Secunderabad: తాడ్‌బండ్‌ హనుమాన్‌ ఆలయానికి పోటెత్తిన భక్తులు

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ దేవాలయానికి భక్తులు పోటెత్తారు.

Updated : 23 Apr 2024 11:37 IST

హనుమాన్ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్‌ హనుమాన్ దేవాలయానికి భక్తులు పోటెత్తారు. సువర్చల వీరాంజనేయస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఉదయం నుంచి స్వామివారికి యజ్ఞ హోమాది అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారి ఆలయాన్ని రకరకాల పూలతో సర్వాంగసుందరంగా తీర్చిదిద్దారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం అంతా కిక్కిరిసిపోయింది. మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి.. స్వామి వారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నారు.

Tags :

మరిన్ని