ఆహార ధాన్యాల సేకరణపై జాతీయ విధానం తీసుకురావాలి
ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యం విధించాలని, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం తీసుకురావాలని తెరాస ఎంపీలు నినదించారు. ధాన్యం కొనుగోళ్లకు ఒకే దేశం- ఒకే విధానం ప్రకటించాలని కోరారు. ఏడాదికి ఎంత
పార్లమెంట్ లోపల, బయట తెరాస ఎంపీల ఆందోళన
ధాన్యం కొనుగోలుపైౖ పార్లమెంట్ సెంట్రల్ హాలులో ప్లకార్డులు ప్రదర్శిస్తున్న తెరాస ఎంపీలు నామా నాగేశ్వరరావు, శ్రీనివాస్రెడ్డి, వెంకటేశ్నేత, బీబీపాటిల్, బండా ప్రకాశ్, సురేశ్రెడ్డి, రాములు, కె.కేశవరావు, రంజిత్రెడ్డి, సంతోష్కుమార్
ఈనాడు, దిల్లీ: ధాన్యం కొనుగోళ్లకు వార్షిక లక్ష్యం విధించాలని, జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం తీసుకురావాలని తెరాస ఎంపీలు నినదించారు. ధాన్యం కొనుగోళ్లకు ఒకే దేశం- ఒకే విధానం ప్రకటించాలని కోరారు. ఏడాదికి ఎంత మొత్తం కొనుగోలు చేస్తామో ఒకసారి ప్రకటిస్తే అందుకు అనుగుణంగా రాష్ట్రాలు తమ వ్యవసాయ ప్రణాళిక రూపొందించుకుంటాయని తెలిపారు. ధాన్యం కొనుగోలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ తెరాస ఎంపీలు ఆకుపచ్చ కండువాలు ధరించి లోక్సభ, రాజ్యసభ, పార్లమెంట్ సెంట్రల్ హాలులో సోమవారం ప్లకార్డులు చేతపట్టి నిరసన తెలిపారు. ఉభయసభల వాయిదా తర్వాత పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద.., తెలంగాణ భవన్లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. అనంతరం ఎంపీలతో కలసి తెరాస పార్లమెంటరీ పార్టీనేత కె.కేశవరావు విలేకరులతో మాట్లాడారు.
కేంద్రం వివక్ష చూపుతోంది
‘‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్రంలో దుర్భర పరిస్థితి నెలకొంది. ఎంత సేకరించాలో చెప్పిన కేంద్రం ఇప్పుడు దానిని ఒప్పందం అంటోంది. తెలంగాణలో వేడి కారణంగా యాసంగి పంటలో బియ్యం విరుగుతాయి. అందుకే ఉప్పుడు బియ్యం వస్తాయి. రైతు బంధు, నీటివసతి, ఉచిత విద్యుత్తు సరఫరా వంటి కార్యక్రమాలతో తెలంగాణలో పంట ఉత్పత్తి బాగా పెరిగింది. ఈ వానాకాలంలో 1.2 కోట్ల టన్నుల ధాన్యం పండింది. ప్రతి గింజను కేంద్రమే కొనుగోలు చేయాలి. తెలంగాణ నుంచి ధాన్యం కొనని కేంద్రం.. పంజాబ్నుంచి కొనుగోలు చేస్తూ తెలంగాణ పట్ల వివక్ష చూపుతోంది. పంట మార్పిడికి కనీసం రెండేళ్ల సమయం అవసరం’’ అని కేకే అన్నారు.
చర్చకు నిరాకరించడంతోనే ఆందోళన: నామా
‘‘ధాన్యం కొనుగోళ్లపై ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని సభాపతి తిరస్కరించారు. మూడు సాగుచట్టాల రద్దు బిల్లుపై చర్చకు అవకాశమిస్తే ఈ సమస్యను లేవనెత్తుదామని భావించినా అదీ చేయలేదు. అందుకే ఆందోళన చేశాం. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్, మంత్రులు, ఎంపీలు కేంద్రంతో చర్చలు జరుపుతుంటే పట్టించుకోవడం లేదు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత తేవాలి. తెలంగాణ ఎంపీలంతా ఉభయ సభల్లో కలిసి పోరాడాలి. సభలో ఆందోళనకు కలసి రాకుంటే రానున్న కాలంలో మిమ్మల్ని నమ్మే పరిస్థితి ఉండదు’’ అని కాంగ్రెస్, భాజపా ఎంపీలనుద్దేశించి వ్యాఖ్యానించారు. కార్యక్రమాల్లో లోక్సభ సభ్యులు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, శ్రీనివాస్రెడ్డి, రాములు, బి.బి.పాటిల్, రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్, సురేశ్రెడ్డి, జోగినపల్లి సంతోష్కుమార్ పాల్గొన్నారు.
సంజయ్ మెడలో కండువా వేసిన తెరాస ఎంపీ
ఉభయ సభల్లో, వెలుపల తెరాస ఎంపీలు ‘రైతులను శిక్షించొద్దు’ ‘రాష్ట్రాల మధ్య వివక్ష చూపొద్దు’, ‘జాతీయ ఆహారధాన్యాల సేకరణ విధానం ప్రకటించాలి’, ‘సేకరణలో ఏకరూపత పాటించాలి’ తదితర ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ సమయంలో భాజపా ఎంపీలు బండి సంజయ్, సోయం బాపురావు తెరాస ఎంపీల వద్దకు వచ్చి గతంలో కేసీఆర్.. కేంద్రానికి అనుకూలంగా మాట్లాడిన అంశాలపై పత్రాలను ప్రదర్శించారు. వెంటనే స్పందించిన నామా నాగేశ్వరరావు.. సంజయ్ మెడలో ఆకుపచ్చ కండువా వేసి రైతుల పక్షాన మాట్లాడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?