డిసెంబరు 14న జారీ చేసిన ప్రకటన, 15న ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ చెల్లవని పేర్కొంది. -
దోస్త్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలోని డిగ్రీ కళాశాలల్లో ఆన్లైన్లో 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైంది. -
‘టానిక్’కు మినహాయింపుల్లోనే మతలబు!
రాష్ట్రంలో ఎలైట్ వైన్షాప్ ‘టానిక్’ ఏర్పాటు సమయంలో ఇచ్చిన వెసులుబాట్లలోనే మతలబు ఉన్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ నిర్ధారణకు వచ్చింది.
తాజా వార్తలు (Latest News)
-
అన్న వచ్చాడు.. బ్యాంకులో పింఛన్లు బంద్!
-
ముందు మీరు రాయ్బరేలీలో గెలవండి.. రాహుల్కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!