AP News: రైతు భరోసా పథకం అమల్లో .. జగన్‌ మార్క్‌ జిత్తులు

కోత కోసి కుప్పనూర్చేవాడు రైతన్న.. మాటల కోతలు కోసి కర్షకుల్ని అప్పుల్లో ముంచేవాడు జగనన్న.. దేశానికే అన్నం పెట్టేవాడు రైతన్న.. అలాంటి రైతులకే సున్నం పెట్టేవాడు మన జగనన్న.

Published : 23 Apr 2024 13:33 IST

కోత కోసి కుప్పనూర్చేవాడు రైతన్న.. మాటల కోతలు కోసి కర్షకుల్ని అప్పుల్లో ముంచేవాడు జగనన్న.. దేశానికే అన్నం పెట్టేవాడు రైతన్న.. అలాంటి రైతులకే సున్నం పెట్టేవాడు మన జగనన్న. ఐదేళ్లలో ఉత్తుత్తి బటన్లు, రాయితీల ఎత్తివేతలతో కర్షకుల కడుపుకొట్టారు జగన్‌. ఒక్కో రైతు కుటుంబానికి రూ.50 వేలు ఇస్తామని చెప్పి.. గద్దెనెక్కాక రూ.37 వేల 500 సరిపెట్టారు. కేంద్రం ఇచ్చే పీఎం కిసాన్‌ నిధి సొమ్మునూ తానే ఇస్తున్నట్లు ఉత్తుత్తి బటన్లు నొక్కారు. రైతు భరోసా పథకం డబ్బులో రూ.9వేల 830 కోట్ల ఎగ్గొట్టారు. 

Tags :

మరిన్ని