USA: ముగ్గురు సైనికుల మృతి.. ప్రతీకార దాడులు మొదలు పెట్టిన అమెరికా
ఇటీవల జోర్డాన్లో అమెరికా సైనికులపై జరిగిన డ్రోన్ దాడికి సంబంధించి అమెరికా ప్రతికార దాడులు మొదలుపెట్టింది.
వాషింగ్టన్: ఇటీవల జోర్డాన్ (Jordan)లో తమ క్యాంప్పై దాడి చేసిన ఘటనకు సంబంధించి అమెరికా (USA) ప్రతీకార దాడులు మొదలు పెట్టింది. ఇరాక్, సిరియాలోని ఇరాన్ మద్దతు గల మిలిటెంట్లు, ఇరాన్ రివల్యూషనరీ గార్డుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని అమెరికా యుద్ధవిమానాలు దాడి చేశాయి. ఈఘటనలో పలువురు మృతి చెందినట్లు తెలుస్తోంది. జోర్డాన్లో ఇటీవల అమెరికా సైనిక క్యాంప్పై డ్రోన్ దాడి జరగడంతో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందారు. దీంతో అమెరికా తీవ్రంగా స్పందించింది. అధ్యక్షుడు జోబైడెన్తో ఇతర మంత్రులు ప్రతికార దాడులు తప్పవని హెచ్చరించారు. దానికి తగ్గట్లు ప్రణాళిక రూపొందిస్తాన్నామని బైడెన్ ఇటీవల పేర్కొన్నారు.
డ్రోన్ దాడిలో మృతిచెందిన సైనికుల కుటుంబాలను బైడెన్ శుక్రవారం పరామర్శించారు. ఈ సందర్భంగా బైడెన్ కీలక ప్రకటన చేశారు. ‘‘నా ఆదేశాల ప్రకారం అమెరికా బలగాలు ఇరాక్, సిరాయాల్లోని శత్రు స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటాయి. మా స్పందన మొదలైంది. మేము ఎంచుకున్న ప్రదేశాల్లో దాడులు కొనసాగుతాయి’’ అని పేర్కొన్నారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది. మొత్తం 85 స్థావరాలపై దాడులు జరిగాయి. దీర్ఘశ్రేణి బాంబర్లు వైమానిక దాడుల్లో పాల్గొన్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉద్యోగం కోల్పోయినా హెచ్-1బీ వీసాదారులు మరికొంత కాలం ఉండొచ్చు
ఉద్యోగం కోల్పోయిన హెచ్-1బీ వీసాదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని అమెరికా తీసుకుంది. ఆ ప్రకారం అటువంటి ఉద్యోగులు మరికొంత కాలం అమెరికాలో ఉండేందుకు అవకాశాన్ని పొందనున్నారు. -
యుద్ధంపై చర్చలకు సిద్ధమే
ఉక్రెయిన్తో యుద్ధంపై చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ సంప్రదింపుల్లో తమ దేశ ప్రయోజనాలనూ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. -
ఖైదీల వాహనాన్ని కారుతో ఢీకొట్టి..
ఫ్రాన్స్లో మాదకద్రవ్యాల ముఠా బీభత్సం సృష్టించింది. తమ నాయకుడిని తరలిస్తున్న వాహనంపై హాలీవుడ్ సినిమా తరహాలో తుపాకులతో విరుచుకుపడింది. -
డెంగీకి మరో టీకా!
డెంగీ కట్టడికి రూపొందించిన రెండో టీకాకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) బుధవారం ఆమోదం తెలిపింది. ఈ వ్యాధి నుంచి ఉపశమనం పొందడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. -
సింగపూర్ ప్రధానిగా లారెన్స్ వాంగ్ ప్రమాణస్వీకారం
సింగపూర్ నాలుగో ప్రధానమంత్రిగా ఆర్థికవేత్త లారెన్స్ వాంగ్ (51) బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. ఈయనకు ముందు రెండు దశాబ్దాలపాటు లీ సీన్ లూంగ్ (71) ప్రధానిగా వ్యవహరించగా, వాంగ్ ఉప ప్రధాని పదవి నిర్వహించారు. -
‘మళ్లీ మోదీయే ప్రధాని’
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లారని, ఆయన మూడోసారి కూడా ప్రధాని పదవిని చేపడతారని పాకిస్థానీ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపార వేత్త సాజిద్ తరార్ పేర్కొన్నారు. -
కాటన్ కాండీలాంటి మెత్తటి గ్రహం
సౌర కుటుంబం వెలుపల ఒక నక్షత్రం చుట్టూ తిరుగుతున్న భారీ గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. అది మన గురుగ్రహం కన్నా ఏకంగా 50 శాతం పెద్దగా ఉంది. -
యూఎస్ డిస్ట్రాయర్పై దాడి చేశాం
ఎర్రసముద్రంలో యూఎస్ నేవీ డిస్ట్రాయర్పై, ఓ వాణిజ్య నౌకపై దాడి చేసినట్లు బుధవారం యెమెన్లోని హూతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. -
‘చాబహార్’ను సంకుచిత దృష్టితో చూడకూడదు
చాబహార్ పోర్టు ఒప్పందంతో మొత్తం ప్రాంతానికి మేలు జరుగుతుందని, దీన్ని సంకుచిత దృష్టితో చూడకూడదని విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్.జైశంకర్ హితవు పలికారు. -
సంక్షిప్త వార్తలు (3)
మెక్సికో దక్షిణ ప్రాంతంలోని చియాపస్ రాష్ట్రం చికోముసెలో పట్టణంలో మంగళవారం జరిగిన సామూహిక కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. -
స్లొవేకియా ప్రధానమంత్రిపై కాల్పులు
స్లొవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికో (59)పై కాల్పులు చోటుచేసుకోవడం తాజాగా కలకలం సృష్టించింది. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. -
సూర్యుడి నుంచి వెలువడ్డ భారీ జ్వాల
గత రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత పెద్ద సౌర జ్వాల.. సూర్యుడి నుంచి వెలువడింది. మంగళవారం జరిగిన ఈ పరిణామాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ-నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ క్లిక్మనిపించింది. -
అధ్యక్ష చర్చలకు సిద్ధం
అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా సాగే అవకాశం కనబడుతోంది. ముఖ్యంగా ఎన్నికల ముందు జరిగే చర్చలపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. -
సముద్రం ముప్పు.. థాయ్లాండ్ రాజధానిని తరలించాల్సిందేనా..?
సముద్ర మట్టాలు పెరగడం ద్వారా ఈ శతాబ్దం చివరినాటికి థాయ్లాండ్ రాజధాని బ్యాంకాక్ మునిగిపోయే ప్రమాదం ఉందని అక్కడి వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. -
దీనిని ఎవరు ఓకే చేశారో..?: కింగ్ ఛార్లెస్ చిత్తరువుపై భిన్నాభిప్రాయాలు
బ్రిటన్ రాజుగా పట్టాభిషేకం జరిగిన ఏడాది తర్వాత ఆవిష్కరించిన కింగ్ ఛార్లెస్ 3(King Charles III) చిత్రపటంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. -
‘గర్జనకు సిద్ధం’.. బైడెన్ సవాలును స్వీకరించిన ట్రంప్!
యూఎస్ ఎలక్షన్ డిబేట్స్ కమిషన్ నిర్వహించే చర్చలకు దూరంగా ఉన్న అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden).. టెలివిజన్ వేదికగా చర్చలకు మాత్రం సిద్ధమేనని ప్రకటించారు.