రెగ్యులర్ ఊసే లేదు.. పార్ట్టైమ్కు అనుమతివ్వదు
విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ఆచార్యుల నియామకాల ఊసే లేదు...కనీసం పార్ట్టైమ్ అధ్యాపకులను నియమించుకోవడానికి అనుమతి అడిగినా సర్కారు మీనమీషాలు లెక్కిస్తోంది. విశ్వవిద్యాలయాల పాలకమండలి సమావేశంలో ఆమోదం
వర్సిటీల్లో అధ్యాపకుల నియామకాలపై ప్రభుత్వ వైఖరి ఇదీ
సర్కారు ధోరణిపై అసంతృప్తిలో వీసీలు
పాఠాలు ఎవరు బోధిస్తారంటూ నిలదీస్తున్న విద్యార్థులు
కొన్ని విశ్వవిద్యాలయాల్లో కోర్సులు ఎత్తేయాల్సిన పరిస్థితి
విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ ఆచార్యుల నియామకాల ఊసే లేదు...కనీసం పార్ట్టైమ్ అధ్యాపకులను నియమించుకోవడానికి అనుమతి అడిగినా సర్కారు మీనమీషాలు లెక్కిస్తోంది. విశ్వవిద్యాలయాల పాలకమండలి సమావేశంలో ఆమోదం తీసుకున్న తర్వాతా విద్యాశాఖ నాన్చుతుండటంతో కొందరు వీసీల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఫలితంగా విద్యార్థులు తమకు పాఠాలు చెప్పేవారెవరని వర్సిటీ అధికారులను ప్రశ్నిస్తున్నారు. ఈక్రమంలో ఇప్పటికే అనుమతి కోసం పంపిన వర్సిటీ అధికారులు విద్యాశాఖ ఎప్పుడు అనుమతి ఇస్తుందా అని ఎదురుచూస్తుంటే...మరికొందరు పంపించినా అనుమతి వస్తుందో? లేదో? అన్న సంశయంలో కొట్టుమిట్టాడుతున్నారు.
రెండు నెలలవుతున్నా..
విశ్వవిద్యాలయాల్లో మూడు రకాల బోధనా సిబ్బంది పనిచేస్తున్నారు. వారు రెగ్యులర్, కాంట్రాక్టు, పార్ట్టైమ్ అధ్యాపకులు. విద్యార్థులకు పాఠాలు చెప్పే వారిలో 90 శాతం కాంట్రాక్టు, పార్ట్ టైమ్ అధ్యాపకులే. వారు లేకుంటే కొన్ని కోర్సులు నడిపే పరిస్థితి లేదు. పాలమూరు విశ్వవిద్యాలయం సెప్టెంబరు మధ్యలో 41 మంది అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ జారీ చేసింది. నియామకాల చివరి దశలో తమ నుంచి ముందస్తు అనుమతి లేకుండా ఏ ఒక్క నియామకం జరపరాదని విద్యాశాఖ కార్యదర్శి సుల్తానియా సెప్టెంబరు నెలాఖరులో అన్ని వర్సిటీలకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆ వర్సిటీలో నియామకాలు నిలిచిపోయాయి. వాస్తవానికి అక్కడి అధికారులు వర్సిటీ పాలకమండలి ఆమోదం తీసుకున్నా విద్యాశాఖ ఆదేశాల నేపథ్యంలో అనుమతి కోసం దస్త్రాన్ని పంపారు. దాదాపు రెండు నెలలవుతున్నా ఇప్పటికీ అనుమతి దక్కలేదు. వచ్చే కొత్త విద్యా సంవత్సరానికే కాకుండా ఇప్పటికే నడుస్తున్న సెమిస్టర్లో కూడా అధ్యాపకులు అవసరమని ఆ వర్సిటీ అధికారులు చెబుతున్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో కూడా పార్ట్టైమ్ అధ్యాపకులు దాదాపు 18 మంది వరకు అవసరమని తెలిసింది. నియామక అనుమతికి ఎన్నాళ్లు పడుతుందోనన్న అనుమానం వర్సిటీ అధికారుల్లో నెలకొంది. వాటికి అనుమతి రాకుంటే కొన్ని కోర్సులు ఎత్తేయక తప్పదని సమాచారం. ‘కొన్ని సార్లు అత్యవసరంగా నియమించుకోవాల్సి ఉంటుంది... ప్రభుత్వ అనుమతి అంటే ఆలస్యమై విద్యార్థులు నష్టపోతారు’ అని వీసీ ఒకరు వ్యాఖ్యానించారు. ‘పనిభారం ఆధారంగానే తాత్కాలికంగా నియమించుకుంటున్నాం.. ఒక వర్సిటీలో అవకతవకలు జరిగాయని అన్ని వర్సిటీలకు కలిపి ఆదేశాలు ఇవ్వడం సమంజసం కాదు’ అని మరో ఉపకులపతి అసంతృప్తి వ్యక్తం చేశారు. అనుమతి తప్పనిసరి కాకుండా...స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుండేదని వర్సిటీ రిజిస్ట్రార్ ఒకరు అభిప్రాయపడ్డారు.
ఆర్థికశాఖ అనుమతీ తప్పదా?
పార్ట్ టైమ్ అధ్యాపక పోస్టుల భర్తీకి విద్యాశాఖ అనుమతి ఇవ్వాలంటే... ఆర్థికశాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలిసింది. అనుమతి లేకుండా ఏ ఒక్క పోస్టు కూడా భర్తీ చేయరాదని ఆర్థిక శాఖ కొద్ది నెలల క్రితమే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వాలంటే ఇప్పట్లో కష్టమేనని భావిస్తున్నారు. ఇదే సమస్యపై కొంత మంది ఉపకులపతులు మంగళవారం ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి వద్ద ప్రస్తావించినట్లు తెలిసింది.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?