టిష్యూ పేపర్పై ‘బాంబ్’ నోట్.. విమానంలో కలకలం
టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.
దిల్లీ: టేకాఫ్కు సిద్ధంగా ఉన్న ఓ విమానంలో ‘బాంబ్’ అని రాసి ఉన్న టిష్యూ పేపర్ లభ్యం కావడం కలకలం రేపింది. దీంతో సిబ్బంది, ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి గుజరాత్లోని వడోదరకు వెళ్లేందుకు ఎయిరిండియా విమానం సిద్ధమైంది. అంతలోనే అందులోని వాష్రూంలో ‘బాంబ్’ అని రాసిఉన్న ఓ టిష్యూ పేపర్ సిబ్బంది కంటపడింది. దీంతో అప్రమత్తమైన వారు వెంటనే ప్రయాణికులు అందరినీ కిందకు దించేశారు. సీఐఎస్ఎఫ్తోపాటు దిల్లీ పోలీసులకు సమాచారం అందించారు. భద్రతా సిబ్బంది విమానంలో క్షుణ్నంగా తనిఖీలు చేపట్టారు. అయితే, అనుమానాస్పద వస్తువులు లభ్యం కాకపోవడంతో అధికారులు, ప్రయాణికులు, విమాన సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. ‘‘ప్రయాణికులు అందరినీ సురక్షితంగా కిందకు దించేశాం. భద్రతా సంస్థలు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టాయి. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించేందుకు యత్నించాం. వారికి వసతి సౌకర్యం కల్పించాం. వారితోపాటు సిబ్బంది భద్రతకు కట్టుబడి ఉన్నాం’’ అని ఎయిరిండియా ఓ ప్రకటనలో తెలిపింది. అనంతరం ప్రత్యేక విమానంలో ప్రయాణికులు వడోదరకు బయలుదేరి వెళ్లారని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బాలికల కోసం అస్సాం సర్కార్ కొత్త స్కీమ్.. ప్రతి నెలా రూ.1000
బాల్య వివాహాలను అరికట్టడమే లక్ష్యంగా అస్సాం ప్రభుత్వం ఓ పథకాన్ని ప్రవేశపెట్టనుంది. -
కోర్టు ప్రాంగణంలో పాక్ అనుకూల నినాదాలు.. గ్యాంగ్స్టర్కు దేహశుద్ధి
విచారణ నిమిత్తం కోర్టుకు తీసుకెళ్లగా ఆ ప్రాంగణంలో గ్యాంగ్స్టర్ జయేశ్ పూజారి పాక్ అనుకూల నినాదాలు చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. -
ఎర్రకోటపై దాడి కేసులో ఉగ్రవాదికి క్షమాభిక్ష తిరస్కరణ
24ఏళ్ల క్రితం ఎర్రకోటపై దాడికి పాల్పడిన పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ ఆరిఫ్ అలియాస్ అష్ఫాక్ క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తిరస్కరించారు. -
ఎన్నికల విధుల్లో వాయుసేన దూకుడు.. 1000 గంటలకుపైగా హెలికాప్టర్ల సేవలు
ఎన్నికలు సజావుగా సాగడంలో వాయుసేన కూడా కీలక పాత్ర పోషించిందని.. తమ హెలికాప్టర్లతో మొత్తంగా వెయ్యి గంటలకుపైగా సేవలందించామని భారత వాయుసేన వెల్లడించింది. -
పోక్సో కేసులో.. యడియూరప్పకు నోటీసులు
పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప (Yediyurappa)కు సీఐడీ నోటీసులు ఇచ్చింది. -
ఒడిశా నూతన సీఎంగా మోహన్ మాఝి ప్రమాణం
ఒడిశా నూతన ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝి (Mohan Majhi) ప్రమాణ స్వీకారం చేశారు. -
చంద్రబాబు ప్రమాణస్వీకారం వేళ.. అమిత్ షా, తమిళిసై చర్చించుకుంటున్న వీడియో వైరల్
కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah), భాజపా నాయకురాలు తమిళిసై (Tamilisai Soundararajan) ఏదో అంశంపై చర్చించుకున్నారు. ఆ వివరాలేవీ బయటకురాకపోయినా.. వారు చర్చించుకుంటున్న దృశ్యాలు మాత్రం వైరల్గా మారాయి. -
వారణాసిలో మోదీ ఓటమి నుంచి తప్పించుకున్నారు: రాహుల్ గాంధీ
కేరళలో జరిగిన ఓ సమావేశంలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. -
రోడ్డు ప్రమాదంలో ఒడిశా కొత్త సీఎం పీఏ దుర్మరణం
ఒడిశా ముఖ్యమంత్రిగా మంగళవారం ఎంపికైన మోహన్ చరణ్ మాఝీ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) చందన్ కుమార్ మహాపాత్ర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. -
రియాసీ దాడిలో ఉగ్రవాది ఇతడే.. స్కెచ్ విడుదల చేసిన పోలీసులు
రియాసీ ఉగ్రదాడి ఘటనలో కీలక నిందితుడి స్కెచ్ను పోలీసులు తయారుచేశారు. మరోవైపు కథువాలో రెండో ఉగ్రవాది కూడా హతమయ్యాడు. -
టికెట్ లేని ప్రయాణికులతో వందే భారత్ రష్.. స్పందించిన రైల్వే శాఖ
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన వందేభారత్.. టికెట్ లేని ప్రయాణికులతో కిక్కిరిసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. దీనిపై రైల్వేశాఖ స్పందించింది. -
జూన్ 24న కొలువుదీరనున్న కొత్త లోక్సభ..
సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. దీంతో కొత్తగా కొలువుదీరిన 18వ లోక్సభ సభ్యులు ప్రమాణస్వీకారం చేయడానికి తేదీలు ఖరారయ్యాయి. -
నా భర్త సీఎం అని.. టీవీలో వచ్చాకే తెలిసింది..!
ఒడిశాకు కొత్త ముఖ్యమంత్రి ఎన్నికైన మోహన్చరణ మాఝి (Mohan Charan Majhi) నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎం పదవి దక్కడంపై ఆయన కుటుంబం అమితానందం వ్యక్తం చేస్తోంది. -
ట్యాంకర్ మాఫియా నీటిని మింగేస్తుంటే ఏం చేస్తున్నారు..?
దేశ రాజధాని దిల్లీ(Delhi) ఎదుర్కొంటున్న నీటిఎద్దడి(Water Crisis)పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ప్రభుత్వానికి కోర్టు పలు ప్రశ్నలు వేసింది. -
రామమందిర నిర్మాణంతో అయోధ్యలో ఓట్లు వస్తాయనుకున్నారు..శరద్ పవార్
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రజలు తమ ఓట్ల ద్వారా ప్రజాస్వామ్యానికి ఉన్న శక్తిని చాటి చెప్పారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్ పవార్ అన్నారు. -
భారత్లో నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ఫ్లూ.. వెల్లడించిన డబ్ల్యూహెచ్ఓ
పశ్చిమ్ బెంగాల్కు చెందిన నాలుగేళ్ల చిన్నారికి బర్డ్ఫ్లూ H9N2 వేరియంట్ సోకిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. -
జమ్మూకశ్మీర్లో కలకలం సృష్టిస్తోన్న వరుస ఉగ్రఘటనలు
జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir)లో గత మూడు రోజుల వ్యవధిలో మూడుసార్లు ఉగ్రవాదులు పంజా విసిరారు. ఈ వరుస ఘటనలతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. -
ఆరుగురు మంత్రులు శత కోటీశ్వరులు
కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మంత్రి మండలి సభ్యుల్లో 99 శాతం లేదా 70 మంది కోటీశ్వేరులేనని ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం (ఏడీఆర్) మంగళవారం ఓ నివేదికలో తెలిపింది. -
భద్రత విధుల నుంచి తప్పుకోనున్న ‘బ్లాక్ క్యాట్’
దేశంలోని ప్రముఖుల భద్రత తీరుతెన్నులను కేంద్రంలో కొత్తగా కొలువుదీరిన మోదీ ప్రభుత్వం సమీక్షించనున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. -
ఒడిశా సీఎంగా మోహన్చరణ మాఝి
గిరిజన నేత మోహన్చరణ మాఝి ఒడిశా ముఖ్యమంత్రిగా బుధవారం పదవీ ప్రమాణం చేయనున్నారు. మంగళవారం సాయంత్రం భువనేశ్వర్లోని భాజపా కార్యాలయంలో ఆ పార్టీ సభాపక్ష నేతల సమావేశం జరిగింది. -
జీ7 సదస్సుకు ఇటలీ వెళ్లనున్న ప్రధాని
ప్రధానమంత్రిగా మూడోవిడత బాధ్యతలు చేపట్టాక నరేంద్ర మోదీ ఈ వారం తన తొలి విదేశీ పర్యటనకు బయలుదేరి వెళ్లనున్నారు. ఇటలీలో జరగనున్న జీ7 అధునాతన ఆర్థికవ్యవస్థల వార్షిక శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరవుతారు.
తాజా వార్తలు (Latest News)
-
కెనడాతో అదే సమస్య - జీ7 సదస్సు వేళ భారత్ ఆందోళన
-
ఆ ప్రచారం నమ్మొద్దు.. సాధారణ బస్సు ఛార్జీలు పెంచలేదు: టీజీఎస్ ఆర్టీసీ
-
తిరుమల చేరుకున్న సీఎం చంద్రబాబు.. ప్రొటోకాల్ పాటించని అధికారులు
-
బాలికల కోసం అస్సాం సర్కార్ కొత్త స్కీమ్.. ప్రతి నెలా రూ.1000
-
మేం గెలుస్తామని చెప్పావు.. ఇప్పుడు చూడు ఇలా: యువీతో అఫ్రిది
-
కువైట్ అగ్నిప్రమాదం.. మోదీ ఉన్నత స్థాయి సమీక్ష.. గల్ఫ్కు కేంద్రమంత్రి పయనం