Yadadri Temple: యాదాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు.

Published : 25 May 2024 12:52 IST

ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. వేసవి సెలవులు ముగుస్తుండటంతో స్వామివారి దర్శనానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు. దీంతో ధర్మ దర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. కొండ కింద ఆధ్యాత్మిక వాడలోని రహదారులు, పార్కింగ్ ప్రాంతం, వ్రత మండపం, పుష్కరిణి ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయాయి.

Tags :

మరిన్ని