Afghanistan : తాలిబన్ల ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బ్యూటీషియన్ల నిరసన.. గాల్లోకి కాల్పులు జరిపి అణచివేత
అఫ్గాన్లో (Afghanistan) తాలిబన్ల (Taliban) ఉత్తర్వులపై కొందరు బ్యూటీషియన్లు నిరసన తెలిపారు. దాన్ని జీర్ణించుకోలేని తాలిబన్ సేనలు వారిని చెదరగొట్టాయి.
కాబుల్ : అఫ్గాన్ (Afghanistan) రాజధాని కాబుల్లో (Kabul) బ్యూటీషియన్లు ఆందోళన నిర్వహించారు. బ్యూటీ పార్లర్లపై తాలిబన్లు నిషేధం విధించడాన్ని నిరసిస్తూ పదుల సంఖ్యలో గుమిగూడారు. జీవనోపాధిని దూరం చేసి తమ పొట్ట కొట్టొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. బ్లూటీ పార్లర్లు ఎక్కువగా ఉండే బుచెర్ స్ట్రీట్లో ఈ ఆందోళనలు చేశారు. దాంతో తాలిబన్ సేనలు అప్రమత్తమయ్యాయి. వెంటనే వారిని చెదరగొట్టేందుకు గాల్లోకి కాల్పులు జరిపారు. జల ఫిరంగులను ప్రయోగించారు. ఈ ఘటన తాలుకా ఫొటోలు, వీడియోలను మహిళలు కొందరు విలేకరులకు పంపించారు.
‘ఇవాళ మేము ప్రభుత్వంతో చర్చలు జరపడానికి శాంతియుతంగా నిరసన చేపట్టాం. అయితే మాతో మాట్లాడటానికి ఎవరూ రాలేదు. మా గోడు వినలేదు. పైగా జల ఫిరంగులు ప్రయోగించి, గాల్లోకి కాల్పులు జరిపారని’ ఓ బ్యూటీ పార్లర్ నిర్వాహకురాలు మీడియాతో అన్నారు. అఫ్గాన్లో అధికారం చేజిక్కించుకున్నప్పటి నుంచి తాలిబన్లు స్త్రీలపై అనేక నిషేధాలు విధించారు. పాఠశాల స్థాయి నుంచి యూనివర్సీటీల వరకు వారిని చదువుకు దూరం చేశారు. పార్క్లు, ఎగ్జిబిషన్లు, జిమ్లో సైతం మహిళలు అడుగుపెట్టకూడదంటూ ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో తప్పనిసరిగా ముసుగు ధరించాలని ఆదేశించారు.
శక్తిమంతమైన పాస్పోర్టు జాబితాలో అగ్రస్థానంలో సింగపూర్.. మరి భారత్ స్థానం..?
గత నెలలో దేశవ్యాప్తంగా ఉన్న బ్యూటీ పార్లర్లను మూసివేయాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. నెలలోగా మిగిలిన ఉత్పత్తులను ఖాళీ చేసుకొని దుకాణాలను మూసేయాలని హుకుం జారీ చేసింది. బ్యూటీ పార్లర్ల కారణంగా పేద కుటుంబాల్లోని మహిళలు విపరీతంగా ఖర్చు చేస్తున్నారని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అయితే ఈ ఉత్తర్వుల వెనుక తాలిబన్ సుప్రీం లీడర్ హిబతుల్లా అఖుంద్జాదా ఉన్నట్లు సమాచారం. కాందహార్లో నివసించే అతడు చాలా అరుదుగా బయట కన్పిస్తాడు.
ఈ వివక్షల గురించి రిచర్డ్ బెన్నెట్ అనే రిపోర్టర్ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలికి నివేదిక పంపించారు. ఈ దేశంలో మహిళలు, బాలికల దుస్థితి ప్రపంచంలోనే అత్యంత దారుణంగా ఉందని అందులో పేర్కొన్నారు. తాలిబన్ల పాలనలో స్త్రీలపై తీవ్రమైన వివక్ష సాగుతోందని ఫిర్యాదు చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
క్యాన్సర్ బాధితుడికి రూ.10వేల కోట్ల లాటరీ
క్యాన్సర్తో పోరాడుతున్న ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. పవర్బాల్ లాటరీ గేమ్లో ఆయన ఏకంగా 1.3 బిలియన్ డాలర్లను గెలుచుకున్నారు. -
చైనాలో కోతకుగురై కూలిన రోడ్డు.. 24 మంది మృతి
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాల కారణంగా ఓ రహదారి 18 మీటర్ల మేర కోతకుగురై కూలిపోయింది. -
కొలంబియా వర్సిటీలోకి పోలీసులు
అమెరికాలో గాజా ఆందోళనలకు కేంద్ర బిందువైన న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలోకి మంగళవారం రాత్రి పోలీసులు భారీ సంఖ్యలో ప్రవేశించారు. -
ఆరోగ్యకర జీవనశైలితో ‘అర్ధాయుష్షు జన్యువుల’కు కళ్లెం
ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా.. ఆయుర్దాయాన్ని తగ్గించే జన్యువుల ప్రభావాన్ని 60 శాతానికిపైగా నిలువరించొచ్చని తాజా పరిశోధనలో తేలింది. -
అధిక రక్తపోటుకు జన్యుమూలాల గుర్తింపు
మానవ జన్యుపటంలోని 2వేలకుపైగా ప్రాంతాలు రక్తపోటును ప్రభావితం చేస్తాయని తాజా పరిశోధన తేల్చింది. -
కృష్ణపదార్థ ఉనికిపై ఆధారాలు
విశ్వంలో అంతుచిక్కని కృష్ణపదార్థ ఆచూకీపై శాస్త్రవేత్తలు కీలక ఆవిష్కరణ చేశారు. గెలాక్సీల్లో నక్షత్రాలు, గ్యాస్ కదలికల పరిశీలన ద్వారా కృష్ణపదార్థ ఉనికిని సమర్థించే ఆధారాలను గుర్తించారు. -
వాషింగ్టన్ పోస్ట్ కథనంపై వ్యాఖ్యానించం
సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర కేసు దర్యాప్తు నిమిత్తం భారత్తో నిరంతరం కలిసి పనిచేస్తున్నామని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. -
రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్ కోట’ ధ్వంసం
ఉక్రెయిన్లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసంచేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్ కోటగా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. -
విమానయాన ఉద్గారాలు భారత్లో ఎక్కువే!
విమానయాన రంగం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను ఎక్కువగా విడుదల చేస్తున్న మొదటి ఐదు వర్ధమాన దేశాల్లో భారత్ కూడా ఉందని నార్వేజియన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధన తేల్చింది. -
గాజా కాల్పుల విరమణపై పీటముడి!
గాజాలో కాల్పుల విరమణకు సంబంధించి పీటముడి పడింది. శాశ్వత కాల్పుల విరమణను మాత్రమే తాము ఆమోదిస్తామని హమాస్ పేర్కొంటుంటే, యుద్ధాన్ని ఆపేదే లేదని, గాజాలోని రఫాపై దండయాత్ర ఖాయమని ఇజ్రాయెల్ అంటోంది. -
ప్రపంచవ్యాప్తంగా నినదించిన కార్మికలోకం
ప్రపంచ కార్మిక దినోత్సవం ‘మే డే’ సందర్భంగా బుధవారం ఆసియా, యూరప్ ఖండాల్లోని పలు నగరాల్లో కార్మికులు ప్రదర్శనలు నిర్వహించారు. -
చందమామ ఆవలి భాగం నుంచి నమూనాల సేకరణ!
చంద్రుడి ఆవలి భాగం నుంచి నమూనాలు సేకరించడానికి చాంగే-6 వ్యోమనౌకను శుక్రవారం ప్రయోగించనున్నట్లు చైనా ప్రకటించింది. ఇలాంటి ప్రయోగాన్ని చేపట్టడం మానవాళి చరిత్రలో ఇదే మొదటిసారని తెలిపింది. -
మద్యం మత్తులో పైలట్.. సర్వీసు నిలిపివేత
అమెరికాలోని డాలస్ నుంచి జపాన్ రాజధాని టోక్యో వెళ్లాల్సిన జపాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం అనూహ్య కారణంతో నిలిచిపోయింది. -
పాకిస్థాన్లో 5 లక్షల సిమ్ కార్డుల బ్లాక్
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. -
బ్రిటన్లో భారీగా తగ్గిన డిపెండెంట్ వీసాలు
ఈ ఏడాది ప్రారంభం నుంచి తాము అమలులోకి తీసుకువచ్చిన విదేశీ విద్యార్థుల డిపెండెంట్ వీసాల్లో భారీ తగ్గుదల నమోదైనట్లు బ్రిటన్ ప్రకటించింది. -
ప్రపంచంలోనే అత్యంత ధనిక ‘ఖైదీ’.. సంపద విలువ రూ. 3.60 లక్షల కోట్లు?
క్రిప్టో కరెన్సీ సంస్థ బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్ జావో ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీగా నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
మృత్యువుతో గెలిచి.. పదిలో మెరిసి
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?