Ukraine War: బక్ముత్ నగరంపై వాగ్నర్ పట్టు..?
ఉక్రెయిన్కు కీలకమైన బక్ముత్పై పోరు తీవ్రమైంది. ఇప్పటికే ఈ నగరాన్ని తాము ఆక్రమించుకొన్నట్లు వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది.
ఇంటర్నెట్డెస్క్: రష్యా(Russia)తో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్(Ukraine )కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. రష్యా దళాలు మరింత ముందుకొచ్చేందుకు ఇప్పుడు అవకాశం లభించింది. ఈ పోరులో కీలకమైన బక్ముత్ నగరాన్ని స్వాధీనం చేసుకొన్నట్లు క్రెమ్లిన్ కిరాయి సైన్యం వాగ్నర్ గ్రూప్ ప్రకటించింది. ఈ మేరకు రాత్రివేళ నగర సిటీ హాల్లో రష్యా పతాకాన్ని ఎగురవేసినట్లు పేర్కొంది. ఆ గ్రూప్ అధిపతి ప్రిగోజిన్ ఓ వీడియోలో మాట్లాడుతూ బక్ముత్ ఇక అధికారికంగా రష్యా సొంతమైనట్లు పేర్కొన్నారు. అయితే పశ్చిమ ప్రాంతాల్లో ఉక్రెయిన్ దళాలు బలంగా ఉన్నట్లు అంగీకరించారు.
మరోవైపు ఈ వీడియోను ఉక్రెయిన్ అధికారులు తోసిపుచ్చారు. ఇప్పటికీ ఈ నగరం తమ ఆధీనంలో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘శత్రువులు బక్ముత్పై దాడులను ఆపడంలేదు. కానీ, ఉక్రెయిన్ రక్షకులు ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ వాటికి దీటుగా సమాధానం ఇస్తున్నారు’’ అని ఉక్రెయిన్ సైనిక దళాల జనరల్ స్టాఫ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అక్కడ జరుగుతున్న పోరుపై ‘ఇన్స్టిట్యూట్ ఫర్ స్టడీ ఆఫ్ వార్’ అంచనాల ప్రకారం బక్ముత్లో ఎక్కువ ప్రదేశం ఉక్రెయిన్ ఆధీనంలోనే ఉంది. కానీ, రష్యా సేనలు తూర్పు దక్షిణ దిశలుగా కమ్ముకొస్తున్నాయి. తూర్పు వైపు నుంచి చేసిన దాడులతో సిటీహాల్ భవనాన్ని ఆక్రమించుకొంది. ఇక్కడ జరిగే పోరులో వాగ్నర్ గ్రూప్ భారీగా నష్టాలను చవిచూసిందని వెల్లడించారు. ఈ గ్రూప్తోపాటు రష్యా దళాలు కూడా భారీగా పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ దళాలు ఇక్కడ అద్భుతంగా పోరాడుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం అభినందించారు.
దాదాపు 70,000 మంది ప్రజలున్న బక్ముత్ నగరం పై గతేడాది రష్యా దాడులు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఇక్కడ పోరాటం ఆగలేదు. తాజాగా ప్రిగోజిన్ ప్రకటనపై అనుమానాలు ఉన్నాయి. అతడు గతంలో యుద్ధం పూర్తికాక ముందే ప్రకటనలు చేశాడు. ఉప్పు గనుల నగరం సొలెడార్ ఆక్రమణ సమయంలో కూడా ప్రిగోజిన్ ప్రకటనలు గందరగోళం సృష్టించాయి. బక్ముత్ నగరం ఉక్రెయిన్ చేజారితే రష్యా బలగాలు మరింత ముందుకెళ్లే అవకాశాలున్నాయి. ఈ విషయాన్ని స్వయంగా ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరించారు. దొనెట్స్క్ దిశగా బక్ముత్ నుంచి ఇతర నగరాలకు చొచ్చుకొనిపోవడానికి వారికి సులువవుతుందన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉక్రెయిన్పై రష్యా ‘క్లోరోపిక్రిన్’ ప్రయోగం? ఏంటీ ఆయుధం?
Ukraine-Russia Conflict: ఉక్రెయిన్పై యుద్ధంలో పైచేయి సాధించడం కోసం రష్యా రసాయన ఆయుధాలు వాడుతోందని అమెరికా ఆరోపించింది. -
భారత్పై బైడెన్కు అమితమైన గౌరవం: శ్వేతసౌధం
Biden: విదేశీయులను ఆహ్వానించడమంటే భారత్కు భయమంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ చేసిన వ్యాఖ్యలపై శ్వేతసౌధం వివరణ ఇచ్చింది. -
విదేశీ వలసదారులంటే భారత్కు భయం
విదేశీ వలసదారులను తమ దేశంలోకి అనుమతించేందుకు భారత్ భయపడుతుందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. చైనా, రష్యా, జపాన్లదీ అదే పరిస్థితి అని పేర్కొన్నారు. -
రణరంగంగా యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా
న్యూయార్క్లోని కొలంబియా యూనివర్సిటీలో పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను ఖాళీ చేయించిన పోలీసులు గురువారం యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా, లాస్ఏంజెలిస్ (యూసీఎల్ఏ)లోకి ప్రవేశించారు. -
లావుగా ఉన్నాడని బలవంతంగా ట్రెడ్మిల్ వ్యాయామం.. అమెరికాలో ఆరేళ్ల బాలుడి మృతి
కుమారుడు లావుగా ఉన్నాడని భావించిన ఓ వ్యక్తి ట్రెడ్మిల్పై బలవంతంగా పరిగెత్తించి అతడి మరణానికి కారణమయ్యాడు. -
యూఏఈలో మళ్లీ భారీవర్షాలు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)ను మళ్లీ భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో ఇప్పటికే పలు అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. -
గోల్డీబ్రార్ బతికే ఉన్నాడు
భారత్కు చెందిన గ్యాంగ్స్టర్ గోల్డీబ్రార్ అమెరికాలోని కాలిఫోర్నియాలో హత్యకు గురయ్యాడన్న ప్రచారాన్ని అక్కడి పోలీసులు ఖండించారు. -
ఒడెస్సాపై మళ్లీ క్షిపణి దాడి.. 14 మందికి గాయాలు
దక్షిణ ఉక్రెయిన్లోని ఒడెస్సా ఓడ రేవు పట్టణంపై మళ్లీ రష్యా క్షిపణులు ప్రయోగించింది. వారంలో ఈ నగరంపై ఇది మూడో దాడి. -
కిమ్ ఆనందానికి ఏటా 25 మంది కన్యలు
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. -
22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి లేజర్ సందేశం
అమెరికా అంతరిక్ష సంస్థ- నాసా నిర్వహించిన ఒక ప్రయోగంలో భాగంగా.. సుదూర విశ్వం నుంచి ఒక లేజర్ సంకేతం భూమికి చేరింది. అది సుమారు 22.6 కోట్ల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది. -
చైనా రోడ్డు ప్రమాదంలో 48కి చేరిన మృతులు
దక్షిణ చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో రహదారి కోతకు గురై 24 వాహనాలు లోయలో పడిన ఘటనలో మరణించిన వారి సంఖ్య గురువారం 48కి చేరుకుంది. -
విశ్వం అంచుల్లో గురుత్వాకర్షణ శక్తి బలహీనం ఇందుకే..
విస్తరిస్తున్న విశ్వం అంచుల్లోని ‘కాస్మిక్ గ్లిచ్’ గుట్టు విప్పే సరికొత్త నమూనాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ ఘనత సాధించారు. -
శక్స్గావ్ లోయలో చైనా నిర్మాణాలు.. తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీఓకే)ని శక్స్గావ్ లోయలో చైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. -
బోయింగ్ విమానాల ప్రజావేగు మృతి.. 2 నెలల వ్యవధిలో రెండో ఘటన
ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్కు చెందిన 737 మ్యాక్స్ విమానాల్లో లోపాలు ఉన్నాయని బయటపెట్టిన విజిల్ బ్లోయర్ (ప్రజావేగు) జాషువా డీన్(45) మరణించారు. -
కాంగోలో కొత్తరకం ఎంపాక్స్
దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఎంపాక్స్ విజృంభణను కట్టడి చేయడానికి తీవ్రంగా శ్రమిస్తున్న కాంగో నెత్తిన మరో పిడుగు పడింది. -
యుద్ధాన్ని పూర్తిగా ఆపితేనే సంతకం
గాజా కాల్పుల విరమణకు సంబంధించి అమెరికా, ఇతర మధ్యవర్తుల తాజా ప్రతిపాదనను హమాస్ తీవ్రంగా పరిశీలిస్తోంది. -
కిమ్ ‘సుఖం’ కోసం.. ఏడాదికి 25 మంది యువతులు!
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ను సంతోష పెట్టడానికి ఏటా 25 మంది యువతులతో కూడిన బృందం పని చేస్తుందని తాజా కథనం వెల్లడించింది.
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు