Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
ఇరాన్- ఇరాక్ యుద్ధ వార్షికోత్సవం పురస్కరించుకుని ఇరాన్ సేనలు పెద్దఎత్తున ఆయుధ సంపత్తితో మిలటరీ పరేడ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించగల డ్రోన్లను ప్రదర్శించాయి.
టెహ్రాన్: ఇరాన్- ఇరాక్ యుద్ధ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని టెహ్రాన్ భారీ సైనిక కవాతు నిర్వహించింది. ఈ సందర్భంగా ఇరాన్ సేనలు పెద్దఎత్తున ఆయుధ సంపత్తితో కదం తొక్కాయి. ఈ క్రమంలోనే ప్రపంచంలోనే అత్యంత దూరం ప్రయాణించగల డ్రోన్లను ప్రదర్శించాయి. వాటితోపాటు బాలిస్టిక్, హైపర్సోనిక్ క్షిపణులను పరేడ్లో భాగం చేసినట్లు ఇరాన్ మీడియా సంస్థలు పేర్కొన్నాయి. ఈ కవాతులో ప్రదర్శించిన డ్రోన్లకు మొహజర్, షాహెద్, అరాష్ అని పేర్లు పెట్టినట్లు తెలిసింది. ఈ సందర్భంగా సైన్యాన్ని ఉద్దేశించి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ప్రసంగించారు.
భద్రతామండలి పని తీరును ప్రపంచం ప్రశ్నించాలి!: భారత్
‘మన దళాలు ఇరాన్తోపాటు పర్షియన్ గల్ఫ్లో భద్రతను పర్యవేక్షిస్తున్నాయి. యుద్ధం వంటి విపత్కర పరిస్థితులకు దీటుగా ప్రతిఘటించడమే ప్రస్తుత కాలపు తంత్రమని ఈ ప్రాంత ప్రజలకు మనం చాటగలం. లొంగిపోవడమో.. తడబడటమో కాదు.. శత్రువును తోకముడిచేలా చేయగలిగేది ప్రతిఘటన మాత్రమే’ అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. మొహజర్-10 పేరుతో ఓ అత్యాధునిక డ్రోన్ను రూపొందించినట్లు ఇరాన్ గత నెలలో వెల్లడించింది. దాదాపు 2 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించడం, 24 గంటలపాటు నిరంతరాయంగా గాల్లో చక్కర్లు కొట్టడం, 300 కిలోల పేలోడ్ మోసుకెళ్లడం వంటి సామర్థ్యాలు దీని సొంతమని తెలిపింది. సుమారు 24 గంటలు ప్రయాణించి 2వేల కిలోమీటర్ల దూరానికి వెళ్లగలదని పేర్కొంది. మొహజర్-6తో పోలిస్తే ఇందులో రెట్టింపు సామర్థ్యాలున్నాయి.
1980 సెప్టెంబరు 22న అప్పటి ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ సేనలు ఇరాన్పై దండెత్తడంతో ఇరాన్- ఇరాక్ యుద్ధం మొదలైంది. ఎనిమిదేళ్లపాటు సాగిన ఈ సైనిక సంఘర్షణలో రెండువైపులా దాదాపు 5 లక్షల మంది మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
జర్మనీ(Germany)కి ఖతార్ నుంచి దౌత్యపరమైన ఎదురుదెబ్బ తగిలింది. అయితే, అది ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? లేదా..? తెలియాల్సి ఉంది. -
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
రాబోయే రోజుల్లో రష్యా జనాభాను పెంచడమే లక్ష్యంగా పెట్టుకోవాలని దేశ మహిళలను అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ విజ్ఞప్తి చేశారు. -
Nithyananda: కైలాస దేశంతో ఒప్పందం.. పరాగ్వే దేశ మంత్రి పదవి ఊడగొట్టిన నిత్యానంద
వివాదాస్పద స్వామిజీ నిత్యానంద స్థాపించిన ‘యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస’తో ఒప్పందం చేసుకున్నందుకు పరాగ్వే మంత్రి తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. -
Israel-Hamas: ముగిసిన సంధి.. గాజాలో మళ్లీ యుద్ధం మొదలు
Israel-Hamas: బందీల విడుదల కోసం ఇజ్రాయెల్-హమాస్ మధ్య తాత్కాలికంగా కుదిరిన సంధి గడువు ముగిసింది. దీంతో గాజాలో మళ్లీ యుద్ధం మొదలైంది. -
పన్నూ హత్యకు కుట్ర.. భారతీయుడిపై అభియోగాలను తీవ్రంగా పరిగణించిన అమెరికా
సిక్కు వేర్పాటువాది హత్య కుట్రలో భారత వ్యక్తి ప్రమేయం ఉందన్న ఆరోపణలను అమెరికా (USA) సీరియస్గా తీసుకుంది. అదే సమయంలో భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని వ్యాఖ్యానించింది. -
Iraq: ఇరాక్లో బాంబు దాడి.. 10 మంది మృతి
ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో స్థానిక ఎంపీ బంధువులపై బాంబు దాడి జరిగింది. ఈ ఘటనలో పది మంది మృతి చెందగా.. మరో 14 మందికి తీవ్ర గాయాలయ్యాయి. -
రామస్వామి అభ్యర్థిత్వానికి ఎదురుదెబ్బలు
అమెరికా అధ్యక్ష పదవికి ఎన్నికల బరిలో దిగేందుకు రిపబ్లికన్ పార్టీ నామినేషను కోసం పోటీపడుతున్న భారత సంతతి అమెరికన్ వివేక్ రామస్వామి (38)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
భూతాపంలో 2023 కొత్త రికార్డు
వాతావరణ రికార్డుల్లో 2023 అత్యుష్ణ సంవత్సరంగా నిలిచిపోనుందని ఐక్యరాజ్య సమితికి అనుబంధమైన ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) గురువారం తెలిపింది. -
చర్చల ప్రసక్తే లేదన్న ఉత్తర కొరియా
తాము ఇటీవల నిర్వహించిన గూఢచారి ఉపగ్రహ ప్రయోగాన్ని అమెరికా ఖండించడంపై ఉత్తర కొరియా అధ్యక్షుడి సోదరి కిమ్ యో జాంగ్ గురువారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. -
ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు సింగపూర్, జ్యూరిచ్
ఈ ఏడాది ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలుగా సింగపూర్, జ్యూరిచ్ నిలిచాయని ‘ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్’ (ఈఐయూ) తెలిపింది. -
97కు చేరిన బందీల విడుదల
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణను గురువారం ఉదయం మరో రోజుకు పొడిగించారు. వాస్తవానికి గురువారం ఉదయం 7 గంటలకు ఒప్పందం ముగియాల్సి ఉంది. -
అమెరికా దౌత్యవేత్త హెన్రీ కిసింజర్ మృతి
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో అమెరికా విదేశాంగ విధానాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ దౌత్యవేత్త హెన్రీ కిసింజర్(100) బుధవారం కనెక్టికట్లోని తన స్వగృహంలో కన్నుమూశారు. -
మొదటి నుంచీ అదే చెబుతున్నాం
సిక్కు వేర్పాటువాది హత్యకు కుట్ర పన్నిన భారతీయుడిపై అమెరికా అభియోగాలను మోపడంద్వారా మేం చెబుతున్న వాదనలకు బలం చేకూరిందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో వ్యాఖ్యానించారు. -
తూర్పు ఉక్రెయిన్పై రష్యా దాడులు
తూర్పు ఉక్రెయిన్లోని దొనెట్స్క్ ప్రాంతంపై గురువారం రష్యా ఎస్-300 క్షిపణులు విరుచుకుపడ్డాయి. ఈ దాడిలో పలు నివాస గృహాలు ధ్వంసమయ్యాయి. -
ఓస్ప్రేల నిలిపివేత!
అమెరికా వైమానిక దళానికి చెందిన ఓస్ప్రే విమానం సాగర జలాల్లో కూలిపోయిన నేపథ్యంలో జపాన్ పునరాలోచనలో పడింది. తన వద్ద ఉన్న ఇదే తరహా విమానాల కార్యకలాపాలను కొంతకాలం పాటు నిలిపివేయాలని భావిస్తోంది. -
‘మరింత అణుశక్తి కావాలి’
వాతావరణ మార్పులపై పోరాటానికి మరింత అణుశక్తి కావాల్సి ఉందని, పెరుగుతున్న విద్యుత్తు అవసరాలకు ఇది ఎంతో ముఖ్యమని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ డైరెక్టర్ జనరల్ రఫేల్ మారియానా గ్రాసీ పేర్కొన్నారు.


తాజా వార్తలు (Latest News)
-
Ambati Rambabu: తెలంగాణలో ఏ పార్టీనీ గెలిపించాల్సిన అవసరం మాకు లేదు: అంబటి
-
IND vs AUS: భారత్-ఆస్ట్రేలియా నాలుగో టీ20.. స్టేడియంకు ‘కరెంట్’ కష్టాలు..!
-
ఆహ్వానం అందక.. అర్ధగంట విమానం డోర్ వద్దే నిల్చున్న అధ్యక్షుడు..!
-
Animal movie review: రివ్యూ: యానిమల్.. రణ్బీర్-సందీప్ వంగా యాక్షన్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
Vladimir Putin: ఎక్కువ మంది పిల్లల్ని కనండి.. రష్యన్ మహిళలకు పుతిన్ విజ్ఞప్తి
-
Jigarthanda Double X: ఓటీటీలోకి ‘జిగర్ తండ: డబుల్ ఎక్స్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!