Vadapalli: భక్తజనసంద్రంగా వాడపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయం

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయ మాడవీధులు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటలపైనే సమయం పడుతుంది. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

Published : 10 Feb 2024 10:51 IST

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఏడు శనివారాల నోము నోచుకునేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు వేల సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం గోవింద నామస్మరణతో మారుమోగింది. ఏడు ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయ మాడవీధులు కిక్కిరిసిపోయాయి. స్వామివారి దర్శనానికి సుమారు మూడు గంటలపైనే సమయం పడుతుంది. వచ్చిన భక్తులకు ఇబ్బందులు లేకుండా దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక ఏర్పాటు చేశారు.

Tags :

మరిన్ని