UGC Chairman: అత్యున్నత విద్యా పీఠంపై తెలుగు బిడ్డ
దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత పదవి మరోసారి తెలుగు వ్యక్తికి దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన ఛైర్మన్గా జేఎన్యూ ఉపకులపతి ఆచార్య మామిడాల జగదీశ్కుమార్
యూజీసీ ఛైర్మన్గా జగదీశ్కుమార్
ఈనాడు, హైదరాబాద్, నల్గొండ: దేశంలో ఉన్నత విద్యకు సంబంధించి అత్యున్నత పదవి మరోసారి తెలుగు వ్యక్తికి దక్కింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నూతన ఛైర్మన్గా జేఎన్యూ ఉపకులపతి ఆచార్య మామిడాల జగదీశ్కుమార్ నియమితులయ్యారు. ఆయన ఈ పదవిలో అయిదు సంవత్సరాలు కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్(న్యాక్) ఎగ్జిక్యూటివ్ కమిటీ ఛైర్మన్గా వ్యవహరిస్తున్నారు. 1961లో ఏపీలోని తెనాలికి చెందిన వాసిరెడ్డి శ్రీకృష్ణ( వీఎస్ కృష్ణ), 1991-95 వరకు కరీంనగర్ జిల్లాకు చెందిన జి.రామిరెడ్డి యూజీసీ ఛైర్మన్లుగా పనిచేశారు. ఈ పదవిని పొందిన మూడో తెలుగు వ్యక్తి జగదీశ్కుమార్. తెలంగాణలోని నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామానికి చెందిన ఆయన ఒకటి నుంచి ఆరో తరగతి వరకు స్వగ్రామంలో.. ఆ తర్వాత మిర్యాలగూడలో చదువుకున్నారు. హైదరాబాద్లోని వివేకవర్ధిని కళాశాలలో బీఎస్సీ, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి పీజీ పూర్తి చేశారు. ఉన్నత విద్యను కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ వాటర్లూలో పూర్తి చేసిన అనంతరం ఖరగ్పుర్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఆచార్యుడిగా చేరారు. అక్కడి నుంచి దిల్లీ ఐఐటీకి బదిలీ అయ్యారు. అనంతరం జేఎన్యూలో ఆచార్యుడిగా పనిచేస్తూనే 2016లో ఉపకులపతి అయ్యారు. అయిదేళ్ల పదవీకాలం జనవరి 26తో ముగియగా... కొత్త వీసీ వచ్చే వరకు తాత్కాలికంగా కొనసాగుతున్నారు. యూజీసీ ఛైర్మన్ పదవికి నోటిఫికేషన్ జారీ కాగా మొత్తం 55 మంది వరకు పోటీపడ్డారు. చివరకు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను ఎంపిక చేసింది. జేఎన్యూ వీసీగా ఉంటూనే 2016 జూన్ 24 నుంచి 2019 జూన్ 23 వరకు యూజీసీ సభ్యుడిగా ఉన్నారు. ఆ సమయంలో 2017 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 2 వరకు యూజీసీ ఇన్ఛార్జి ఛైర్మన్గా కూడా వ్యవహరించారు. జగదీశ్కుమార్ మూడు పుస్తకాలు రచించారు. మొత్తం దాదాపు 250 పరిశోధన పత్రాలను ప్రచురించారు. ఆయన తండ్రి రంగారావు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ పొందారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓఎంఆర్ పద్ధతిలో గ్రూప్-1 ప్రిలిమ్స్
రాష్ట్రంలో 563 గ్రూప్-1 సర్వీసు ఉద్యోగాల భర్తీ కోసం జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష ఓఎంఆర్ (ఆప్టికల్ మార్క్ రికగ్నిషన్) పద్ధతిలో నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్ నికోలస్ తెలిపారు. -
జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ నివేదిక అమలు నిలిపివేత
రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండలం చటాన్పల్లి గ్రామ శివార్లలో 2019 డిసెంబరు 6న జరిగిన దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చిన నివేదిక అమలును నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. -
మండుటెండలు మరింతగా..
ప్రచండ భానుడి కిరణాలతో రాష్ట్రం ఉడికిపోతోంది. ఏరోజుకారోజు గత పదేళ్లలో ఎప్పుడూ నమోదుకానంత స్థాయిలో ఎండలు కాస్తూ కొత్త రికార్డులు నెలకొంటున్నాయి. -
రైతులకు 1.87 లక్షల క్వింటాళ్ల పచ్చిరొట్ట విత్తనాలు
రాష్ట్రంలో వానాకాలం సీజన్లో పచ్చిరొట్ట విత్తనాలైన జీలుగ, జనుము, పిల్లిపెసర 1,87,011 క్వింటాళ్ల మేర పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
సామాజిక చింతన లేని ప్రయత్నం వ్యర్థం: బుర్రా వెంకటేశం
సామాజిక చింతన లేని ఏ ప్రయత్నమైనా వ్యర్థమని తెలంగాణ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అన్నారు. -
సీఎంను దూషించారన్న కేసులో సీఆర్పీసీ 41ఏ అమలు చేయండి: హైకోర్టు
సీఎం రేవంత్రెడ్డిపై శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి చేసిన వ్యాఖ్యలు శాంతిభద్రతలకు భంగం వాటిల్లేలా ఉన్నాయంటూ నమోదైన కేసులో ‘సీఆర్పీసీ సెక్షన్ 41ఏ’ని అమలు చేయాలంటూ పోలీసులకు బుధవారం హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, రాజేశ్వర్రెడ్డిలకు హైకోర్టు నోటీసులు
భారాసకు చెందిన మేడ్చల్, జనగామ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చామకూర మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్రెడ్డిలకు ఇటీవల హైకోర్టు నోటీసులు జారీ చేసింది. -
కార్మికులకు సీఎం మే డే శుభాకాంక్షలు
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ‘మే’ డేని పురస్కరించుకొని కార్మిక లోకానికి ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. -
టీఎస్ఐసెట్ దరఖాస్తు గడువు పొడిగింపు
టీఎస్ఐసెట్-2024 దరఖాస్తు గడువును ఈ నెల ఏడో తేదీ వరకు పొడిగించారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దరఖాస్తుల గడువు ఏప్రిల్ 30తో ముగియగా..అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు గడువును పొడిగించినట్లు సెట్ కన్వీనర్ నరసింహాచారి బుధవారం తెలిపారు. -
భారాస నేత చిట్ఫండ్ సంస్థలో ఐటీ సోదాలు
సంగారెడ్డిలో భారాస నాయకుడు, చెరకు అభివృద్ధి మండలి(సీడీసీ) మాజీ అధ్యక్షుడు విజయేందర్రెడ్డి, సంగారెడ్డి పురపాలక సంఘం ఉపాధ్యక్షురాలు లతకు చెందిన శ్రీవరసిద్ధి వినాయక చిట్ఫండ్ సంస్థలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. -
అభివృద్ధి ఒప్పందం వాణిజ్య వివాదమే: హైకోర్టు
నిర్మాణదారు, భూ యజమానుల మధ్య జరిగే అభివృద్ధి ఒప్పందాలు వాణిజ్యపరమైనవేనని, ఈ తరహా వివాదాలు వాణిజ్య కోర్టు పరిధిలోకి వస్తాయని హైకోర్టు తేల్చి చెప్పింది. -
సాంకేతిక సమస్యలతో డబ్బులు అందని వారికి రైతుబంధు..
సాంకేతిక సమస్యల వల్ల రైతుబంధు సాయం అందని వారి ఖాతాలను పరిశీలించి సాయం అందిస్తున్నట్లు వ్యవసాయ సంచాలకుడు గోపి తెలిపారు. -
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాలకు ర్యాంకుల విడుదల
మోడల్ పాఠశాలల్లో ప్రవేశాల కోసం పరీక్ష రాసిన విద్యార్థుల మెరిట్ జాబితాను, ర్యాంకులను విడుదల చేసినట్లు మోడల్ స్కూళ్ల అదనపు సంచాలకుడు రమణ కుమార్ వెల్లడించారు. -
ఇదీ సంగతి!
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?