Zelenskyy: సొంత సైనికుల మృతదేహాలనే వదిలేస్తోంది.. ఇంతకంటే దారుణం ఉంటుందా..?
ఉక్రెయిన్పై రష్యా పోరుకు నెల రోజులు దాటేసింది. ఈ సమయంలో ఎంతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. రష్యా సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తోంది.
రష్యాపై జెలెన్స్కీ ఆగ్రహం
కీవ్: ఉక్రెయిన్పై రష్యా పోరు నెల రోజులు దాటింది. ఇరువైపులా ఎంతో ప్రాణ నష్టం సంభవిస్తోంది. అయితే.. రష్యా సైనికులు వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నట్లు ఉక్రెయిన్ ఎప్పటికప్పుడు లెక్కలు చెప్తోంది. ఆ దేశం యుద్ధంలో చనిపోయిన తమ సొంత సైనికుల మృతదేహాలనూ గాలికి వదిలేస్తోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వ్యాఖ్యలు చేశారు.
‘ఇది చాలా భయానకంగా ఉంది. సొంతవారిపట్లే అలా ప్రవర్తిస్తే.. బయటివారిని ఇంకెలా చూస్తారు? ఇది పూర్తిగా అనాగరికం. ఈ సైనికుల మృతదేహాలను వదిలేస్తున్నారు. లేకపోతే చెత్త సంచుల్లో ఇంటికి తీసుకెళ్తున్నారు’ అంటూ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ రష్యా వైఖరిని నిరసించారు. మృతుల పట్ల రష్యా అధికార వర్గాలు వ్యవహరిస్తోన్న తీరును అక్కడి సైనిక కుటుంబాలు ఎందుకు అంగీకరిస్తున్నాయో అర్థం కావడం లేదన్నారు.
అలాగే అసలు ఉక్రెయిన్పై రష్యా ఎందుకు యుద్ధం చేస్తోందని ప్రశ్నించారు. ‘ఉక్రెయిన్లో మేం దేనికోసం పోరాడుతున్నామో అర్థం చేసుకున్నాం. మరి మీ సంగతి ఏంటి..? మీ దేశంలో ఏం జరుగుతోంది? నాకు అర్థం కావడం లేదు. ఇదొక విషాదం’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఉక్రెయిన్ తటస్థత కోసం రష్యా చేసిన డిమాండ్ను తమ ప్రభుత్వం జాగ్రత్తగా పరిశీలిస్తోందన్నారు.
రష్యా జరుపుతోన్న ఈ దురాక్రమణలో వెయ్యిమందికి పైగా ఉక్రెయిన్ పౌరులు మరణించారని, పదిహేడు వందల మందికి పైగా గాయపడ్డారని ఐరాస వెల్లడించింది. అయితే ఈ సంఖ్య చాలా ఎక్కువగా ఉండొచ్చని తెలిపింది. ఎవ్వరూ ఊహించని విధంగా సుదీర్ఘంగా సాగుతోన్న ఈ యుద్ధం కారణంగా కోటి మందికి పైగా తమ సొంతప్రాంతాలను వీడినట్లు అంచనా. ఈ సైనిక పోరు ముగింపు కోసం ఇప్పటికే ఇరు దేశాలు పలుమార్లు చర్చలు జరిపాయి. అయినా ఆశించిన ఫలితం రాలేదు. తాజాగా టర్కీలో మరోదఫా చర్చలు జరగనున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారత్ ఎన్నికల్లో మా జోక్యం లేదు
భారతదేశ ఎన్నికల్లో తాము జోక్యం చేసుకోవడం లేదని అమెరికా తెలిపింది. ఈ మేరకు రష్యా చేసిన ఆరోపణలను ఖండించింది. -
రఫాలో భీకర పోరు
రఫా శివార్లలో హమాస్, ఇజ్రాయెల్ రక్షణ దళాల (ఐడీఎఫ్) మధ్య భీకరపోరు ప్రారంభమైంది. పరిమిత స్థాయిలోనే దాడులు చేస్తున్నామని టెల్ అవీవ్ చెబుతున్నా, భారీస్థాయిలోనే యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఐడీఎఫ్ దళాలు విరుచుకుపడుతున్నాయి. -
పాలస్తీనా సభ్యత్వానికి భారీ మద్దతు
పాలస్తీనాను పూర్తిస్థాయి సభ్య దేశంగా గుర్తించాలంటూ భద్రతా మండలికి ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సిఫార్సు చేసింది. ఈ మేరకు 193 దేశాల సర్వప్రతినిధి సభ శుక్రవారం ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించింది. -
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
చైనాలోని ఓ జూలో శునకాలకు పాండా మాదిరి రంగులేసి ప్రదర్శనకు పెట్టడం చర్చనీయాంశంగా మారింది. -
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
సముద్రాలను ఉక్కు పిడికిలిలో బంధించేందుకు చైనా శరవేగంగా తన నేవీని బలపర్చుకొంటోంది. తాజాగా ఓ భారీ ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ నిర్మించి పరీక్షించింది.
తాజా వార్తలు (Latest News)
-
రామ్తో నెట్ఫ్లిక్స్ వెబ్సిరీస్?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!