Yadadri: యాదాద్రి క్షేత్రానికి పోటెత్తిన భక్తజనం

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు.

Published : 19 May 2024 12:36 IST

ఆదివారం సెలవు రోజు కావడంతో యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. దీంతో స్వామివారి ఉచిత ప్రవేశ దర్శనానికి సుమారు 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పడుతోంది. ప్రసాద విక్రయ శాల, సత్యనారాయణ స్వామి వ్రత మండపం, కొండ కింద విష్ణు పుష్కరిణి, కారు పార్కింగ్, బస్టాండ్‌లలో భక్తుల సందడి నెలకొంది.

Tags :

మరిన్ని