స్పెయిన్లో పార్శిల్ బాంబుల కలకలం
స్పెయిన్లో పార్శిల్ బాంబులు కలకలం రేకెత్తిస్తున్నాయి. మాద్రీద్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వద్ద ఇలాంటి ఒక బాంబు పేలి ఒక ఉద్యోగికి గాయాలైన మరుసటి రోజే అమెరికా ఎంబసీ వద్ద మరొకటి గుర్తించారు.
అమెరికా ఎంబసీ వద్ద ఒకటి పేల్చివేత
మాద్రీద్: స్పెయిన్లో పార్శిల్ బాంబులు కలకలం రేకెత్తిస్తున్నాయి. మాద్రీద్లోని ఉక్రెయిన్ రాయబార కార్యాలయం వద్ద ఇలాంటి ఒక బాంబు పేలి ఒక ఉద్యోగికి గాయాలైన మరుసటి రోజే అమెరికా ఎంబసీ వద్ద మరొకటి గుర్తించారు. నిపుణులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని, బాంబును వెంటనే పేల్చేశారు. ఉత్తరాల మాదిరిగా కనిపించే వీటిని ‘లెటర్ బాంబు’లుగా పిలుస్తున్నారు. స్పెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖకు, మాద్రీద్ వెలుపల వైమానిక స్థావరంలో ఉన్న ఈయూ అంతరిక్ష కేంద్రానికి, ఈశాన్య స్పెయిన్లో ఆయుధాల తయారీ కర్మాగారానికి కూడా ఇలాంటివి అందాయి. ఈ కేంద్రంలో తయారయ్యే గ్రెనేడ్లను ఉక్రెయిన్కు సరఫరా చేస్తుంటారు. దౌత్య కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల్ని పంపిస్తుండడాన్ని రష్యా ఖండించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిందపడేసి, మోకాలితో అదిమిపెట్టి.. అమెరికాలో పోలీసుల కర్కశత్వం
-
సునీల్ నరైన్కు థ్యాంక్స్.. శశాంక్ ఓ అద్భుతం: బెయిర్స్టో
-
రెచ్చిపోయిన మిలిటెంట్లు.. సీఆర్పీఎఫ్ శిబిరంపై 2 గంటల పాటు కాల్పుల వర్షం
-
పింఛన్ల పంపిణీపై ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు
-
జగనన్న పన్నాగం.. పల్లెలకు పంగనామం..!
-
అన్నమయ్య జిల్లాలో తెదేపా ప్రచార వాహనానికి నిప్పు