Adani Group: అదానీ ఎంటర్ప్రైజెస్ FPOపై సెబీ నిఘా?
Adani Group: ఎఫ్పీఓలో పాల్గొనే యాంకర్ ఇన్వెస్టర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండొద్దు. ఈ నేపథ్యంలో ‘అదానీ’ ఎఫ్పీఓలో ఈ నిబంధనేమైనా ఉల్లంఘనకు గురైందా అనే కోణంలో సెబీ దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
దిల్లీ: మధ్యలోనే ఆగిపోయిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఎఫ్పీఓ (Adani Enterprises FPO)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ పబ్లిక్ ఆఫర్లో పాల్గొన్న ఇన్వెస్టర్లపై సెబీ (SEBI) దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఇద్దరు వ్యక్తులు వెల్లడించారు. ఇటు అదానీ గ్రూప్ (Adani Group)గానీ, సెబీగానీ దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఎఫ్పీఓలో పాల్గొనే యాంకర్ ఇన్వెస్టర్లకు ఎట్టిపరిస్థితుల్లోనూ కంపెనీ యాజమాన్యంతో ఎలాంటి సంబంధం ఉండొద్దన్నది నిబంధన. ఈ నేపథ్యంలో అదానీ ఎఫ్పీఓ (Adani Enterprises FPO)లో ఈ నిబంధనేమైనా ఉల్లంఘనకు గురైందా? అనే కోణంలో సెబీ (SEBI) దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఈ ఎఫ్పీఓ (Adani Enterprises FPO)లో షేర్లను సబ్స్క్రైబ్ చేసుకున్న మరో రెండు ఇన్వెస్ట్మెంట్ సంస్థలతో అదానీ గ్రూప్ (Adani Group)నకు ఉన్న సంబంధాలపైనా సెబీ (SEBI) గురిపెట్టినట్లు తెలుస్తోంది.
అదానీ ఎంటర్ప్రైజెస్ (Adani Enterprises) రూ.20,000 కోట్ల సమీకరణ లక్ష్యంతో ఎఫ్పీఓను ప్రారంభించింది. హిండెన్బర్గ్ నివేదిక (Hindenburg Report).. ఫలితంగా గ్రూప్ కంపెనీల షేర్ల పతనం నేపథ్యంలో తొలి రెండురోజుల్లో పెద్దగా స్పందన లభించలేదు. కానీ, చివరి రోజు మాత్రం అన్ని షేర్లు సబ్స్క్రైబ్ కావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. అయితే, ఎఫ్పీఓను గట్టెక్కించేందుకు కొన్ని సంస్థలు అదానీ గ్రూప్ (Adani Group)నకు అండగా నిలిచాయనే వార్తలు వచ్చాయి.
4 కంపెనీ రేటింగ్స్లో మూడీస్ కోత..
అదానీ గ్రూప్ (Adani Group)లోని నాలుగు కంపెనీల రేటింగ్ను మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ సవరించింది. స్టేబుల్ నుంచి నెగెటివ్కు మార్చినట్లు వెల్లడించింది. అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ గ్రీన్ ఎనర్జీ రెస్ట్రిక్టెడ్ గ్రూప్, అదానీ ట్రాన్స్మిషన్ స్టెప్-వన్ లిమిటెడ్, అదానీ ఎలక్ట్రిసిటీ ముంబయి లిమిటెడ్ రేటింగ్ ఔట్లుక్ను మార్చినట్లు తెలిపింది. అదానీ గ్రూప్ (Adani Group) కంపెనీ ఈక్విటీ విలువలు భారీగా పడిపోయిన నేపథ్యంలోనే మార్పులు చేయాల్సి వచ్చిందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
యుద్ధ విమానానికి పైలట్గా కృత్రిమ మేధ!
కృత్రిమ మేధ (ఏఐ) క్రమంగా అన్ని రంగాల్లోకీ ప్రవేశిస్తోంది. యుద్ధవిమాన పైలట్గానూ అది ఎదిగింది. తాజాగా ఏఐ నియంత్రిత ఎఫ్-16 ఫైటర్ జెట్ అమెరికాలో గగనవిహారం చేసింది. -
నేపాల్ కరెన్సీ రూ.100 నోటుపై వివాదాస్పద భూభాగాలతో కొత్తపటం
నేపాల్ తన తాజా కరెన్సీ నోటుపై మూడు కొత్త భూభాగాలను చేర్చడం ద్వారా నవీకరించిన దేశ రాజకీయ పటం ముద్రించనున్నట్లు శుక్రవారం ప్రకటించింది. -
జాబిల్లి ఆవలివైపు శిలల కోసం చైనా వ్యోమనౌక
మనకు కనిపించని చందమామ అవతలి భాగం నుంచి మట్టి, శిలలను సేకరించి, భూమికి తెచ్చేందుకు చైనా శుక్రవారం చాంగే-6 అనే వ్యోమనౌకను ప్రయోగించింది. -
వారంలో అంగీకరిస్తే సరే.. లేకపోతే రఫాపై దండయాత్రే
గాజా కాల్పుల విరమణ అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒప్పందం కుదిర్చేందుకు అమెరికా, ఈజిప్టు, ఖతార్ తెర వెనక ప్రయత్నాలు చేస్తుంటే విరమణకు అంగీకరించాల్సిన హమాస్, ఇజ్రాయెల్ పరస్పరం హెచ్చరికలు జారీ చేసుకుంటున్నాయి. -
రిషి సునాక్కు ఎదురుదెబ్బ
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. బ్రిటన్ ప్రధాని రిషి సునాక్కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల్లో అధికార కన్జర్వేటివ్ పార్టీకి భారీ పరాజయాలు ఎదురవుతున్నాయి. -
2,200కు చేరిన అరెస్టులు
అమెరికా యూనివర్సిటీల్లో ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. రోజుకో యూనివర్సిటీలోకి పోలీసులు ప్రవేశించి ఆందోళనకారులను బయటకు పంపుతున్నారు. -
నిజ్జర్ హత్య కేసులో ముగ్గురి అరెస్టు
ఖలిస్థానీ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో నిందితులుగా పేర్కొంటూ శుక్రవారం కెనడా పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. -
పీవోకేలో రోడ్డు ప్రమాదం.. 20 మంది మృతి
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 43 మంది ప్రయాణికులతో రావల్పిండి నుంచి గిల్గిత్ వెళుతున్న బస్సు.. డైమెర్ జిల్లాలో కారాకోరం హైవేపై అదుపు తప్పి లోయలో పడింది. -
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్న్యూస్
అమెరికాలోని న్యూయార్క్ సిటీలో ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ ఫార్మసీ సంస్థ హిమ్స్ సీఈఓ ఆండ్రూ డుడమ్ ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పారు.