చివరి బంతికి వికెట్‌.. హైదరాబాద్‌ విజయ సంబరాలు చూశారా..

సొంత మైదానంలో హైదరాబాద్‌ అదరగొట్టింది. రాజస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఒక పరుగు తేడాతో గెలిచింది. దీంతో ఈ ఐపీఎల్‌లో జైత్రయాత్ర చేస్తున్న రాజస్థాన్‌కు హైదరాబాద్‌ చెక్‌ పెట్టింది.  

Published : 03 May 2024 01:23 IST

ఈ ఐపీఎల్‌లో జైత్రయాత్ర చేస్తున్న రాజస్థాన్‌కు హైదరాబాద్‌ చెక్‌పెట్టింది. నరాలు తెగే ఉత్కంఠపోరులో హైదరాబాద్‌ ఒక పరుగు తేడాతో థ్రిల్లింగ్‌ విక్టరీ నమోదు చేసింది. తొలుత హైదరాబాద్‌ 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేయగా, అనంతరం బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌7 వికెట్లు నష్టపోయి 200 పరుగులు చేసి ఓడిపోయింది. రాజస్థాన్‌కు చివరి ఓవర్‌లో 13 పరుగులు అవసరం కాగా ఐదు బంతులకు 11 పరుగులు చేశారు. ఇక చివరి బంతికి 2 పరుగులు అవసరం కాగా.. భువనేశ్వర్‌ సూపర్‌ బౌలింగ్‌తో పావెల్‌ను ఎల్బీగా ఔట్‌ చేశాడు. అంతే ఇక అప్పటివరకు ఊపిరిబిగపట్టి ఉన్న హైదరాబాద్‌ అభిమానులు ఒక్కసారిగా అనందంతో కేరింతలు కొట్టారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు