
తాజా వార్తలు
ఏపీలో కరోనా.. కొత్తగా 173 పాజిటివ్ కేసులు
అమరావతి: ఏపీలో కొత్తగా 173 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో 46,852 నమూనాలను పరీక్షించగా తాజా కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో కొవిడ్ కేసుల సంఖ్య 8,86,418కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కొవిడ్తో 7,142 మంది మరణించారు. గత 24 గంటల వ్యవధిలో కరోనాతో ఎలాంటి మరణం సంభవించలేదు. ఒక్కరోజు వ్యవధిలో 196 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకోగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 1,637 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,26,90,165 పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం బులెటిన్లో పేర్కొంది.
జిల్లాల వారీగా కేసుల వివరాలను పరిశీలిస్తే..
ఇవీ చదవండి..
నల్లపురెడ్డి మాటలు వినిపించలేదా?: జేసీ
అలజడి తగ్గించేందుకే పర్యటన: చినజీయర్ స్వామి
Tags :