ప్రమాదంలో రాజ్యాంగం.. ప్రజాస్వామ్యం
‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది.
ప్రజలను ఏకం చేసి వాటిని కాపాడుకోవాలి
ప్రొఫెసర్ యోగేందర్ యాదవ్
బషీర్బాగ్, న్యూస్టుడే: ‘భారతదేశంలో రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, గణతంత్రం ప్రమాదంలో ఉన్నాయి. ఈ వ్యవస్థలపై దాడి జరుగుతోంది. వీటిపై మాట్లాడలేని దుస్థితి నెలకొంది. దేశంలో అసమానతలున్నాయి. వనరులను సమానంగా పంపిణీ చేయాలంటే అది తప్పయిపోయింది. కులగణన ద్వారా న్యాయం చేయాలని అడగటం నేరమైపోయింది. రాజ్యాంగాన్ని, గణతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కుప్పకూలుస్తుంటే దేశ పౌరులు క్రికెట్ మ్యాచ్ మాదిరిగా వీక్షిస్తూ మౌనం వహిస్తున్నారు. ఈ వైఖరిని విడనాడాలి. వ్యవస్థలపై దాడులను తిప్పికొడుతూ ప్రజలను ఏకం చేసి దేశాన్ని కాపాడుకోవాలి’ అని భారత్ జోడో అభియాన్ జాతీయ కన్వీనర్ ప్రొఫెసర్ యోగేందర్ యాదవ్ కోరారు. దేశాన్ని విభజించే కుట్రలను అడ్డుకోవాలన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్స్ ఆధ్వర్యంలో శనివారం ఓయూలోని ఆర్ట్స్ కళాశాలలో ‘ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న సవాళ్లు- రాజ్యాంగ విలువలు- పౌరులు, పౌర సంస్థల పాత్ర’ అనే అంశంపై శనివారం చర్చాగోష్ఠి నిర్వహించారు.
దీనికి ముఖ్య అతిథిగా హాజరైన యోగేందర్ యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో 70 శాతం సంపద 52 మంది వద్దే ఉందని, దీన్ని సమానంగా పంపిణీ చేయాలని అడిగితే తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. లౌకికవాదం సంక్షోభంలో ఉందన్నారు. దేశ పునాదులను నాశనం చేస్తూ.. రెండు వర్గాల మధ్య ఘర్షణలు సృష్టిస్తూ ఓట్లడగడం తగదన్నారు. ‘నోటి మాట’ ప్రధాన ఆయుధంగా ప్రజలను చైౖతన్యవంతులను చేయాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు. దేశంలో మార్పు ఆవశ్యకత గురించి సమాధానమిస్తూ.. ‘పాలకులు మొదటిసారి గెలిచినపుడు జాగ్రత్తగా ఉంటారు. రెండోసారి అవినీతికి పాల్పడతారు. మూడోసారి గెలిస్తే ప్రజల నెత్తిపై కూర్చుని గూండాయిజం, రౌడీయిజం చేస్తారు’ అని అన్నారు. ప్రొఫెసర్ ఆమంచి నాగేశ్వర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో దిల్లీ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్ సుకుమార్, డాక్టర్ సమున్నత, భారత్ జోడో అభియాన్ రాష్ట్ర కన్వీనర్ విస్సా కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటుకు బయలెల్లిన నగరం
ఓటు హక్కు వినియోగించుకునేందుకు హైదరాబాద్ నుంచి తెలంగాణ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్కు శనివారం భారీగా ప్రజలు సొంతూరి బాట పట్టారు. -
కార్టూనిస్ట్ శ్రీధర్ ఆధ్వర్యంలో పెయింటింగ్ వర్క్షాప్ 19న
ఔత్సాహిక చిత్రకారుల కోసం ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహిస్తున్నట్టు శ్రీధర్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ నిర్వాహకులు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్ తెలిపారు. -
ఎన్నికలకు పటిష్ఠ బందోబస్తు
ఎన్నికలను సజావుగా.. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా నిర్వహించేందుకు పటిష్ఠ భద్రత ఏర్పాటు చేసినట్లు డీజీపీ రవిగుప్తా తెలిపారు. -
ప్రచారం పరిసమాప్తం
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచార హోరు ముగిసిపోయింది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో దశలో ఈ నెల 13వ తేదీన రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం మార్చి 16వ తేదీన షెడ్యూలు ప్రకటించింది. -
ఎప్సెట్ ఇంజినీరింగ్కు 2.4 లక్షల మంది హాజరు
ఎప్సెట్ ఇంజినీరింగ్ విభాగం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య ఈసారి భారీగా పెరిగింది. ఈసారి మొత్తం 2,54,750 మంది దరఖాస్తు చేయగా...వారిలో 2,40,617 మంది హాజరయ్యారు. -
ప్రాజెక్టు నిర్మాణ స్థలం ఎందుకు మార్చాల్సి వచ్చింది?
కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణ స్థలాన్ని ఎందుకు మార్చాల్సి వచ్చిందంటూ కాళేశ్వరం మాజీ ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లును జ్యుడిషియల్ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. -
మార్గదర్శి నగదు, చెక్కులు సక్రమమే
విశాఖపట్నంలో మార్గదర్శి చిట్ఫండ్స్ సంస్థకు చెందిన సీతంపేట బ్రాంచ్ సిబ్బంది బ్యాంకులో డిపాజిట్ చేయడానికి తీసుకెళ్తుండగా స్వాధీనం చేసుకున్న నగదు, చెక్కుల్ని జిల్లా యంత్రాంగం తిరిగి అప్పగించింది. -
దేశ ప్రగతికి మోదీ అవసరం
దేశ ప్రగతి కోసం మరోసారి ప్రధాని మోదీ పగ్గాలు చేపట్టాల్సిన అవసరం ఉందని భాజపా మాజీ ఎంపీ డాక్టర్ వినయ్ సహస్రబుద్ధే అన్నారు. -
ఎనలేనిది.. అమ్మ త్యాగం..
అమ్మను మించిన దైవం లేదు.. అమ్మంటే ప్రేమ.. అమ్మంటే త్యాగం.. అమ్మంటే సేవ.. అమ్మంటే సహనం.. ఇన్ని గుణాలు మూర్తీభవించిన మాతృమూర్తికి ఈ లోకంలో ఇంకెవరూ సాటిరారు. -
‘చేనేత సంఘాల్లో 30 శాతానికి పైగా బోగస్’
గత ప్రభుత్వ హయాంలో టెస్కో నుంచి వివిధ శాఖలకు వస్త్రాల రవాణా కోసం జరిగిన చెల్లింపుల్లో రూ.వందల కోట్ల అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణైందని, దీనిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామని రాష్ట్ర చేనేతశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. -
తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛను చెల్లించాల్సిందే..
ఏపీ విభజన తరువాత పదవీ విరమణ చేసిన తెలుగు అకాడమీ ఉద్యోగులకు పింఛనుతోపాటు పదవీ విరమణ ప్రయోజనాలను అందించాల్సిందేనని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. -
న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు: సీఎం
రాష్ట్రంలోని న్యాయవాదుల సంక్షేమానికి రూ.100 కోట్లు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి హామీ ఇచ్చారు. న్యాయవాదుల ఆరోగ్య బీమా నిమిత్తం త్వరలోనే నిధులు విడుదల చేస్తామన్నారు. -
‘ఎన్నికల్లో పౌరుల బాధ్యతల్ని వివరించాం’
భాజపాను ఓడించాలని ‘జాగో తెలంగాణ, తెలంగాణ రాష్ట్ర ప్రజాస్వామిక వేదిక’ సంయుక్తంగా చేపట్టిన బస్సు యాత్ర ముగిసింది. ఈనెల 1న ప్రారంభమైన యాత్ర 11 రోజుల తర్వాత శనివారం హైదరాబాద్ చేరుకుంది. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి: బీఎంఎస్
రాష్ట్రంలో ఈ నెల 13న జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచేందుకు పరిశ్రమల్లో పనిచేస్తున్న శాశ్వత, ఒప్పంద కార్మికులకు వేతనంతో కూడిన పూర్తిసెలవు ఇవ్వాలని భారతీయ మజ్దూర్ సంఘ్ (బీఎంఎస్) డిమాండ్ చేసింది. -
వేసవిలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా
వేసవిలో కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఇంజినీర్లకు, సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ(జేఏసీ) అభినందనలు తెలిపింది.