ప్రణాళిక ఉంటే ప్రకృతిపైనా విజయం
వాతావరణ మార్పులతో కరవు పరిస్థి తులేర్పడినా రైతులకు శిక్షణ ఇచ్చి తగిన పంటలను సాగుచేయిస్తే వారి ఆదాయం 35 శాతం పెరిగిందని జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. వాతావరణ మార్పులకు
శాస్త్రవేత్తల సూచనలతో పెరిగిన కరవు రైతుల ఆదాయం
వెల్లడించిన జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ
వాతావరణ మార్పులతో కరవు పరిస్థి తులేర్పడినా రైతులకు శిక్షణ ఇచ్చి తగిన పంటలను సాగుచేయిస్తే వారి ఆదాయం 35 శాతం పెరిగిందని జాతీయ మెట్ట పంటల పరిశోధన సంస్థ (క్రిడా) శాస్త్రవేత్తల బృందం పేర్కొంది. వాతావరణ మార్పులకు అనుగుణంగా గతంలో కొన్ని ప్రాంతాల్లో కరవు ఏర్పడినప్పుడు పంటల సాగులో తమ ఆదాయం 54, పాడిపై 40 శాతం ఆదాయం తగ్గినట్లు ఆ రైతులు చెప్పారని వివరించింది. తమ సంస్థకు చెందిన పలువురు శాస్త్రవేత్తలు కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకుని వాతావరణ మార్పులు, కరవును అధిగమించేలా పంటల సాగు, పాడిపశువుల పెంపకంలో చేపట్టిన మార్పులతో ఆదాయం పడిపోకుండా చూడవచ్చని నిరూపించారని వివరించింది. వీరు నిర్వహించిన అధ్యయనంపై వెలువరించిన పరిశోధన పత్రంలోని ముఖ్యాంశాలు...
* రాజస్థాన్, గుజరాత్లోని కొన్ని పల్లెలతో పాటు తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలం నంద్యాలగూడెం, బోరింగుతండా, సూర్యాపేట గ్రామీణ మండలం కసరాబాద్ గ్రామాల్లో 2019-20లో పంటల సాగుపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు.
* ఈ గ్రామాలు తీవ్ర వర్షాభావ ప్రాంతాలు. ఇక్కడ ఏడాదికి సగటు వర్షపాతం 750-850 మిల్లీమీటర్లు. అధ్యయనానికి ఎంచుకున్న మొత్తం 750 ఎకరాల పంటభూముల్లో 80 శాతం వర్షాధారంగా సాగయ్యేది.
* ఒక్కో గ్రామం నుంచి 60 రైతు కుటుంబాలను శాస్త్రవేత్తలు సమగ్రంగా పరిశీలించారు. వారికున్న భూమి, వయసు, విద్య, పంటల సాగుతీరు, ఆదాయం, పాడి పశువుల వివరాలన్నీ నమోదు చేశారు. వాతావరణ మార్పుల వల్ల వారి ఆదాయంపై ఎంత ప్రభావం పడుతుందో శాస్త్రీయంగా విశ్లేషించారు.
* ఈ గ్రామాల్లో 80 శాతానికి పైగా ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. రైతులు ఎక్కువగా 44-46 ఏళ్ల మధ్యవయస్కులు. వారిలో 50 శాతం మంది అక్షరాస్యులు. ఈ కుటుంబాలకున్న సగటు కమత విస్తీర్ణం 2.27 హెక్టార్లు. వీరిలో సగానికి పైగా 2 హెక్టార్లలోపు భూమి కలిగిన చిన్నకారు రైతులు. ఈ కుటుంబాల్లో ఎస్సీలు 17, ఎస్టీలు 7, బీసీలు 75 శాతమున్నారు.
* ఒక రైతు కుటుంబానికి సాధారణ వాతావరణ పరిస్థితుల్లో సాగు, పాడి, ఇతర పనులతో ఏడాదికి రూ.2,36,196 ఆదాయం రాగా కరవు ఏడాదిలో అది రూ.1,70,153కి పడిపోయినట్లు తేలింది. పెద్ద కమతం ఉన్న రైతుల ఆదాయంలో 1.70 శాతమే తగ్గుదల కనిపించగా, చిన్న, సన్నకారు రైతుల ఆదాయం గరిష్ఠంగా 50.70 శాతం వరకూ పడిపోయింది.
* అత్యధికంగా మిరప పంటలో 44.35 శాతం, మొక్కజొన్నలో 41.67, మల్బరీలో 32.32, కందిలో 34.70, పత్తిలో 30.41, వరిలో 28.81 శాతం పంట దిగుబడి తగ్గింది.
* ఈ కాలంలో రైతులకు ఉపాధి దొరికే రోజుల సంఖ్య 29 శాతం తగ్గింది. కానీ వ్యవసాయేత పనులకు, సాగునీటి వసతి ఉన్న ఇతర గ్రామాలకు కూలీలుగా రైతులు వెళ్లడం వల్ల ఉపాధి ఎక్కువగా దొరికింది.
* కరవు రోజుల్లో వ్యవసాయంపై తమ ఆదాయం తగ్గిపోయినట్లు 48 శాతం రైతు కుటుంబాలు తెలిపాయి. పశుగ్రాసమూ దొరకడం లేదన్నారు.
శిక్షణతో మార్పు
* శిక్షణ ఇవ్వడంతో రైతులు విభిన్న రకాల పంటలను సాగుచేశారు. వానాకాలంలో వరి, పత్తి, కంది వేశారు. యాసంగిలో మిరప, మొక్కజొన్న మల్బరీ, కూరగాయలు వంటివి సాగుచేయడమే కాకుండా పాడిపశువుల పెంపకం చేపట్టారు. వీటితో ఈ కుటుంబాల వార్షిక సగటు ఆదాయం రూ.2,14,327 వచ్చింది. అంతకు ముందు కరవు రోజుల్లో ఈ ఆదాయం రూ.1.70 లక్షలు.
* రైతులకున్న తక్కువ భూమిలోనే విభిన్న రకాల పంటల సాగు వల్ల వారి ఆదాయం పెరిగింది. పంటల సాగు, పాడి పశువుల పెంపకమే కాకుండా రైతు కుటుంబ సభ్యులు టైలరింగ్, చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఇతర పొలాల్లో కూలి పనులకు సైతం వెళుతూ వేతనాలు పొందారు.
* వాతావరణంలో తరచూ వస్తున్న మార్పులను ఎదుర్కొనేందుకు ప్రణాళికబద్ధంగా సిద్ధం కావాలి. కరవు ఏర్పడుతుందనే ముందస్తు అంచనాలివ్వడం, సకాలంలో దాన్ని అధిగమించి ప్రత్యామ్నాయ పంటల సాగుకు సాయపడటం, విపత్తు నిర్వహణ ప్రణాళిక, సామూహికంగా అందరినీ సిద్ధం చేయడం వంటివి అవసరం అని పరిశోధన పత్రంలో తెలిపారు.
- ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి