TDP: వైకాపా మేనిఫెస్టో తెల్ల కాగితంతో సమానం..!: నందమూరి రామకృష్ణ

వైకాపా మేనిఫెస్టో తెల్లకాగితంతో సమానమని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 02 May 2024 15:01 IST

వైకాపా మేనిఫెస్టో తెల్లకాగితంతో సమానమని ఎన్టీఆర్‌ తనయుడు నందమూరి రామకృష్ణ వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా పెనమలూరు నియోజకవర్గం కానూరులో తెదేపా అభ్యర్థి బోడె ప్రసాద్‌కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థి బోడె ప్రసాద్, ఎంపీ అభ్యర్థి బాలశౌరి అత్యధిక మెజారిటీతో గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కూటమి మేనిఫెస్టో ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే.. ముందు చూపు ఉన్న చంద్రబాబు సీఎం కావాలని ఆకాంక్షించారు. కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

Tags :

మరిన్ని