Houthi rebels: ఎర్రసముద్రంలో ఏకకాలంలో రెండు నౌకలపై దాడి..
ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఏకకాలంలో హౌతీ తిరుగుబాటుదారులు దాడి చేశారు. దీంతో నౌకల రక్షణకు ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని అమెరికా ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారులు వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులను మరింత తీవ్రం చేశారు. సోమవారం ‘స్వాన్ అట్లాంటిక్’ అనే వాణిజ్య నౌకపైకి యెమెన్లోని తమ ఆధీనంలో ఉన్న భూభాగం నుంచి ఓ డ్రోన్, యాంటీషిప్ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించారు. ఈ విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. సరిగ్గా స్వాన్ అట్లాంటిక్పై దాడి జరిగే సమయంలోనే మరో బల్క్ కార్గో షిప్ ఎం/వి క్లారాకు అత్యంత సమీపంలో భారీ పేలుడు జరిగింది. ఈ రెండు దాడుల్లో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు తమకు సమాచారం లేదని యూఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది.
ఈజిప్టు అధ్యక్షుడిగా ఎల్ సిసి తిరిగి ఎన్నిక
మరోవైపు హౌతీ వర్గాలు మాత్రం ఈ నౌకలకు ఇజ్రాయెల్తో సంబంధాలు ఉండటంతోనే దాడి చేశామని వెల్లడించాయి. తాము చేసే కాల్స్కు నౌకలోని సిబ్బంది స్పందించకపోవడంతో బలప్రయోగానికి దిగినట్లు వెల్లడించాయి. కాగా.. స్వాన్ అట్లాంటిక్ నౌక నార్వేకు చెందినదిగా తెలుస్తోంది.
ఎర్ర సముద్రంపై అమెరికా దృష్టి..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చించేందుకు అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్.. టెల్ అవీవ్లో ఉన్న వేళ ఈ దాడి జరగడం గమనార్హం. దీనిపై ఆస్టిన్ స్పందిస్తూ.. ఎర్ర సముద్రంలో నౌకలపై జరుగుతున్న దాడులపై చర్చించేందుకు పశ్చిమాసియాలోని రక్షణ మంత్రులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. నౌకల రక్షణ కోసం తాము ‘ఆపరేషన్ ప్రాస్పరిటీ గార్డియన్’ను ప్రారంభిస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రకటించారు. ఈ బహుళపక్ష భద్రతా కార్యక్రమంలో వివిధ దేశాలతో సంయుక్త సముద్ర బలగాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దీనికి ఎర్ర సముద్రంలో కార్యకలాపాలు పర్యవేక్షించే ‘టాస్క్ ఫోర్స్ 153’ నాయకత్వం వహిస్తుందని చెప్పారు.
ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న వివిధ దేశాల నౌకలపై జరుగుతున్న క్షిపణి, డ్రోన్ దాడులను ఎదుర్కొనేందుకు.. అంతర్జాతీయ చట్టాల ప్రకారం ప్రాంతీయ శక్తులు సమష్టిగా పోరాడాలని పేర్కొన్నారు. యెమెన్ నుంచి హౌతీ తిరుగుబాటుదారులు నిర్లక్ష్యంగా చేస్తున్న దాడులు వాణిజ్యానికి, నౌకల్లోని అమాయక సిబ్బందికి, అంతర్జాతీయ చట్టాలకు ప్రమాదకరంగా మారాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అమెరికా ప్రారంభించిన కార్యక్రమంలో బ్రిటన్, బహ్రెయిన్, కెనడా, ఫ్రాన్స్, ఇటలీ, నెదర్లాండ్స్, నార్వే, సీషెల్స్, స్పెయిన్ భాగస్వాములు కానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నదిలో పడిన బస్సు.. డ్రైవర్తో ఓవర్ టైమ్ చేయించడమే ప్రమాదానికి కారణం..!
ఓ డ్రైవర్తో ట్రాన్స్పోర్టు సంస్థ ఓవర్ టైమ్ చేయించింది. అలిసిపోయిన డ్రైవర్ వాహనంపై పట్టు కోల్పోయాడు. ఫలితంగా నేరుగా 20 మంది ప్రయాణికులతో అది ఓ నదిలో పడిపోయింది. -
డెంగీ రాకను చెప్పే హిందూ మహాసముద్రం
హిందూ మహాసముద్రంలో ఉపరితల ఉష్ణోగ్రతల్లో అసాధారణ పోకడల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా డెంగీ మహమ్మారి విజృంభణలను ముందే అంచనా వేయవచ్చని తాజా పరిశోధన పేర్కొంది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్!
ఛైనా తన అమ్ములపొదిలోని రాకాసి యుద్ధనౌకకు పదును పెడుతోంది. ప్రపంచంలో అమెరికా మాత్రమే వాడే కొన్ని రకాల టెక్నాలజీలను డ్రాగన్ దీనిలో అమర్చింది. -
రష్యా ప్రధానిగా మిషుస్తిన్ పునర్నియామకం
రష్యా ప్రధానమంత్రిగా మిఖైల్ మిషుస్తిన్ను దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం పునర్నియమించారు. 58 ఏళ్ల మిషుస్తిన్ నాలుగేళ్లుగా ప్రధానిగా ఉన్నారు. -
పొరపాటున మరొక ఇంట్లో కాల్పులు
అమెరికాలోని ఫ్లోరిడాలో పోలీసులు చేసిన తప్పు ఓ వ్యక్తి మరణానికి కారణమైంది. ఓ ఇంట్లో గొడవ జరుగుతోందని సమాచారం అందుకున్న పోలీసులు పొరపాటున మరో నివాసంలోకి వెళ్లి కాల్పులు జరిపారు. -
ప్రేమ, లైంగిక సంబంధం లేని దాంపత్య బంధం
ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్ల నేపథ్యంలో జపాన్ యువతకు జీవిత భాగస్వామిని ఎంచుకోవడం కష్టంగా మారినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీంతో పెళ్లి కల తీరేందుకు ‘ఫ్రెండ్షిప్ మ్యారేజ్’ అనే కొత్త ట్రెండ్ను జపాన్ యువత ఫాలో అవుతున్నట్లు చెబుతున్నాయి. -
భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన అవసరం లేదు
భారత్లో ప్రజాస్వామ్య స్థితిపై కొన్ని వర్గాల్లో తలెత్తుతున్న ఆందోళనలను అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తోసిపుచ్చారు. -
మోదీ పర్యటనపై వ్యాఖ్యలు.. ఇంకోసారి ఆ తప్పు జరగదన్న మాల్దీవులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మరోసారి సంజాయిషీ ఇచ్చుకున్నారు. -
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ఓపెన్ఏఐతో యాపిల్ జట్టు..! ఇక ఐఫోన్లో చాట్జీపీటీ?
-
కడపలో షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ హెడ్ ఆఫీసులో సోదాలు
-
ఆ ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో తెలియదు.. కామెంట్ చేయడం బాగోదు: గంగూలీ
-
ఏపీఎస్ ఆర్టీసీ వెబ్సైట్లో సాంకేతిక సమస్య.. టికెట్లకు ప్రయాణికుల అవస్థలు
-
చెన్నైతో మ్యాచ్.. గిల్ సహా గుజరాత్ టీమ్కు భారీ జరిమానా