Simhadri Temple: సింహాద్రి అప్పన్న క్షేత్రానికి పోటెత్తిన భక్తులు

వైశాఖ పౌర్ణమి సందర్భంగా సింహాద్రి అప్పన్న క్షేత్రానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.

Published : 23 May 2024 14:10 IST

విశాఖపట్నం జిల్లా సింహాచలం క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. వైశాఖ పౌర్ణమి ఉత్సవం నేపథ్యంలో ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అడివివరంలోని వరాహ పుష్కరిణి చెరువు వద్ద పుణ్యస్నానాలు ఆచరించి అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. అర్చకులు అప్పన్న స్వామికి రెండో విడత చందన సమర్పణ సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.

Tags :

మరిన్ని