Pakistan: రాజకీయాల్లోకి ఉగ్ర వారసుడు.. పాక్ ఎన్నికల బరిలో హఫీజ్ తనయుడు..!
పాకిస్థాన్లో ఇప్పుడు ఉగ్రవాదులు ఏకంగా జాతీయ అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. లష్కరే తోక పార్టీగా పేరున్న పీఎంఎంఎల్ తరఫున ఓ ఉగ్రనాయకుడు ఎన్నికల బరిలోకి దిగాడు.
ఇంటర్నెట్డెస్క్: ఉగ్రవాదులను కట్టడి చేశామని అంతర్జాతీయ సమాజానికి పాకిస్థాన్ ఎన్ని మాటలు చెబుతున్నా.. చేతలు మాత్రం వేరేగా ఉన్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాది, 26/11 ముంబయి దాడుల మాస్టర్ మైండ్ హఫీజ్ సయీద్ స్థాపించిన పార్టీ ఇప్పుడు ఏకంగా అక్కడి సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దిగింది. ‘ది పాకిస్థాన్ మర్కజీ ముస్లిం లీగ్’ (పీఎంఎంఎల్) పేరిట సయీద్ ఓ పార్టీని ఏర్పాటు చేశాడు.
గతంలో లష్కరే తరఫున మిల్లీ ముస్లిం లీగ్ పేరిట పార్టీ ఉండేది. కానీ, దానిపై 2018లో నిషేధం విధించారు. ఆ పార్టీ మూలాల నుంచే తాజాగా పీఎంఎంఎల్ను ఏర్పాటు చేశారు. దీని గుర్తు కుర్చీ. ఈ పార్టీకి ఖలీద్ మసూద్ సింధూ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. తమ పార్టీ అన్ని నేషనల్, ప్రావిన్షియల్ అసెంబ్లీ స్థానాలకు పోటీ చేస్తుందని అతడు ప్రకటించాడు. పైకి మాత్రం తమ పార్టీకి ఉగ్ర సంస్థ లష్కరేతో ఎటువంటి సంబంధం లేదని అతడు చెబుతున్నాడు. కానీ, పార్టీ తరఫున హఫీజ్ తనయుడు తల్హా సయీద్ ఎన్ఏ-127 స్థానం నుంచి బరిలోకి దిగుతున్నాడు.
2000 సంవత్సరంలో హఫీజ్ సయీద్ను ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అయినప్పటికీ.. అతడిపై ఇతర ఉగ్ర నేరాలను పాక్ మోపలేదు. అంతేకాదు.. అతడిని భారత్కు అప్పగించలేదు. 2019 జులై నుంచి అతడు పాకిస్థాన్ జైల్లోనే ఉన్నాడు. 2022 ఏప్రిల్లో ఉగ్ర నిధుల సేకరణ ఆరోపణలపై శిక్ష విధించారు.
భారత హోం మంత్రిత్వ శాఖ గతేడాది ఏప్రిల్లో విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం తల్హా సయీద్ లష్కరే క్లెరిక్ విభాగానికి అధిపతి. ఈ సంస్థ నిధుల సేకరణ, ప్లానింగ్ నియామకాల్లో అతడే చురుగ్గా వ్యవహరిస్తున్నాడు. తల్హా సయీద్ పేరును మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో చేరుస్తూ భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ‘‘తల్హా సయీద్ ఉగ్ర కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడని మేం విశ్వసిస్తున్నాం. అందుకే, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక) చట్టం, 1967 కింద అతడిని ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నాం’’ అని కేంద్ర హోం శాఖ తెలిపింది. భారత ప్రభుత్వం ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో తల్హా 32వ వ్యక్తి. ఇదే జాబితాలో హఫీజ్ సయీద్ పేరు కూడా ఉంది. 47 ఏళ్ల తల్హా సయీద్ పాకిస్థాన్లోని లాహోర్లో జన్మించాడు. తండ్రి స్థాపించిన లష్కరే తోయిబా ముఠాలో సీనియర్ నాయకుడైన తల్హా.. ఈ సంస్థ క్లెరిక్ విభాగానికి హెడ్గా వ్యవహరిస్తూ.. భారత్, అఫ్గానిస్థాన్లో లష్కరే నియామకాలు, నిధుల సేకరణ, దాడులకు కుట్రలు రచించడం వంటి కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సహకారం అందించారన్న రెండు కేసుల్లో హఫీజ్ సయీద్కు 33 ఏళ్ల జైలు శిక్ష పడిన మరుసటి రోజే.. తల్హాను ఉగ్రవాదిగా ప్రకటిస్తూ భారత్ నిర్ణయం తీసుకుంది.
తాజా పరిణామాలతో ఉగ్రవాదులను కూడా పాక్ చట్ట సభల్లోకి చేర్చేందుకు అక్కడ రంగం సిద్ధమవుతోంది. పాక్లో 2024 ఫిబ్రవరిలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!
Pakistan: భారత్ సాధిస్తున్న పురోగతి.. పాక్ దయనీయ స్థితిని వివరిస్తూ ఆ దేశ చట్టసభ సభ్యుడు చేసిన ప్రసంగం ఇప్పుడు వైరల్గా మారింది. -
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.
తాజా వార్తలు (Latest News)
-
నరేశ్ గోయల్ సతీమణి కన్నుమూత
-
శ్రీశైలం వెళ్తుండగా బొలెరో వాహనం బోల్తా.. 15 మంది భక్తులకు గాయాలు
-
350 పాయింట్లు ఎగబాకిన సెన్సెక్స్.. 22,310 పైన నిఫ్టీ
-
పోలీస్స్టేషన్లోనే కానిస్టేబుల్ ఆత్మహత్య!
-
తెదేపా నేత కొనకళ్ల నారాయణకు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
-
‘భారత్ చంద్రుడిపై కాలుమోపింది.. మనమేమో..’: పాక్ పార్లమెంట్లో ఆసక్తికర చర్చ!