Delhi Capitals: రాజాంలో దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు సందడి

విజయనగరం జిల్లా రాజాంలో ‘దిల్లీ క్యాపిటల్స్‌’ జట్టు సందడి చేసింది. సోమవారం మధ్యాహ్నం రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ‘దిల్లీ క్యాపిటల్స్‌’ జట్టు సందర్శించింది. జట్టు సభ్యులు అక్షర్‌పటేల్‌, స్టబ్స్‌, మిచెల్‌ మార్ష్‌, కుమార్‌ కుషాగ్ర, యష్‌, అభిషేక్‌ పోరెల్‌, స్వస్తిక్‌ చిక్రా, లలిత్‌ యాదవ్‌లతో పాటు జట్టు డైరెక్టర్‌ సౌరవ్‌గంగూలీ, ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌, సహాయ కోచ్‌ ప్రవీణ్‌ అమ్రె, సలహాదారు వేణుగోపాలరావు తదితరులు రెండు గంటలకు పైగా కళాశాలలో గడిపారు. విద్యార్థులను ఉద్దేశించి సౌరవ్‌ గంగూలీ ప్రసంగించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Updated : 02 Apr 2024 16:56 IST

విజయనగరం జిల్లా రాజాంలో ‘దిల్లీ క్యాపిటల్స్‌’ జట్టు సందడి చేసింది. సోమవారం మధ్యాహ్నం రాజాంలోని జీఎంఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాలను ‘దిల్లీ క్యాపిటల్స్‌’ జట్టు సందర్శించింది. జట్టు సభ్యులు అక్షర్‌పటేల్‌, స్టబ్స్‌, మిచెల్‌ మార్ష్‌, కుమార్‌ కుషాగ్ర, యష్‌, అభిషేక్‌ పోరెల్‌, స్వస్తిక్‌ చిక్రా, లలిత్‌ యాదవ్‌లతో పాటు జట్టు డైరెక్టర్‌ సౌరవ్‌గంగూలీ, ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌, సహాయ కోచ్‌ ప్రవీణ్‌ అమ్రె, సలహాదారు వేణుగోపాలరావు తదితరులు రెండు గంటలకు పైగా కళాశాలలో గడిపారు. విద్యార్థులను ఉద్దేశించి సౌరవ్‌ గంగూలీ ప్రసంగించారు. క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు