గన్నవరంలో ఉద్రిక్తత.. తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిపై దాడికి యత్నం
కృష్ణా జిల్లా గన్నవరంలో శుక్రవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. కడప తెదేపా (TDP) ఎమ్మెల్యే అభ్యర్థి మాధవి విజయవాడకు కారులో వస్తూ గన్నవరంలో వైకాపా ఫ్లెక్సీలను గమనించారు. ఫొటోలు తీసి ఫ్లెక్సీల విషయం సీ-విజిల్ యాప్ ద్వారా ఈసీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇది గమనించిన గన్నవరం వైకాపా అభ్యర్థి వంశీ వర్గీయులు ఆమెపై దాడికి యత్నించారు. మాధవి కారు కదలనీయకుండా వాహనాలు అడ్డుపెట్టారు. విషయం తెలుసుకున్న స్థానిక తెదేపా అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అక్కడి నుంచి పంపించి వేశారు.
Updated : 22 Mar 2024 19:28 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఊబకాయులకు మూత్రపిండాలకు ముప్పు ఎక్కువే
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9AM
-
టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
-
భారత్కు ఉపన్యాసాలివ్వొద్దు..: భారతీయ-అమెరికన్ చట్టసభ్యులు
-
ఇష్టారాజ్యంగా ప్రైవేటు ఆస్తుల స్వాధీనం చెల్లదు: సుప్రీంకోర్టు
-
అంతర్గత నివేదికలతో ఆశల మేడలు.. భాజపా, కాంగ్రెస్ శిబిరాల్లో ఒకే ధీమా