Jyothi Surekha: ఆర్చర్‌ జ్యోతి సురేఖకు విజయవాడలో ఘనస్వాగతం

ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన వెన్నం జ్యోతి సురేఖకు విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

Published : 30 Apr 2024 11:25 IST

ఆర్చరీ ప్రపంచకప్‌లో మూడు పసిడి పతకాలతో సత్తా చాటిన వెన్నం జ్యోతి సురేఖ.. విజయవాడ చేరుకున్నారు. ఆమెకు విజయవాడ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. డిప్యూటీ కలెక్టర్ అసోసియేషన్ ప్రతినిధులు, క్రీడా శాఖ అధికారులు ఆమెను అభినందించారు. ప్రపంచకప్‌లో కాంపౌండ్‌ మహిళల వ్యక్తిగత, టీమ్‌, మిక్స్‌డ్‌ విభాగాల్లో జ్యోతి పసిడి పతకాలు సాధించిన సంగతి తెలిసిందే.

Tags :

మరిన్ని