TDP: విశాఖలో నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఎన్నికల ప్రచారం

అభివృద్ధికి అవకాశం కల్పించేలా మంచికి మాత్రమే చోటివ్వాలని ఉమ్మడి కూటమి, తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ సతీమణి, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ కుమార్తె తేజస్విని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దక్షిణ  నియోజక వర్గంలో 33వ వార్డు పరిధిలోని నీలమ్మ తల్లి వేపచెట్టు ఆలయాన్ని ఆమె సందర్శించారు.

Published : 25 Apr 2024 22:35 IST

అభివృద్ధికి అవకాశం కల్పించేలా మంచికి మాత్రమే చోటివ్వాలని ఉమ్మడి కూటమి, తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ భరత్ సతీమణి, ప్రముఖ సినీ హీరో బాలకృష్ణ కుమార్తె తేజస్విని పేర్కొన్నారు. గురువారం సాయంత్రం దక్షిణ  నియోజక వర్గంలో 33వ వార్డు పరిధిలోని నీలమ్మ తల్లి వేపచెట్టు ఆలయాన్ని ఆమె సందర్శించారు. ప్రతి ఒక్కరినీ ఆప్యాయంగా పలకరించారు. జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి పార్టీల కూటమి అభ్యర్థులను గెలిపించాలని తేజస్విని విజ్ఞప్తి చేశారు. మహిళలకి మేలు చేసే సూపర్ సిక్స్‌ పథకాలు అందరికీ వివరిస్తున్నట్టు చెప్పారు. 

Tags :

మరిన్ని