Cyclone Montha: మొంథా బలహీనపడినా.. వర్షాలే!

Eenadu icon
By Andhra Pradesh News Desk Published : 31 Oct 2025 06:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

తూర్పుగోదావరి జిల్లాలో 11.7 సెం.మీ. వర్షపాతం

ఈనాడు, విశాఖపట్నం: మొంథా తుపాను తీరం దాటి, వాయుగుండంగా బలహీనపడినా.. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో గురువారం భారీ వర్షాలు కురిశాయి. వాయుగుండం గురువారం ఉదయం ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. శుక్రవారం నాటికి అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని భారత వాతావరణ విభాగం తెలిపింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. శుక్రవారం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వానలు కురిసే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు.

  • బంగాళాఖాతంలో అండమాన్‌ సమీపంలో ఆదివారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని ఐరోపాకు చెందిన వాతావరణ మోడల్‌ సూచిస్తుంది. ఇది బంగ్లాదేశ్‌ వైపు ప్రయాణిస్తుందని అంచనా. 
  • బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు తూర్పుగోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో 11.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు