వద్దు నిర్లక్ష్యం
కొవిడ్ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే..
3-5 రోజులైనా తీవ్రత తగ్గకపోతే ఆసుపత్రిలో చేరక తప్పదు
స్వల్ప లక్షణాలుంటే మాత్రం ఇంటి వద్దే చికిత్స
10 రోజుల్లోపే రెమ్డెసివిర్ అందజేస్తే మెరుగైన ఫలితం
కరోనా చికిత్సపై ఐసీఎంఆర్- ఎయిమ్స్ మార్గదర్శకాలు
ఈనాడు, హైదరాబాద్: కొవిడ్ మూడోదశ ఉద్ధృతి క్రమేణా పెరిగిపోతోంది. రాష్ట్రంలో రోజుకు దాదాపుగా 3000-3500 వరకూ కొత్త కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం 24 వేల మందికి పైగా కరోనాతో చికిత్స పొందుతున్నారు. ఈనెల 1 నుంచి 12 వరకూ గణాంకాలను పరిశీలిస్తే.. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరికలు 3 శాతం పెరిగాయి. తొలుత స్వల్ప లక్షణాలతో మొదలైనా.. కొందరిలో 5-6 రోజుల్లో లక్షణాలు తీవ్రమవుతున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రుల్లో చేరాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో చికిత్సపై ప్రజలకు అవగాహన అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. లక్షణాల తీవ్రతను ఎలా గుర్తించాలి? ఎప్పుడు ఆసుపత్రిలో చేరాలి? ఎవరు అత్యంత అప్రమత్తంగా ఉండాలి? తదితర మార్గదర్శకాలను ఐసీఎంఆర్-దిల్లీ ఎయిమ్స్లు సంయుక్తంగా విడుదల చేశాయి.
కొవిడ్పై నిర్లక్ష్యం తగదు
కొవిడ్ను ఐసీఎంఆర్ మూడు దశలుగా విభజించింది. స్వల లక్షణాలతో కూడిన వ్యాధి.. మధ్యస్థ వ్యాధి.. తీవ్ర వ్యాధిగా పరిగణించి.. జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వీటిని పాటించడం ద్వారా కొవిడ్ ముప్పు నుంచి తప్పించుకోవడానికి అవకాశాలు మెరుగవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.
స్వల్ప వ్యాధి
లక్షణాలు: జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి
చికిత్స: ఇంట్లోనే ఉండి చికిత్స పొందాలి. తేలికపాటి దగ్గు, జ్వరం ఐదు రోజులకు మించి వస్తుంటే.. వైద్యుడి సలహా మేరకు ఔషధాలను వాడాలి.
జాగ్రత్తలు
* భౌతిక దూరం పాటించాలి.
* ఇంట్లోనూ మాస్కు ధరించాలి.
* నీళ్లు తగినంతగా తాగాలి.
* రోజుకు 3సార్లు శరీర ఉష్ణోగ్రత, ఆక్సిజన్ పరీక్షించుకోవాలి.
ఎప్పుడు అత్యవసరం?
* శ్వాస పీల్చుకోవడం కష్టమైనప్పుడు
* ఆక్సిజన్ శాతం 93 కంటే తగ్గినప్పుడు
* జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు
* 5 రోజులు గడిచినా లక్షణాలు తగ్గకపోతే
* దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారైతే 3 రోజుల కంటే ఎక్కువగా లక్షణాలు కనిపిస్తున్నప్పుడు
ఎవరికి ఎక్కువ ముప్పు?
60 ఏళ్లు దాటినవారు, మధుమేహులు, ఊబకాయులు, గుండె రక్తనాళాల జబ్బు, అధిక రక్తపోటు హెచ్ఐవీ, క్షయ, ఊపిరితిత్తులు, కిడ్నీ, కాలేయ జబ్బులు, మెదడు, రక్తనాళాల జబ్బులతో చికిత్స పొందుతున్నవారు
మధ్యస్థ వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 24 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ 90-93 శాతం మధ్యలో ఉండడం.
చికిత్స: * ఈ తరహా లక్షణాలున్నవారికి ఆసుపత్రిలో చికిత్స అందించాలి.
* రక్తంలో ఆక్సిజన్ శాతం కనీసం 92-96 మధ్యలో ఉండేలా చూసుకోవాలి.
* కృత్రిమ ప్రాణవాయువును అందించాలి.
* స్టెరాయిడ్ చికిత్సను ఆసుపత్రిలోనే ప్రారంభించి, అక్కడే ముగించాలి. ఇంటికెళ్లాక కూడా స్టెరాయిడ్ వాడే విధానానికి స్వస్తి పలకాలి.
* దీర్ఘకాలం, అవసరానికి మించి స్టెరాయిడ్ చికిత్సను వినియోగించడం వల్ల మ్యూకర్ మైకోసిస్ తదితర జబ్బుల బారినపడే ప్రమాదముంది.
జాగ్రత్తలు
* శ్వాస తీరు ఎలా ఉందో పరీక్షిస్తూ ఉండాలి.
* ఆరోగ్య పరిస్థితి క్రమేణా క్షీణిస్తుంటేనే.. ఛాతీ ఎక్స్రే, సీటీ స్కాన్ వంటి పరీక్షలు చేయించాలి.
* 2-3 రోజులకోసారి సీఆర్పీ, డీ డైమర్, షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
తీవ్ర వ్యాధి
లక్షణాలు: నిమిషానికి 30 సార్ల కంటే అధికంగా శ్వాస పీల్చుకోవడం, తీవ్ర ఆయాసం, రక్తంలో ఆక్సిజన్ శాతం 90 కంటే తగ్గిపోవడం.
చికిత్స: * ఐసీయూలో చేర్పించి చికిత్స అందించాలి.
* పరికరాల ద్వారా ప్రాణవాయువును ఇవ్వాలి.
* వైద్యుడి సూచనల మేరకు స్టెరాయిడ్ ఔషధాలను, యాంటీ ఇన్ఫ్లమేటరీ చికిత్సను అందించాలి.
జాగ్రత్తలు
* నిర్ధారణ పరీక్షలను రోజూ చేయించనక్కర్లేదు. 2-3 రోజులకొకసారి సీఆర్పీ, డీ డైమర్, షుగర్, సీబీసీ, కిడ్నీ, కాలేయ పనితీరు పరీక్షలు చేయిస్తుండాలి.
* దగ్గు 2-3 వారాల కంటే ఎక్కువగా వేధిస్తుంటే.. క్షయ ఇతర వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేయించడం ముఖ్యం.
రెమ్డెసివిర్ ఎప్పుడు?
లక్షణాలు కనిపించిన 10 రోజుల్లోపు రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇవ్వాలి. ఇది మధ్యస్థ నుంచి తీవ్ర లక్షణాలున్న వారికి, ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందుతున్న వారికే ఇవ్వాలి. ఇంటి వద్ద చికిత్స పొందుతున్న వారికి, ప్రాణవాయువు అవసరం లేని వారికి ఇది ఇవ్వనక్కర్లే ేదు. వెంటిలేటర్ సాయంతో చికిత్స పొందుతున్న వారికి రెమ్డెసివిర్ ఇవ్వకూడదు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ ఇచ్చినప్పుడు కిడ్నీ, లివర్ పరీక్షలు చేయించాలి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి